పుత్రద ఏకాదశి విశిష్టత

S.HariBlr (Bangalore)
1.2K views
3 months ago
#😇My Status #పుత్రద ఏకాదశి విశిష్టత *హిందూ సంప్రదాయంలో ప్రతి నెలకూ ఒక విశిష్టత ఉంది. అలాగే పుష్య మాసానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ పుష్య మాసం శని భగవానుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే పండుగలు, వ్రతాల్లో పుత్రదా ఏకాదశికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏకాదశిని పర్వదినాన్ని సంతానం కోరుకునే దంపతులు ఆచరిస్తారు. ఈ పుత్రదా ఏకాదశి ఏడాదిలో రెండు సార్లు వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో.. రెండోది పుష్య మాసంలో వస్తుంది. ఈసారి పుత్రదా ఏకాదశి రోజు సిద్ధి యోగం, శుభ యోగం, రవి యోగాలతో పాటు భద్రవాస యోగం కలవనున్నాయి. ఈ రోజున పుత్రదా ఏకాదశి రోజు వ్రతం ఆచరించడం వల్ల, ఆ లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో పాటు కుటుంబంలో సంతోషం, సౌభాగ్యం, సిరి సంపదలు, వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. అందుకే దంపతులిద్దరూ కలిసి ఈ పుత్రదా ఏకాదశి ఉపవాస దీక్షను ఆచరిస్తారు.* *పుత్రదా ఏకాదశి డిసెంబర్‌ 2025 తేదీ - శుభ ముహూర్తం* *తెలుగు పంచాంగం ప్రకారం పుష్య మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి 2025 డిసెంబర్ 30వ తేదీన ఉదయం 7.50 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 2025 డిసెంబర్ 31వ తేదీ ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. హిందూ సనాతన ధర్మంలో సూర్యోదయ తిథికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 30వ తేదీన ఈ పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. అలాగే వైష్ణవ సంప్రదాయం అనుసరించే వారు మాత్రం డిసెంబర్ 31వ తేదీన జరుపుకుంటారు.* *పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరణ విధానం* *వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం... పుత్రదా ఏకాదశి వ్రతం (Putrada Ekadashi Vrat) ఆచరిస్తే సంతానభాగ్యం కలుగుతుందని విశ్వాసం. పుత్రదా ఏకాదశి రోజు వ్రతం చేయాలనుకునే దంపతులు ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేయాలి. ఆ రోజున నిష్టగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం రోజు తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజించాలి. అంతే కాకుండా విష్ణు సహస్రనామం, విష్ణు మంత్రాలు, నారాయణ కవచం వంటి స్తోత్రాలను పారాయణం చేయాలి. రాత్రి వేళ భగవంతుని కీర్తనలతోనూ, భాగవత కథలతోనూ భక్తి మార్గంలో కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి.* *మరుసటి రోజు ద్వాదశి పూజ ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం తల స్నానం చేసి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకని... సమీపంలోని దేవాలయానికి వెళ్లి శ్రీమహావిష్ణువు దర్శనం చేసుకోవాలి. అనంతరం ఇంటికి వచ్చి ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ మరియు తాంబూలాలతో సంతృప్తి పరచాలి. అనంతరం ఉపవాసం విరమించాలి. ఈ విధంగా ఎవరైతే ఈ పుత్రదా ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆచరిస్తారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుందనేది శాస్త్ర వచనం.* *ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.* ꧁హరేకృష్ణ꧂