హిందు సంప్రదాయాలు మరియు సంస్కృతి

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
538 views
6 days ago
#తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు మంగళసూత్రంలో పగడం, ముత్యం ప్రాముఖ్యత మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు? ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు,స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు. కుజగ్రహ కారకత్వము: అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని,విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము,రక్తస్రావము, గర్భస్రావము,ఋతుదోషములు మొ!! ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు. కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభపలితాలు సమకూర్చగలవు. మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు. ప్రతి స్త్రీ జీవితంలో ఈ పై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
577 views
6 days ago
వాస్తు కర్తరి ప్రారంభం : ఈనెల 4వ తేదీ నుంచి 29 వరకు వాస్తు కర్తరి ఉంది. ఈ సమయంలో శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, ద్వారాలు నిలబెట్టడం వంటి ముఖ్యమైన వాస్తు సంబంధిత పనులు చేయరాదు. #తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
939 views
8 days ago
గృహస్థులు - విధి విధానాలు........!! ఇందులో ఏదైనా పొరపాటు గా ఉంటే క్షమించండి పెద్దలు నాకు ఇది వేరే వాళ్ళు send చేస్తే బాగుందని fb లో పెడుతున్న 🙏 1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. 2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. 3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.. 4.చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు... 5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. 6. కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు. 7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు... 8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు.. 9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు,వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది.. 10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి.. 11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి. 12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.. 13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. 14.పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు. 15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి. 16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు. 17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు. 18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు... 19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు, 20. నీరు,పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు.. 21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది. 22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు... 23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు.. 24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.. 25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి.. 26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు.. 27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు.... 28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు... 29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు.. 30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది. 31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి.... 32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది... #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #😃మంచి మాటలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
631 views
8 days ago
ఎవరెవరికి యేవిధంగా నమస్కరించాలి..............!! విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై జోడించి నమస్కరించాలి. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.. !! #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.1K views
17 days ago
గాజులు అందానికే కాదు...సౌభాగ్యానికి చిహ్నం..........!! గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలని తెలియజేస్తాయి.. ఎరుపురంగు గాజులు శక్తిని.. నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని.. ఉదారంగు గాజులు స్వేచ్ఛ ని.. ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని.. పసుపు రంగు గాజులు సంతోషాన్ని.. నారింజ రంగు గాజులు విజయాన్ని.. తెల్లరంగు గాజులు ప్రశాంతతని.. నలుపురంగు గాజులు అధికారాన్ని.. ఇలా మట్టిగాజులు ఎంతో ప్రత్యేకత,విశిష్టత ఉంది మన సాంప్రదాయం లో స్త్రీ వేసుకునేమట్టిగాజులకి.. అందుకే సుమంగళి స్త్రీ లు తప్పనిసరిగా ధరిస్తారు. ధనవంతులు రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా... ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టిగాజులు ధరించాలని శాస్రం చెబుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమ తో పాటు గాజులు పెట్టి పూజించడం మన సాంప్రదాయం, ఆచారం. ముతైదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. స్త్రీ వేసుకునే గాజులకి ఇంత విశిష్టత వుంది. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
660 views
21 days ago
ధూపం..లేదా సాంబ్రాణి పొగ...............!! సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. ఆదివారం : ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే... ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సోమవారం: దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం: శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టిలోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. బుధవారం : నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది. గురువారం: గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం: లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి. శనివారం : సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
660 views
22 days ago
ఒక్క రాగి చెంబు నీరు – పూర్వీకుల దాహం తీర్చి ఇంట్లో శాంతి, సంపద తెచ్చే సులభ పరిహారం...........!! ఈ చిన్న పరిహారం ఇంట్లో దాగి ఉన్న సమస్యలను (గొడవలు, డబ్బు సమస్యలు, శాంతి లేకపోవడం, అడ్డంకులు) తొలగించడానికి చాలా మంది చేస్తున్నారు. ఇది వాస్తు, పితృదేవతల (పూర్వీకులు) పరిహారంగా పాపులర్ అయింది. ఎవరైనా సులభంగా చేయవచ్చు – ఖర్చు లేదు, మంత్రాలు లేవు, భక్తి మాత్రమే కావాలి. ఎందుకు ఇది చేయాలి? చాలా ఇళ్లలో పూజలు, దీపాలు, శ్రాద్ధాలు అన్నీ సరిగ్గా ఉంటాయి. అయినా సమస్యలు తగ్గవు. కారణం: ఇంట్లో ఉన్న స్త్రీల (భార్య/కోడలు) పుట్టింటి పూర్వీకులు (మామయ్యలు, తాతయ్యలు) ఇంటికి రాలేకపోతారు. వారు బయటే నిలబడి బాధపడతారు. ఆ బాధే ఇంట్లో కష్టాలుగా మారుతుంది (డబ్బు రాకపోవడం, గొడవలు, అనారోగ్యం). ఈ చెంబు నీరు వారికి తృప్తి ఇస్తుంది – వారి దాహం తీరుస్తుంది. ఎలా చేయాలి? (స్టెప్ బై స్టెప్ – చాలా సింపుల్) ఎప్పుడు? అమావాస్య రోజు సాయంత్రం (అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు పూర్వీకులకు ప్రత్యేకం). 1. రెండు చెంబులు తీసుకోండి (రాగి లేదా ఇత్తడి – రాగి బెస్ట్). శుభ్రంగా కడిగి ఉంచండి. 2. ఇంటి బయట (పుట్టింటి పూర్వీకుల కోసం): ఒక చెంబులో నీరు నింపండి (మంచి నీరు). ఇంటి నైరుతి మూల (South-West దిశ – ఇంటి వెనక భాగం లేదా బయటి కుడి వైపు) ఉంచండి. (కొందరు చిటికెడు పసుపు/కుంకుమ వేస్తారు – ఐచ్ఛికం). 3. ఇంటి లోపల (మీ ఇంటి పూర్వీకుల కోసం): మరో చెంబులో నీరు నింపండి. ఇంట్లో తాగునీరు ఉంచే చోట (కిచెన్ లేదా హాల్‌లో) పెట్టండి. 4. ముఖ్యం: రెండు చెంబులు వేరువేరు – ఒకటి బయట, ఒకటి లోపల. ఏమీ చెప్పకుండా, భక్తితో ఉంచండి. తర్వాత రోజు నీటిని మార్చండి (పాత నీటిని తులసి దగ్గర పోయవచ్చు). ఏమి జరుగుతుంది? అమావాస్య నుంచే చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. గొడవలు తగ్గుతాయి, శాంతి వస్తుంది. డబ్బు, ఆరోగ్యం, సంతోషం పెరుగుతాయి. 12 అమావాస్యలు (సుమారు 1 సంవత్సరం) క్రమంగా చేస్తే పెద్ద మార్పు కనిపిస్తుందని చాలా మంది అనుభవాలు చెబుతున్నారు. ఇది సాంప్రదాయ విశ్వాసం మాత్రమే. నమ్మితే చేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మీ ఇంట్లో ఎప్పుడూ శాంతి, సంతోషం, సంపద ఉండాలని కోరుకుంటున్నాము! ఒక్క రాగి చెంబు నీరు... కానీ దాని ఆశీర్వాదం జీవితాన్ని మార్చేస్తుంది! #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు