మోహిని ఏకాదశి శుభాకాంక్షలు

🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
685 వీక్షించారు
4 రోజుల క్రితం
*మే 13 బుధవారం అపర ఏకాదశి సందర్భంగా...* _________________________________________ ఏకాదశి వ్రత మహిమ | అపర ఏకాదశీ వృత్తాంతం పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 'భద్రకాళి జయంతి'గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు. ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతారు. అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని.. శాస్త్ర వచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పినట్టు పురాణ వచనం. 'అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగి పోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట. ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలంనుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి. రోజు తలార స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉండి, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం. అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీటాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు, లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని ప్రతిష్టించాలి. అనంతరం స్వామికి ధూప దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు. కొబ్బరికాయ, లవంగం మొదలైన పూజా సామగ్రిని సమర్పించాలి. ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడిచేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. లేదా వినాలి. *🌹🌺🌹 అపర ఏకాదశీ వృత్తాంతం 🌹🌺🌹* శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. దాని మాహాత్మ్య మేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది" అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. "ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే - వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు”. "రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది. రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు. అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ___________________________________________ #🌅శుభోదయం #ఏకాదశి శుభాకాంక్షలు #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #ఆధ్యాత్మిక జ్ఞానామృతం
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
608 వీక్షించారు
4 రోజుల క్రితం
*అపర ఏకాదశి :* సాంసారిక బాధలను తొలగించే ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు. ఉత్తరాదిన భద్రకాళి జయంతి నిర్వహిస్తారు. వైశాఖ కృష్ణపక్షం రోజున వచ్చే ఏకాదశిని అపర లేదా అజల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. నీరు లేకుండా ఉపవాసాన్ని మనం పాటిస్తే, మన దుంఖం, బాధ, అవినీతి లాంటి చెడుగుణాలు దూరమవుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు. శ్రీమహావిష్ణువు అవతరించిన అవతారాల్లో ఒక్కొ అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ముఖ్యంగా వామనావతరాన్ని గురించి చెప్పుకోవాలి. అపర ఏకాదశి రోజున వామనావతరంలో ఉన్న విష్ణువును పూజిస్తారు. ఈ రోజున వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తులు ఎంతగానో నమ్ముతారు. అపర ఏకాదశి రోజున గంగా స్నానం చేయడం వల్ల పూర్వకాల పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉపవాసం పాటించే ప్రజలు సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని గమనించాలి. అలాగే అపర ఏకాదశి సందర్భంగా వ్యక్తి తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. అంటే మాంసాహారాన్ని భుజించకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ___________________________________________ #🌅శుభోదయం #ఏకాదశి శుభాకాంక్షలు #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
595 వీక్షించారు
4 రోజుల క్రితం
