om sri matre namaha 🙏🙏👏🐍

Rochish Sharma Nandamuru
584 వీక్షించారు
1 రోజుల క్రితం
🌼🌿 రాహుకాలం దుర్గ పూజ 🌼🌿 రాహుకాలం అనగానే, ఆ సమయంలో ఎదైన పని మీద బయలుదేరటంగాని, కొత్తగా..ఏదైనా ..పనిని మొదలు పెట్టడం గాని చెయ్యొద్దు అని మన ఇళ్ళలో అంటూ ఉంటారు. కాని అదే రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. రాహువు..మంత్రాలకు..అధిదేవత. రాహువుకు దుర్గాదేవి..అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అందుకే గ్రహణ సమయంలో..మంత్రం తీసుకున్నవాళ్ళు మంత్రజపం చేసుకుంటారు. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకొని, దీపారాధన చేసి, ఏదైనా శ్రీదుర్గా స్తోత్రం...చదివి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరో రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడ్తారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది.. లేదూ ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో..బయట తులసి కోట దగ్గర పెట్టాలి..ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు..ఒకరే వెలిగించాలి.. రాహుకాల సమయం :.. సోమవారం - ఉ 7:30 -9:00 మంగళవారం - మ 3:00 -4:30 బుధవారం - మ 12.00 - 1:30 గురువారం - మ 1:30 - 3:00 శుక్రవారం - ఉ 10:30 - 12:00 శనివారం - ఉ 9:00 - 10:30 ఆదివారం - సా 4:30 - 6:00 సూర్యోదయం..రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది..దాన్నిబట్టి రాహుకాల టైమ్ మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి...ముందు ఒక అరగంట..వెనుక ఒక అరగంట టైం వదిలి మధ్యకాలం తీసుకోండి.అంటే ఉదాహరణకు.. సోమవారం ..ఉ 7.30 to 9.00 అంటే 8 to 8.30 ఇలా చూసుకోండి. 🌿🌼🙏ఓం దుం దుర్గాయై నమః🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🔱శ్రీ దుర్గ దేవి
Rochish Sharma Nandamuru
924 వీక్షించారు
8 రోజుల క్రితం
కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం..!! సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు. (ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. ) ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా వినాయకుడు" దర్శనమిస్తాడు. (ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు) కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పొతుంది , మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది. కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి. కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి) అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ సతాం" అనే దివ్య వాక్కు గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది. తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది, భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది. కావున భక్తులెల్లరు కామాక్షితల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి..స్వస్తీ... 🌿🌼🙏ఓం శ్రీ కామాక్షీ దేవ్యై నమః🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🌿🌼🙏శ్రీ కామాక్షి అమ్మవారు🙏🌼🌿
Rochish Sharma Nandamuru
3.7K వీక్షించారు
29 రోజుల క్రితం
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్... ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించడం. బ్రహ్మదేవుని వరం పొందిన మహిషాసురుడు, ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొంది, ముల్లోకాలను పీడించసాగాడు. దేవతలు అతనిని ఓడించలేక త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు వేడారు. అప్పుడు ఆ త్రిమూర్తులు తమ శక్తులను ఏకీకృతం చేసి, ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవిని సృష్టించారు. ప్రతి దేవత తమ ఆయుధాలను ఆమెకు అందించగా, ఆమె సింహవాహినియై మహిషాసురునితో తొమ్మిది రాత్రులు భీకరంగా యుద్ధం చేసి, పదవ రోజున అతనిని సంహరించింది. ఈ విజయానికి గుర్తుగా పదవ రోజును "విజయదశమి"గా జరుపుకుంటారు. నవరాత్రులలో ప్రతి రోజూ దుర్గాదేవి యొక్క ఒక్కో రూపాన్ని పూజిస్తారు. ఈ తొమ్మిది రూపాలను "నవదుర్గలు" అని అంటారు. 1. శైలపుత్రి: పర్వతరాజైన హిమవంతుని కుమార్తె. ఈమె వృషభవాహని. యోగసాధనలో మూలాధార చక్రానికి అధిదేవత. 2. బ్రహ్మచారిణి: తపస్సు ఆచరించే కన్య. ఆమె పరమశివుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేసింది. ఈమె జపమాలను, కమండలాన్ని ధరించి ఉంటుంది. 3. చంద్రఘంట: శిరస్సున అర్ధచంద్రుని ధరించిన రూపం. ఈమె శాంతిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 4 కూష్మాండ: తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవత. ఈమె అష్టభుజాలతో, వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. 5. స్కందమాత: కుమారస్వామి (స్కందుడు) తల్లి. ఈమె తన ఒడిలో స్కందుడిని కూర్చోబెట్టుకుని ఉంటుంది. 