అల్లూరి సీతారామరాజు

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
615 వీక్షించారు
1 రోజుల క్రితం
బ్రిటిష్ పాలనకు వ్యతిరేఖంగా పోరాడిన ప్రముఖ తెలుగు విప్లవకారుడు అల్లూరి వారి 102వ వర్ధంతి నేడు! ( 7 - 5 - 2026)! లేదా భారత స్వాతంత్ర్య చరిత్రలోనే ఓక మహోజ్వాలశక్తి, అగ్గి పిడుగు,మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి నివాళులు! మన్యం ప్రజల హక్కుల కోసం తెల్లదొరల అణిచివేతకు వ్యతిరేఖంగా అల్లూరి వారు జరిపిన ' రంప విప్లవం ' ( 1922 - 24) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఓక సువర్ణ అధ్యాయం.గెరిల్లా యుద్ధతంత్రంలో బ్రిటిష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన ఆయనను ' మన్యం వీరుడిగా ' పిలుస్తారు.ఇక ఈ ప్రత్యేక సందర్బంగా ఆ విప్లవ సూరీడు,గెరిల్లా యోధుడు అయిన అల్లూరి విశేషాల గురించి మనం ఒక్కసారి మననం చేసుకుంటే ఆయన 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాడ్రంగిలో జన్మించారు. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామం.ఆ తిరుగుబాటు శిఖరంకు జన్మనిచ్చిన జననీ జనకులు వెంకటరామరాజు,సూర్య నారాయణమ్మ. అదేమాదిరి ఆ విప్లవజ్వాల పోరాట నేపథ్యం గురించి చెప్పాలంటే అటవీ చట్టాల ద్వారా గిరిజనులను బ్రిటిష్ వారు పీడిస్తుంటే,వారి తరపున నిలిచి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు.ముఖ్యంగా రంప విప్లవం ( 1922 - 1924) ద్వారా గిరిజనులను సమీకరించి,బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి మరీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సాహసి,గొప్ప దేశభక్తుడు ఈ అల్లూరి.అలాగే ఆ మహనీయుని పోరుబాట శైలి విషయానికి వస్తే గెరిల్లా యుద్ధతంత్రం అంటే ( విప్లవకారులు దాక్కుని ఆకస్మాతుగా దాడి చేసే పద్దతి,ఈ విద్యలో ఆరితేరేలా తనతో పాటు తన అనుచరులకు మంచి తర్పీదును ఇచ్చిన దీశాలి.ఇక అల్లూరి గారి దేశభక్తిని మెచ్చి,ఆయన ధైర్య సాహసాలకు గుర్తుగా మన్యం వీరుడు అనే బిరుదును సైతం ఇవ్వడం జరిగింది. ( Hero of the Jungle ). ఇక ఆ విప్లవ కెరటం అల్లూరి ప్రాణత్యాగానికి సైతం సిద్దపడి,మన భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చే బృహత్తర లక్ష్యంలో భాగంగా చివరకు అంతిమంగా బ్రిటిష్ వారికి చిక్కి 1924 మే 7న కృష్ణదేవిపేట సమీపంలో అమరులయ్యారు ఈ విప్లవ కణ,అగ్గి జ్వాల అల్లూరి.అలాంటి మహోన్నతుడు, కారణజన్ముడు అయిన ఈ అల్లూరి భారతదేశానికి వెలకట్టలేని,అజరామమైన సేవలు అందించాడు కాబట్టి ఆ మహనీయుని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఏకైక లక్ష్యంతో మన కేంద్రప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ లోని ఓక జిల్లాకు ' అల్లూరి సీతారామరాజు జిల్లాగా ' పేరు పేట్టారు,నామకరణం చేశారు. ఏదిఏమైన అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఓక మహోజ్వాల శక్తి.ఇతడు జరిపిన సాయిధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఓక ప్రత్యేక అధ్యాయం.అగ్గిపిడుగు,మన్నెం వీరుడు, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి.అంతేకాదు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవ పథం వైపు నడిపిన యోధుడు. ఏమైనా ఆంగ్లేయుల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవబాణం ఈ అల్లూరి.అంతేకాదు మన్యం ప్రజల కొరకు ఆయన ప్రాణాలకు సైతం తెగించి,పణంగా పెట్టి మరీ ఆంగ్లేయులపై వ్యతిరేఖంగా పోరుబాట సల్పిన మహోన్నత విప్లవకారుడు ఈ అల్లూరి.అన్నింటికి మించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య శక్తులపై కన్నెర్ర చేసి,వారు మన్నెం ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలను,దురాగాతాలను ప్రతిఘటించి గెరిల్లా యుద్ధతంత్రం ద్వారా వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి,సింహా గర్జన చేసి మరీ వారి తుటాలకు తల ఎత్తుకొని మరీ బలైన ఆరణాల నిజమైన, అంకితభావం,అడుగడుగునా పోరాటపటిమ గల నిఖార్సైనా దేశభక్తుడు ఈ అల్లూరి.అదేమాదిరి ఇలాంటి అసలుసిసలు ఉడుగు రక్తం గల స్వాతంత్ర్య సమరయోధుని అడుగుజాడల్లో నేటి యువత నడిచి ఆయన ఆశయాలు,సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని మరీ ముందడుగు వేస్తే,మున్ముందుకు ఓ తార జువ్వలా దూసుకుపోతే మన భారతదేశం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవడం తథ్యం అనే మాట అక్షర సత్యం.అమర్ రహే! అమర్ రహే! జోహార్ మన్యం వీరుడు అల్లూరి!✍️✍️✍️🇮🇳🇮🇳🇮🇳 - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #అల్లూరి సీతారామరాజు వర్ధంతి💐