*🙏 ఓం నమో నారాయణాయ 🙏* *🌼 అపర ఏకాదశి మహిమ – సంపూర్ణ వివరణ 🌼* *🌺 ఏకాదశి అంటే ఏమిటి?* 🍃🌹హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన తిథులలో ఏకాదశి ఒకటి. ప్రతి పక్షంలో వచ్చే పదకొండవ తిథిని “ఏకాదశి” అంటారు. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో రెండు కలిపి 26 అవుతాయి. 🍃🌹ఏకాదశి అనేది భగవంతుని ఆరాధనకు, మనస్సు పవిత్రతకు, ఇంద్రియ నియంత్రణకు ఎంతో శ్రేష్ఠమైన రోజు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథిగా పురాణాలు పేర్కొంటాయి. 🌺 అపర ఏకాదశి ఎప్పుడు వస్తుంది? 🍃🌹వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని “అపర ఏకాదశి” అని పిలుస్తారు. 🍃🌹ఈ ఏకాదశికి ఇతర ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి: అచల ఏకాదశి భద్రకాళి ఏకాదశి జలక్రీడ ఏకాదశి 🍃🌹“అపర” అనే పదానికి “అపారం”, “అనంతమైనది”, “పరమమైనది” అనే అర్థాలు ఉన్నాయి. అంటే > ఈ ఏకాదశి ఆచరించిన వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. *🌺 వైశాఖ మాస మహిమ* 🍃🌹వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందుకే దీనిని “మాధవ మాసం” అని కూడా అంటారు. 🍃🌹ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, ఉపవాసం కోటి రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతాయి. *🌺 అపర ఏకాదశి కథ* 🍃🌹పురాణాలలో బ్రహ్మాండ పురాణంలో అపర ఏకాదశి మహిమ వివరించబడింది. 🍃🌹ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడును అడిగాడు: > “ప్రభూ! వైశాఖ బహుళ ఏకాదశి మహిమను వివరించండి” అని. 🍃🌹అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వారికి గంగాస్నానం చేసిన ఫలం అశ్వమేధ యాగ ఫలం గోదానం చేసిన పుణ్యం తీర్థయాత్రల ఫలం లభిస్తాయని వివరించాడు. 🍃🌹పాపాలు చేసిన వారికీ కూడా ఈ ఏకాదశి భక్తితో ఆచరిస్తే విముక్తి లభిస్తుందని చెప్పబడింది. *🌺 ఎందుకు బియ్యం తినకూడదు?* 🍃🌹ఏకాదశి రోజున బియ్యంలో రాక్షసాంశం ఉంటుందని శాస్త్రవాక్యం చెబుతుంది. అందువల్ల ఈరోజు అన్న భోజనం నిషిద్ధం. 🍃🌹అందుకే ఉపవాసం లేదా ఫలాహారం చేయడం ఉత్తమం. *🌺 ఉపవాస విధానం* 🌼 ఏకాదశి రోజు చేయవలసినవి ✅ ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి ✅ స్నానం చేసి విష్ణు పూజ చేయాలి ✅ తులసితో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ✅ “ఓం నమో నారాయణాయ” మంత్ర జపం చేయాలి ✅ విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, భగవద్గీత పారాయణ చేయవచ్చు ✅ రోజు మొత్తం భక్తితో గడపాలి 🌼 ఉపవాస రకాలు నిర్జల ఉపవాసం – నీళ్లు కూడా తాగకుండా ఫలాహారం – పండ్లు, పాలు మాత్రమే ఒకపూట సాత్వికాహారం ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆచరించాలి. 🌺 ద్వాదశి పారణ 🍃🌹ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి రోజున ముగించడాన్ని “పారణ” అంటారు. 🍃🌹పారణ సమయంలో: ✅ ముందుగా విష్ణు ప్రార్థన చేయాలి ✅ బ్రాహ్మణుడు లేదా అతిథిని విష్ణు స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి ✅ తర్వాత తాము భోజనం చేయాలి 🍃🌹ఈ రోజు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. ❌ ఉల్లి, వెల్లుల్లి వాడరాదు ❌ మాంసాహారం నిషిద్ధం ❌ ద్వాదశి రోజు వంకాయకూర తినరాదు 🍃🌹ద్వాదశి రోజున తులసి దళాలు కోయకూడదు. విష్ణు పూజకైనా సరే ఆ రోజు కోయడం శాస్త్రవిరుద్ధంగా భావిస్తారు. అందుకే — ఏకాదశి రోజే తులసి దళాలను ముందుగా సిద్ధం చేసుకోవాలి. 🍃🌹ఏకాదశి రోజు గొప్ప పూజలు చేయలేకపోయినా బాధపడవద్దు. > “భక్తి ఉంటే చాలు” అని శాస్త్రం చెబుతుంది. 🍃🌹ఒక్కసారి భక్తితో “గోవిందా”, “నారాయణ”, “శ్రీహరి” అని స్మరించినా అపారమైన పుణ్యం లభిస్తుంది. 🌺 ఈరోజు జపించదగిన నామాలు 🌸 ఓం నమో నారాయణాయ 🌸 శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే 🌸 గోవిందా గోవిందా 🌸 ఓం విష్ణవే నమః 🍃🌹ఈ ఏకాదశి ఆచరించిన వారికి: 🌼 పాప విమోచనం 🌼 మనశ్శాంతి 🌼 ఆరోగ్య క్షేమం 🌼 విష్ణు కృప 🌼 మోక్ష ప్రాప్తి లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. 🌸 “గొప్ప స్తోత్రాల కంటే నిజమైన భక్తి గొప్పది” 🌸 🙏 శ్రీమన్నారాయణుని కృప మీ అందరిపై ఉండాలి 🙏 *🌼 గోవిందా గోవిందా 🌼* ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ___________________________________________ #🌅శుభోదయం #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఏకాదశి శుభాకాంక్షలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
Kasula Venkatesh Goud
897 వీక్షించారు
20 రోజుల క్రితం
#మోహిని ఏకాదశి శుభాకాంక్షలు #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #📰ఈరోజు అప్‌డేట్స్ #😇My Status మోహిని ఏకాదశి : వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. విష్ణువు, తన స్త్రీ అవతారమైన మోహినీ రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకుని ఈ మోహినీ ఏకాదశిని హిందువులు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున ఈ పండుగ జరుపబడుతుంది. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈరోజంతా నియమనిష్ఠలతో శ్రీమన్నారాయణుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండడం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర, లాభదాయక జీవనానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల ప్రఘాడ నమ్మకం.