6. కాత్యాయని: కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించిన రూపం. ఈమె మహిషాసురుడిని వధించడానికి అవతరించింది. 7. కాళరాత్రి: నల్లని వర్ణంతో, భయంకరమైన రూపంతో ఉన్నప్పటికీ, తన భక్తులను ఎల్లప్పుడూ శుభ ఫలితాలతో అనుగ్రహిస్తుంది. 8. మహాగౌరి: పరమశివుని కోసం చేసిన కఠోర తపస్సు తర్వాత పొందిన గౌర వర్ణం కలది. ఈమె శాంతికి, స్వచ్ఛతకు ప్రతీక. 9. సిద్ధిధాత్రి: సర్వ సిద్ధులను ప్రసాదించే దేవత. ఈమె కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ప్రతి రోజు అమ్మవారిని ఆ రోజుకు నిర్దేశించిన రూపంలో అలంకరించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, పూజలు నిర్వహిస్తారు. వైభవం మరియు వేడుకలు నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. బొమ్మల కొలువు: దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులలో, నవరాత్రుల సమయంలో "బొమ్మల కొలువు" ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. మెట్లపై వివిధ రకాల దేవతలు, పురాణ గాథలు మరియు సామాజిక జీవనానికి సంబంధించిన బొమ్మలను ప్రదర్శిస్తారు. ఇది సృజనాత్మకతకు మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. నవరాత్రులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ తొమ్మిది రోజులు ఇంద్రియ నిగ్రహంతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ద్వారా మనలోని తామసిక, రాజసిక గుణాలను జయించి, సాత్విక గుణాలను పెంపొందించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇది మనలోని చెడు ఆలోచనలు, అహంకారం అనే మహిషాసురుడిని సంహరించి, జ్ఞానం మరియు ఆనందం అనే దైవత్వాన్ని పొందడానికి ఒక అవకాశం. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జగన్మాత తొమ్మిది అవతారాలను పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాల్గవ రోజు కూష్మాండా దేవి, ఐదవ రోజు స్కంద మాత, ఆరవ రోజు కాత్యాయిని, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మొదలైనవి. ఈ తొమ్మిది రోజులు నవ దుర్గలను రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. అదే సమయంలో ఈ నవరాత్రి పండుగలో నవ దుర్గలకు ఇష్టమైన రంగు చీర లేదా దుస్తులను ధరించి అమ్మవారిని పూజించవచ్చు. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🪔🕉️ అమ్మవారి అనుగ్రహం🙏🚩
Rochish Sharma Nandamuru
2.4K వీక్షించారు
1 నెలల క్రితం
🌿🌼🙏దేవతల సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ ఉగ్ర వారాహీ అమ్మవారు వారాహి దేవి నామాలు...ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది 🌿🌼🙏శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం🙏🌼🌿 అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః !అనుష్టుప్ఛందః ! శ్రీవారాహీ దేవతా ! శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం! సర్వ సంకట హరణ జపే వినియోగః !! *1) పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ !* *తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా !!* *2) వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా !* *అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే !!* *3) నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః !* *సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః !!* 🌿🌼🙏ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం🙏🌼🌿 పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా,ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని. "ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ....." లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలు తో పూజించడం, రేవతి నక్షత్రం రోజు విశేష పూజ కు అనుగ్రహిస్తుంది.. ఈమె వాహనం దున్నపోతు,ఉగ్రంగా కనిపించిన ఏమీ చల్లని తల్లి, అన్యాయంగా దౌర్జన్యం గా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ, పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించ బడుతుంది.లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు ఉంటారు. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా | జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 || భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా | నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 || భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా | మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 || విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా | అరుణాచలశివ 🌹 ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః🌹🙏🚩 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🙏శ్రీ వారాహి అమ్మవారు🕉️