sankatharachaturthi pooja

Anjaiah Soma
2.1K views
13 days ago
తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం శ్వేతార్కమూల గణపతి ఆలయం. 100 ఏళ్లు పైబడిన తెల్ల జిల్లేడు (శ్వేతార్కం) వేరుతో స్వయంభువుగా ఆవిర్భవించిన గణపతి ఆకృతి ఇక్కడ ప్రత్యేకత. ఈ మూల గణపతిని దర్శించుకోవడం వల్ల అభయప్రదాతగా, విఘ్నాలను తొలగించే దేవుడిగా భక్తుల కొంగుబంగారంగా కొలుస్తారు. కాజీపేట శ్వేతార్కమూల గణపతి కాజిపేట జిల్లా హన్మకొండ, ఓం గం గణాధిపతయే నమః🙏 మన దైవం🙏భక్తివైభవము🙏 #🎶గణేశ భజన–మంత్రాలు–ఆరతి🪔 #గణపతి బప్పామోరియా #గణపతి ఆరాధన #గణపతి పూజ #శ్వేతార్క గణపతి
PSV APPARAO
996 views
1 months ago
#సంకష్టహర గణపతి వ్రతం #గణపతి ఆరాధన #గణపతి పూజ #వినాయకుడు.........? #గణపతి *సంకటహర చతుర్ధి వ్రత కథ:* *సంకష్టహర చతుర్థి సందర్భంగా...* 🌸🌺🌸 *గణపతి ప్రార్ధన* 🌸🌺🌸 _శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!_ _ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!!_ *సంకటహర చతుర్ధి వ్రత కథ:* ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_ https://whatsapp.com/channel/0029Va4lcfO3rZZljOv7ab2B `కొత్తగా మన డైలీ విష్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కింది భాగంలో ఉన్న ఫాలో అనే బటన్ తప్పక ప్రెస్ చేయండి.` నిరంతరం ధార్మిక సందేశాలను మీ ఫోన్ లో పొందండి...
PSV APPARAO
1K views
2 months ago
#గణేష్ చతుర్థి ... #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాఘ శుక్ల పక్ష చతుర్థి మాఘి శ్రీ గణేష్ జయంతి 🔱🕉️🙏 #గణేష్ చతుర్థి #గణపతి ఆరాధన #గణపతి పూజ 🔔 *విశేషం* 🔔 ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాఘ శుక్ల పక్ష చతుర్థి మాఘి శ్రీ గణేష్ జయంతి 🔱🕉️🙏 *నేడు శ్రీ గణేష్ జయంతి సందర్భంగా...* *మాఘ శుక్ల పక్ష చతుర్థి, అంటే మాఘి శ్రీ గణేష్ జయంతి* *శ్రీ గణేశుని తరంగాలు మొదట భూమిని చేరుకున్న రోజు, అంటే శ్రీ గణేశుడు జన్మించిన రోజు, మాఘ శుక్ల పక్ష చతుర్థి. కాబట్టి, మాఘ శుక్ల పక్ష చతుర్థిని శ్రీ గణేష్ జయంతిగా జరుపుకుంటారు.* *శివుడు జ్ఞానమూర్తి- శక్తి ఆనంద స్వరూపిణి. జ్ఞానానందాలు విడిగా ఉండవు. "అతని సంతతానందశక్తి ఆ సరసిజాక్షి" అని శ్రీనాథ మహాకవి మాట. ఈ శివశక్తుల ఏకతత్త్వమే గణపతి- అంటే - జ్ఞానానంద సమాహార స్వరూపం.* *ఈ తత్త్వాన్నే వివిధ ఉపాసనా పద్ధతులుగా, కథలుగా, రూపాలుగా వివరించాయి పురాణాది శాస్త్రాలు. గణపతి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆవిర్భవించినా శివశక్తిమయునిగానే వ్యక్తమవుతాడు.* *ధర్మగతికి, దేవకార్యాలకీ ఆటంకాలు ఎదురై, జగత్ స్థితికి అవరోధాలు కలిగినప్పుడు ఆ విఘ్నాలను పరిహరించడానికై పలు రూపాలతో వినాయ కుడు ఆవిర్భవించినట్లుగా ఎన్నో కథలున్నాయి. అందుకే ఆ స్వామికి ఎన్నో అవతారాలు.* *ఒకప్పుడు జగదంబ భండాసురునితో యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుని సోదరుడు విశుక్రుడు ఒక విఘ్నయంత్రాన్ని తయారుచేసి ప్రయోగించాడని బ్రహ్మాండ పురాణ గాథ. ఆ యంత్రం పేరు 'జయవిఘ్నశిల'. దానిలో ఎనిమిది విఘ్నశక్తులున్నాయని ఆ కథ చెబుతోంది.* *అవి 1. అలస (సోమరితనం), 2. దీన, 3. కృపణ (బేలతనం), 4. నిద్ర, 5. తంద్ర (కునుకు పాటు), 6. క్లీబ, 7. ప్రమీలిక, 8. నిరహంకార.* *ఈ నామాల ఆంతర్యాన్ని పరిశీలిస్తే- ఈ శక్తులు ప్రగతికి అడ్డుతగిలే గుణాలేనని స్పష్టమవుతుంది. దీని బట్టి పురాణకథల సంకేతవాదం మనకు చెప్పే పాఠాలు అవగతమవుతాయి.* *ఏ కార్యరంగంలోనైనా పై ఎనిమిది అడ్డంకులు.* *సోమరితనం, దిగులు, బేలతనం, నిద్ర, కునుకు, కర్తవ్యందాకా వచ్చేట ప్పటికి వెనుదీయడం (క్లీఐ), సంకోచించడం (ప్రమీలిక), 'నావల్ల ఏమి కాదు' అంటూ తనపై తనకు నమ్మకం లేని తనం. వ్యక్తిత్వ వికాసానికి ఇవి శత్రువులు. వీటిని ప్రయోగించగానే శక్తి సేనలు జడమయ్యాయి. నిర్వీర్యమయ్యాయి.* *మనలో నున్న అఖండ ఆత్మచైతన్యం వలన పని చేసే అంతర్గత శక్తులే శక్తిసేనలు. అవి పై ఎనిమిది దుర్గుణాల వల్ల స్తంభించబడడమే ఈ గాథలో ఆంతర్యం.* *ఆ సమయంలో అమ్మవారు (లలితాదేవి) పరమేశ్వరు ని చూసి, ఆ దర్శనం వల్ల కలిగిన స్పందనతో మంద హాసం చేసిందిట. వెంటనే ఆ మందహాస తేజం నుండి గణపతి ఆవిర్భవించాడని ఆ పురాణ కథ.* *శివశక్తి స్పందన వల్ల కలిగిన ఒక ఆనందచైతన్యమే విఘ్నేశ్వరుడు. అదే “నవ్వు” నుండి ఉద్భవించడంలోని ఉద్దేశం.* *అలా వెలువడిన మహాగణపతి అవలీలగా విఘ్న యంత్రాన్ని పిండి చేశాడు. ఎనిమిది విఘ్నశక్తుల్నీ సంహరించాడు. - ఈ ప్రాచీనగాథలోని గొప్ప భావాల్ని పరికిస్తే గణపతి భావం అవగతమవుతుంది.* *జ్ఞానానంద శక్తి నుండి ఉత్సాహం, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగు తాయి. ఇవి ఎలాంటి విపరీతా లనైనా తొలగించి, సిద్ధిని ప్రసాదిస్తాయి. తేటపడిన సారాంశం: గణపతి ఆనందరూపుడు. సంతోషాన్ని ప్రసాదించడమే ఆయన అనుగ్రహం.* *హాస్యరసానికి గణపతిని అధీశునిగా చెప్పడంలోనూ ఇదే ఆంతర్యం. అలాగే 'మోదకం' ఆయనకు నైవేద్యం... అనడంలోనూ ఇదే భావం. ఆమోదం, ప్రమోదం, ఋద్ధి, సిద్ధి, పుష్టి, తుష్టి, కాంతి, సుముఖ (మంచి పనులకు అనుకూలత), దుర్ముఖ (చెడు పట్ల విముఖత)...* *ఇవన్నీ గణపతి శక్తులుగా శాస్త్రం వర్ణిస్తోంది.* *"మోదం' అంటేనే ఆనందం.* *ఒక కార్యం ప్రారంభించేటప్పుడు 'భయం, సంశయం, సంకోచం, ఉద్వేగం' వంటి వికారాలు లేకుండా; ఉత్సాహంగా, ‘తప్పక సిద్ధి లభిస్తుంది' అనే సకారాత్మక (Positive) భావనతో కూడిన ఆనందాన్ని 'ఆమోదం' అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని ‘ప్రమోదం' అని భావించవచ్చు.* *ఆనందపు ఈ రెండు భావాలే గణపతి శక్తులు. 'పూర్ణ'త్వానికి సంకేతా లుగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్లు... వంటివి గణపతికి నైవేద్యాలుగా-ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి. పరిపూర్ణానంద తత్త్వమే గణపతి స్వరూపం... ఆ అనుభవమే మనకు ప్రసాదం.* *పంచభూతాలలో భూమియందున్న ఈశ్వరశక్తిని గణపతిగా ఆరాధిం చడం మరియొక శాస్త్రకథనం.* *ఈ పృథ్వీతత్త్వంలోని చిచ్ఛక్తినే 'మూలాధారశక్తి'గా యోగశాస్త్రం చెబుతోంది. ఈ 'మూలమై'న చక్రానికి అధిష్ఠానం గణపతి. యోగపరంగా ఆది దైవమితడే. ఈ భూతత్త్వ ప్రతీకగానే మట్టితో స్వామి ప్రతిమను చేయడమనే సంప్రదాయం వచ్చింది. ఈ పుడమిలోనే మిగిలిన నాలుగు భూతతత్త్వాలు లీనమై ఉన్నాయి. ఈ భూమిపై, భూమివలన- పార్థివ శరీరంతో బ్రతికే మనం, ఈ తత్త్వంలోనే ఈశ్వరతత్త్వాన్ని ఆవిష్కరించు కోవాలి. ఆ ప్రక్రియే గణపతి ఉపాసన.* *వేదాంత పరంగా... బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే 'వక్ర'మైన మాయాశక్తే ‘విఘ్నం'. దానిని తొలగించి, తన పరతత్త్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్న నాశకుడు, మాయకి నాయకుడు విఘ్నేశ్వరుడు.* *అతడు సచ్చిదానందమూర్తి, నిర్మలమైన, పూర్ణమైన అఖండానందాన్నే తన స్వరూపంగా వ్యక్తం చేస్తున్న గణేశునికి వందనం.* *┈┉━❀꧁జై గణేశాయా꧂❀━┉┈* https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B           🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