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
763 వీక్షించారు
20 రోజుల క్రితం
ఏకాదశీ వ్రత మహిమ మోహినీ ఏకాదశి *నేడు ఏప్రిల్ 27 సోమవారం మోహినీ ఏకాదశి సందర్భంగా...* వైశాఖమాసంలోని వచ్చే మోహినీ ఏకాదశి మహిమను సూర్యపురాణంలో వివరించబడింది. "ఓ జనార్దనా! వైశాఖమాసం వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని ఆచరించే పద్ధతి ఏమిటి, దానిని ఆచరించడం వలన కలిగే ఫలితమేమిటి" అని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు అతనితో "ధర్మనందనా! వశిష్ఠుడు శ్రీరామునికి తెలిసిన ఒక కథను నేను నీకు వివరిస్తాను సావధానంగా విను" అని పలికాడు. ఒకసారి శ్రీరాముడు సీతాదేవి వియోగంతో మిక్కిలి వేదనకు గురియై సమస్త పాపాలను, దుఃఖాలను పోగొట్టే ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుని అడిగాడు. అపుడు వశిష్ఠుడు శ్రీరామునితో "రామచంద్రా! నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకరనామాన్ని జపించడం చేతనే మానవులు పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణమానవుల లాభం కొరకు నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను. శ్రీరామా! వైశాఖ శుక్లపక్ష ఏకాదశి, మోహినీ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు పటాపంచలు అవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను ఇపుడు విను” అని అన్నాడు. పవిత్ర సరస్వతీ నదీతీరంలో భద్రవతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడనే రాజు పాలించేవాడు. అతడు చంద్రవంశానికి చెందినవాడు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడనే విష్ణుభక్తుడు కూడ జీవించేవాడు. వైశ్యవర్ణానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణుమందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింపజేసాడు, మంచినీటి బావులను తవ్వించాడు, ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఆహారవసతి కల్పించాడు. ఈ విధంగా తనకున్నట్టి ధనాన్ని సద్వినియోగపరచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. ఎల్లరికి శ్రేయోభిలాషియైనట్టి ఈ విష్ణుభక్తునికి శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, ధృష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారిలో ధృష్టబుద్ధి పరమపాపి. కుమతి, చెడు ప్రవర్తన కలిగినవాడు అయిన ధృష్టబుద్ధి వేశ్యాసాంగత్యంను కలిగినవాడై జూదం, మద్యపానం పట్ల మక్కువ చూపేవాడు. ఇతర ప్రాణులను చంపడంలో, హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. కులకళంకంగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదు. పాపియైన అతడు తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతను రహదారిలో ఒక వేశ్యభుజంపై చేయివేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటి నుండి తరిమివేశాడు. ఈ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీధిలో పడిన ధృష్టబుద్ధి తనకున్న వస్త్రాభరణాలను అమ్ముకొని కొంతకాలం తన పాపకార్యాలను కొనసాగించాడు. ఆ ధనం కూడా ఖర్చు కాగానే నిజమైన కష్టాలు ఆరంభమైనాయి. తగినంత ఆహారం లభించక అతడు బక్కచిక్కిపోయాడు. చింతాగ్రస్తుడైన ధృష్టబుద్ధి ఇక చేసేదిలేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షకభటులకు చిక్కినా అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదలివేసేవారు. కాని ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అపుడు రాజు అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశబహిష్కరణ శిక్షకు గురియైన ధృష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలిదప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను, పక్షులను చంపి పచ్చిమాంసాన్నే తినసాగాడు. విల్లంబులు పట్టుకొని ప్రాణిహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఉండగా ఒకరోజు ధృష్టబుద్ధి కౌండిన్యఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అది వైశాఖమాసం. ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటిచుక్క మీద పడింది. దానితో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన ధృష్టబుద్ధి, ఆ మునికి నమస్కరించి తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపుమని ప్రార్థించాడు. అతని మాటలను వినిన కౌండిన్యఋషి కరుణాంతరంగుడై ఈ విధంగా పలికాడు. “నీ పాపాలన్నీ కూడ శీఘ్రగతి నశించే ఉదాత్తమైన పద్ధతిని చెబుతాను విను. వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే మోహినీ ఏకాదశి మేరుపర్వతమంత పాపరాశినైనా నశింపజేస్తుంది. కనుక ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు”. కౌండిన్యఋషి చెప్పిన మాటలను వినిన ధృష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధి ననుసరించి మోహిని ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రత పాలనంచే అతడు సమస్తపాపదూరుడై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గరుడవాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశీవ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థస్నానం, దానం, యజ్ఞాచరణం వలన కలిగే పుణ్యరాశియైనా ఈ మోహిని ఏకాదశి వ్రతపాలనం వలన కలిగే పుణ్యంతో సరిపోలదు. __________________________________________ HARI 🙏✍🏻 __________________________________________ #🌅శుభోదయం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #మోహిని ఏకాదశి శుభకాంక్షలు 🙏💐 #🙏శుభాకాంక్షలు