annayya

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.2K views
18 days ago
*మహాపురుషులు నడిచిన నేల తిరుమల* 🌹🛕🌹 పూర్వం తిరుమలలో వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెళ్ళాలంటే చింతచెట్టు, సంపెంగచెట్ల మార్గం, పెద్దపెద్ద మానులతోనున్న ఓ మార్గంగుండా వెళ్ళేవారు. పంచవన్నెల చిలకల్ని అక్కడ పంజరాల్లో ఉంచేవారట. "కోనేటిరాయుడు లోపలున్నారు, వెళ్ళి దర్శించుకోండి, కానుకలు సమర్పించుకుని, మీ కోరికలు తీర్చుకోండి" అని అరుస్తుండేవట. అది విన్నారు "అన్నమాచార్యులు". గుడిలోకెళ్ళి దర్శనం చేసుకుని బైటకొచ్చి కోనేటిదగ్గర కూర్చున్నారు. 🌹🛕🌹 గుడికెళ్ళి దైవదర్శనంచేసుకుని తిరిగొచ్చేట ప్పుడు కొద్దిసేపు గుడిమెట్లమీద తప్పకుండా కూర్చోవాలి. ఎందుకంటే, మీరు లోపల దర్శనంచేసుకున్న మూర్తిని మళ్ళీ ఓసారి మనసులోకి ప్రతిబింబింపచేసుకుని, ధారణ చేసుకోవాలి. అన్నమాచార్యులవారికి కూడా అలా స్వామి వారి సౌందర్యం జ్ఞాపకానికొచ్చింది, చిలకపలుకులు గుర్తొ చ్చాయి. ఆ క్షణాల్లో చేసిన కీర్తనే...‘‘కొండలలోనెలకొన్న కో నేటి రాయడువాడు...!" అన్నమయ్య అప్పటినుండి ఆ కొండమీదే ఉండిపోయారు. 🌹🛕🌹 తల్లిదండ్రులు పిల్లాడిమీద బెంగతో ఉపవాసా లుచేస్తూ వెతుక్కుంటూ బైల్దేరారు. అక్కడ 'ప్రవర' చెప్తున్న అన్నమాచార్యులనుచూసి 'ఘనవిష్ణుయతి' అనే వైష్ణవ యతి ఆయనకు పంచసంస్కారాలు చేసాడు. అన్నమాచా ర్యులవారు పాపనాశనమెళ్ళి స్నానంచేసి తడిబట్టలు ఆరే సుకుని, అవి ఆరిపోయేలోగా వేంకటేశ్వరస్వామివారిపై శతకం చెప్పేసారు. వేంకటేశ్వరస్వామివారు దర్శనమిచ్చి "నువ్వు సంకీర్తనాయజ్ఞం చెయ్యాలి" అని ఆదేశించినట్టు ఆయనకనిపించింది. 🌹🛕🌹 అప్పటినుండీ ప్రతిరోజూ ఎక్కడికెళ్ళినా తప్ప నిసరిగా ఒక కీర్తన చేసేవారు. "నీ కీర్తనలతో వైరాగ్యమొ చ్చేసి, నా స్వామివారు నాకేసిచూడటం మానేసారు" అని అమ్మవారు చెప్పినట్టనిపించి, ‘‘పలుకు తేనెలతల్లి పవ్వ ళించెను..!" అని పాడి స్వామివారిలో కదలిక తీసుకొచ్చా రు. ఆయన "జ్యోఅచ్యుతానంద జోజోముకుందా...!" అని పాడితే నిద్రే ఎరుగని వేంకటాచలపతి హాయిగా కళ్ళుమూ సుకుని నిద్రపోయారట. ఈరోజుక్కూడా ఉదయం సుప్రభా తసేవ జరిగేటప్పుడు అన్నమాచార్య వంశీయులొస్తారు. 🌹🛕🌹 తాంబూలంలో వెన్నపెట్టిస్తారు వాళ్లకు. రాత్రి కిమళ్ళీ ఉయ్యాలసేవ జరిగేటప్పడు కూడా వాళ్లొచ్చి కీర్త నలుచేస్తారు. 95 సంవత్సరాల నిండుజీవితం గడిపిన అ న్నమయ్య 90వ సంవత్సరమొచ్చినతర్వాతకూడా తంబు రపట్టుకుని శరీరం వణుకుతున్నా గుడిమెట్లపైన కూర్చుని ధ్వజస్తంభం కనబడుతుంటే.. ‘‘శరణుశరణు సురేంద్రసన్ను త / శరణు శ్రీపతి వల్లభ/ శరణు రాక్షసగర్వ సంహార / శర ణు వేంకటనాయకా..!"అని శరణాగతి చేస్తున్నారు. 🌹🛕🌹 అప్పుడు పురంధరదాసుగారు ఎదురొచ్చి ‘‘శర ణుశరణు సురేంద్రసన్నుత / శ్రీపతి సేవిత / శరణు పార్వ తీతనయ / శరణు సిద్ధివినాయక...!" అని ఆయన కీర్తన చేసారు. "మహానుభావా! మీ కీర్తనవింటేగానీ వేంకటేశ్వరు డు నిద్రపోరు, మీపాట వింటేనేగానీ నిద్రలేవరు’’ అని పు రంధరదాసు అంటే, దానికి ‘‘మీరేం తక్కువా?! వేన్నీళ్ళు తీసుకురాలేదని పండరీపురంలో సేవకుడిరూపంలో వచ్చి న స్వామివారి వీపుపైన మీరు చరిస్తే, పాండురంగడి వీపు వాచిపోయింది". 🌹🛕🌹 "అంతగా భగవంతుడ్ని వశంచేసుకున్నవారు మీరు. మీకీర్తి చిరస్థాయిగా నిలిచిఉంటుంది..!" అని అ న్నమాచార్యులవారు ఆశీర్వదించారు. ఇద్దరు మహాపు రుషులు, ఇద్దరు వాగ్గేయకారులు రాజద్వారందగ్గర క ల్సుకున్న మహత్తరక్షణాలవి. వారు నడిచినచోట, ఆది శంకరులు నడిచినచోట, భగవత్ రామానుజులు నడిచినచోట మనం భూలోక వైకుంఠంలో నడుస్తున్నామంటే ఎంత భాగ్యమో కదా! 💠💠💠💠💠💠💠💠💠 #తెలుసుకుందాం #అన్నమయ్య #🎶అన్నమయ్య కీర్తనలు #అన్నమయ్య సంకీర్తనలు🙏🙏 #అన్నమయ్య సంకీర్తనలు
_
826 views
23 days ago
#kannayya #😇My Status 🔰చిలిపి కన్నయ్య 🔰😍మన🫶నిర్మల్ ❤️
_
697 views
23 days ago
#kannayya 🔰చిలిపి కన్నయ్య 🔰😍మన🫶నిర్మల్ ❤️