శ్రీ పంచమి శుభాకాంక్షలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
679 views
2 months ago
🕉️❤️🕉️ “వరవీణా మృదుపాణి వనరుహ లోచను రాణి సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి నిరుపమ శుభగుణలోల నిరత జయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజాసన జనని జయ జయ జయ జయవాణి ఆమె మాట మహిమ సంబరాలు రకరకాలు సరస్వతీదేవి అనగానే హంసవాహనం మీద శ్వేతవస్త్రధారిణిగా, వీణ వాయిస్తూ, మాలాధారిణిగా ఉండే రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. రుగ్వేదం షష్ఠమ మండలంలో 61వ సూక్తం సరస్వతీ సూక్తంగా ప్రసిద్ధి పొందింది. అందులో ఆ దేవి స్వరూప స్వభావాలు, గుణగణాలు, కీర్తి ప్రతిష్ఠలు, ప్రకృతిలో ఆమె ఉనికి వంటివెన్నో ఉన్నాయి. రుగ్వేదంలో సరస్వతీదేవి గురించి అనేక కథలు, స్తోత్రాలు, ఆమె లీలలను, శక్తి యుక్తులను తెలిపే రుక్కులు కనిపిస్తాయి. బ్రహ్మ వైవర్త, పద్మ పురాణాలు సరస్వతిని మాట, బుద్ధి, వివేకం, విజ్ఞానం, కళలు మొదలైన వాటికి అధిదేవతగా పేర్కొన్నాయి. దేవీభాగవతం సరస్వతీదేవిని కేవలం విద్యా ప్రదాయినిగానే కాకుండా సర్వశక్తి ప్రదాయినిగా చెప్పింది. * బ్రహ్మ వైవర్త పురాణంలో మాఘ శుద్ధ పంచమిని విద్యారంభ దినంగా పాటించాలని, సరస్వతీ పూజ చేయాలని ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారు. రాజస్థాన్‌లో వసంత పంచమి పేరుతో ఈరోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. వసంతోత్సవం నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో బహిరంగ ప్రదేశాల్లో సరస్వతీ విగ్రహాలు స్థాపించి పూజలు చేస్తారు. పుస్తకాలను దేవి విగ్రహం వద్ద ఉంచి పూజిస్తారు. అనంతరం ఆటపాటలతో సందడిచేస్తారు. దీన్ని ‘కళా నివేదన’ అంటారు. * ఈ రోజున ‘యవేష్టి’ ఉత్సవాన్ని పెద్దఎత్తున చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ‘యవలు’ అనేవి ఒకరకమైన ధాన్యం. తొలిసారిగా కొత్త ధాన్యాన్ని వండటం మొదలు పెట్టే సందర్భమే యవేష్టి. * మదన పంచమి, వసంత పంచమి అనీ ఈ రోజుకి మరో రెండు పేర్లున్నాయి. రుతువులకు రాజైన వసంతుణ్ణి, మన్మథుణ్ణి శ్రీ పంచమినాడు పూజిస్తారు. ఈ సమయానికే ప్రకృతిలో వసంతరుతు లక్షణాలు కొద్దికొద్దిగా కనిపిస్తుంటాయి. వసంత రుతువు ప్రవేశించడానికి ముందు చేసే ఈ ఉత్సవం ప్రజల్లో పర్యావరణంపై స్పృహను కల్పించడానికి ఉద్దేశించినట్లుగా అర్థమవుతుంది. *తాను చేసే సృష్టికి తోడుగా ఉండేందుకు ఒక స్త్రీ సాన్నిహిత్యం అవసరమై బ్రహ్మ సరస్వతీ దేవిని సృష్టించాడని చెబుతారు. అలా సృజించి ఆమెనే వివాహం చేసుకున్నాడు అనేది పురాణ కథనం. తాను చేసే సృష్టిలోని జీవరాశులన్నిటికీ జ్ఞానం ప్రసాదించేందుకు ఆమెను తన నాలికపై ఉంచాడంటారు. * ఆమె వీణ పేరు ‘కచ్ఛపి’. అరవై నాలుగు కళలకూ ఈ వీణే పుట్టినిల్లుగా చెబుతారు. సంగీతం, సాహిత్యం, బుద్ధి, జ్ఞానం, అన్నీ ఈ వీణలోనే ఉన్నాయని చెబుతారు. ఆమె నివాస స్థానం నాలుకపై భాగం. అందుకే ఎవరి నోట మాట, పాట, సాహిత్యం, సంగీతం, శాస్త్ర ప్రవచనం వెలువడితే వారిని సరస్వతీ అనుగ్రహం ఉన్నవాళ్లని అంటారు. * బ్రహ్మ ఒకసారి అవసరార్థం శివుని అంత్యభాగాన్ని చూశానని అబద్ధం ఆడాడంటారు. అందుకు కోపించిన శివుడు బ్రహ్మకు వాక్కు అయిన సరస్వతీదేవిని నదివి కమ్మని... బయటకు కనబడని విధంగా ఉండమని శపించాడంటారు. అలా అంతర్వాహిని అయిన సరస్వతి నది ఏర్పడిందనేది పురాణ కథనం. * సరస్వతీదేవిని గీః,గౌ, గీర్దేవి, గీర్వాణి, ఉక్తి అనే పేర్లతో పిలుస్తారు. వాణి, భారతి, శారద, వాగీశ్వరి, హంసవాహిని, వరదాయిని, బుద్ధిధాత్రి.. కూడా అమ్మకున్న పేర్లే. పలుకులరాణి, చదువుల తల్లి, లచ్చికోడలు, నలువరాణి, పలుకుచెలి, పొత్తముముత్తో, వెల్లముత్తైదువ, చదువుల వెలది...అంటూ అచ్చ తెలుగులో ముచ్చటతీరా పిలుచుకుంటారు. ఆమె రుక్కు...ఆమె వాక్కు...ఆమె పదం...ఆమె వేదం...ఆమె గీర్వాణి...ఆమే శర్వాణి... సర్వజ్ఞానానికీ అధిదేవత సరస్వతీదేవి. ఆమె ఆవిర్భవించిన రోజు మాఘ శుద్ధ పంచమి. ఈ రోజునే శ్రీ పంచమి అని పిలుస్తారు. #శ్రీ పంచమి శుభాకాంక్షలు. #శ్రీ పంచమి #📚 సరస్వతీ దేవి 🙏 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
587 views
2 months ago
🌿🌼మహా మహిమాన్వితమైన శ్రీ సరస్వతీ దేవి ద్వాదశ నామాలు🌼🌿 🌿🌼సరస్వతీ దేవి అంటే కేవలం చదువుకునే పిల్లలు మాత్రమే పూజించవలసిన శక్తి స్వరూపం కాదు, ఆవిడ జ్ఞానాన్ని ప్రసాదించే దేవత. బ్రహ్మ మేధస్సు సరస్వతీ దేవి, ఆయన సృష్టి రచన సమర్ధవంతంగా చేయడానికి కారణం ఆ తల్లి. చాలా మంది తమ విద్యార్థి దశలో సరస్వతీ దేవిని పుజుంచినా, తమ లౌకికమైన చదువులు పూర్తి కాగానే ఆవిడ పట్ల అంతటి భక్తి భావం కలిగి ఉండరు. సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటేనే, మనిషి తనకు ఏది శ్రేయస్కరమో, ఏది హానికరమో గ్రహించగలిగే విచక్షణ కలిగి ఉంటాడు. కనుక మనకు ఆయుర్దాయం ఉన్నంతవరకూ సరస్వతీ దేవిని పూజిస్తూనే ఉండాలి. సరస్వతీ దేవి యొక్క ద్వాదశ నామాలు ప్రతిరోజూ అందరమూ పఠించాలి. అప్పుడే అమ్మ దయ వలన బుద్ధికుశలత కలిగి, జీవితంలో అభ్యున్నతి కలిగుతుంది.🌼🌿 🌿🌼శ్రీ సరస్వతి దేవి ద్వాదశ నామ స్తోత్రం🌼🌿 సరస్వతి యం తృష్ణ వీణా పుస్తక ధారిణి హంస వాహన సమాయుక్త విద్యాదాన కరీమమ ప్రథమం భారతీయ నామం ద్వీతియంచ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంస వాహిని పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారి సప్తకం ప్రోక్రమష్టకం నవమం భుద్ది ధాత్రి చ దశమం వరదాయిని ఏకాదశం క్షిద్రగుంట ద్వాదశం భువనేశ్వరి! బ్రాహ్మి ద్వాదశ నామ్న త్రిసంధ్య య పడెన్ నర సర్వ సిద్ధి కరి తస్య ప్రసన్న పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపి సరస్వతి! ఇతి శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం! #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #శ్రీ పంచమి #📚 సరస్వతీ దేవి 🙏 #శ్రీ పంచమి శుభాకాంక్షలు. #శ్రీ సరస్వతి దేవి జయంతి / వసంత పంచమి విశిష్టత
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
680 views
2 months ago
ఈ రోజు వసంత పంచమి శుభవేళ శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో శ్రీ శృంగేరి శారదా మాత. మఠం నుండి శారదాంబ అమ్మవారి దివ్య దర్శనం.🙏🏻🙏🙏💐💐 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #శ్రీ పంచమి #📚 సరస్వతీ దేవి 🙏 #శ్రీ పంచమి శుభాకాంక్షలు. #శ్రీ సరస్వతి దేవి జయంతి / వసంత పంచమి విశిష్టత
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
632 views
2 months ago
సరస్వతీ నమస్తుభ్యం... 🍁🍁🍁🍁 పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాథలు... పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో కనిపిస్తుంది.. 🍁🍁🍁🍁🍁 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #📚 సరస్వతీ దేవి 🙏 #శ్రీ పంచమి శుభాకాంక్షలు. #శ్రీ పంచమి #శ్రీ సరస్వతి దేవి జయంతి / వసంత పంచమి విశిష్టత
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
687 views
2 months ago
వసంత పంచమి – జ్ఞాన వికాసానికి పిలుపు పండుగలు అనేవి కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఒక దిశను చూపించే సాంస్కృతిక సందేశాలుగా నిలుస్తాయి. అలాంటి పండుగలలో వసంత పంచమికి ప్రత్యేక స్థానం ఉంది. మాఘ మాస శుక్ల పక్ష పంచమి నాడు వచ్చే ఈ పర్వదినం, ప్రకృతిలో వసంత ఋతువు ఆరంభాన్ని ప్రకటించడమే కాకుండా, మానవ జీవితంలో జ్ఞానం–వెలుగు–ఆశల ఆవిర్భావాన్ని సూచిస్తుంది. శీతాకాలపు నిర్జీవతను విడిచి ప్రకృతి మళ్లీ నవజీవనం పొందే సమయం ఇదే. చెట్లకు పూత వస్తుంది, పొలాలు పసుపు వర్ణంతో కళకళలాడుతాయి. ఈ సహజ మార్పే వసంత పంచమి యొక్క మౌలిక భావం. మనిషి జీవితం కూడా అలాగే నిరుత్సాహం, అజ్ఞానం నుంచి బయటపడి కొత్త ఆలోచనల వైపు నడవాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. వసంత పంచమి ప్రధానంగా విద్యాదేవి సరస్వతి ఆరాధనతో అనుసంధానమై ఉంది. జ్ఞానం లేకుండా అభివృద్ధి అసాధ్యం అనే సత్యాన్ని భారతీయ సంస్కృతి వేల ఏళ్ల క్రితమే గుర్తించింది. అందుకే ఈ రోజున విద్యారంభం, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇది విద్యను కేవలం ఉపాధికి పరిమితం చేయకుండా, వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదిగా భావించిన దృక్పథాన్ని తెలియజేస్తుంది. నేటి సమాజంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, విలువల ఆధారిత విద్య మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో వసంత పంచమి ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. జ్ఞానం అంటే మార్కులు మాత్రమే కాదు; ఆలోచన, వివేకం, బాధ్యత అనే విషయాలను కూడా గుర్తు చేస్తుంది. సరస్వతి పూజ అనేది దేవిని మాత్రమే కాదు, జ్ఞానాన్ని గౌరవించే సంస్కారాన్ని పూజించడమే. పసుపు రంగు వసంత పంచమికి ప్రతీక. అది ఆనందానికి, సానుకూలతకు, ఆశావాదానికి సంకేతం. నేటి కాలంలో నిరాశ, ఒత్తిడి, పోటీ మధ్య చిక్కుకున్న యువతకు ఈ పండుగ ఒక మానసిక ప్రేరణగా నిలవాలి. జీవితంలో ప్రతిసారీ వసంతం రావాలంటే మన ఆలోచనల్లోనూ, ప్రవర్తనలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇది గుర్తుచేస్తుంది. అందువల్ల వసంత పంచమిని ఒక సంప్రదాయ పండుగగా మాత్రమే కాకుండా, జ్ఞాన వికాసానికి, ఆలోచనా పునరుజ్జీవనానికి, సమాజాన్ని వెలుగుమార్గంలో నడిపించే సందేశ దినంగా భావించాల్సిన అవసరం ఉంది. అజ్ఞానాన్ని తొలగించి, వివేకాన్ని అలవరచుకున్నప్పుడే నిజమైన వసంతం మన జీవితాల్లో నిలుస్తుంది. #శ్రీ పంచమి శుభాకాంక్షలు. #శ్రీ సరస్వతి దేవి జయంతి / వసంత పంచమి విశిష్టత #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #📚 సరస్వతీ దేవి 🙏 #శ్రీ పంచమి