sri panchami(sarswati devi)

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
635 views
2 months ago
🌷🌻#ఈరొజు_వసంత_పంచమి_అనగా #సరస్వతి_దేవి_పుట్టినరోజు🌻🌷 🌻#వసంత_పంచమి_రోజున_సరస్వతి_దేవిని_ఏలా #పూజించాలి_అని_తెలుసుకుందాం_బుజ్జి🌻 🌻"మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః - 🌻 🌻అంటే మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభంనాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. 🌻సరస్వతీ దేవిని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో అర్చించాలి. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు. ఆదిశంకరుడు అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొనడమే గాక శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారద. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని విశ్వాసం. 🌻'యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..' అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారూ. 🌻#సరస్వతి_దేవి_పూజలో_నైవిద్యం_ఏమి_పెట్టాలి🌻 🌻చదువుల తల్లి సరస్వతి దేవి విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థిని, విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్రార్ధిస్తుంటారు. సరస్వతి దేవి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనస్సు ప్రశాంతతను పొందుతుంది. 🌻ఆ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అలకరించబడి వీణను ధరించి ఉంటుంది. తెలుపు స్వచ్ఛతకు, పవిత్రతకు చిహ్నంగా కనిపిస్తుంది. అలాంటి శ్వేతవర్ణంలో అమ్మవారిని దర్శించడం వలన వెంటనే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. విద్యకు అధిదేవత అయిన అమ్మవారి ప్రీతిని పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. 🌻సరస్వతీ దేవికి పాలు, పెరుగు, వెన్న, తేనె, పాయాసం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ తల్లికి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. 🌻#సరస్వతి_చెట్టు🌻 🌻హిందూ ధర్మం లో ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్నికూడా ప్రసాదిస్తుందట. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఆ ఆకు యొక్క ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 🌻విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు.ఈ ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది. మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. మేధా శక్తిని పెంచుతుంది. రకాన్నిశుద్దీకరిస్తుంది. 🌻ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగి శుభం చేకూరుతుంది. ఈ ఆకుతో దైవాన్ని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుందట. అన్ని విఘ్నాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట. 🌻#శ్రీ_పంచమి #అక్షరాభ్యాసం_సందర్భంగా🌻 🌻వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ.. శివాయ సిద్ధం నమ.హ. అని రాసి దిద్దిస్తారు. 🌻#అక్షరాభ్యాసం_ఎలా_చేయాలి 🌻 🌻విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ. 🌻పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం. 🌻సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. 🌻మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు. 🌻ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. 🌻 విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. 🌻#శ్రీ_సరస్వతీ_దేవి_ద్వాదశ_నామ_స్తోత్రం🌻 🌻సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తక ధారిణీ హంసవాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీం తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ. ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం 🌻ఓం శ్రీ మహా సరస్వతీ దేవ్యై నమః🌻 🌻సరస్వతి దేవి స్తోత్రం🌻 సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా | ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః | విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః || శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః | శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || #వసంత పంచమి శుభాకాంక్షలు.. 🙏 #📚 సరస్వతీ దేవి 🙏 #సరస్వతి దేవి #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #sri panchami(sarswati devi)
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
8.7K views
2 months ago
ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీప్రదాయై నమః ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మవక్త్రికాయై నమః ఓం శివానుజాయై నమః ఓం పుస్తకహస్తాయై నమః (10) ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమః ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతక నాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః (20) ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః (30) ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖావిభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకార భూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః (40) ఓం వసుధాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై నమః ఓం భోగదాయై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోమత్యై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యావాసాయై నమః (50) ఓం చండికాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సువీణాయై నమః (60) ఓం సువాసిన్యై నమః ఓం విద్యారూపాయై నమః ఓం బ్రహ్మజాయాయై నమః ఓం విశాలాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం శుభదాయై నమః (70) ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసుర నమస్కృతాయై నమః ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమః (80) ఓం నిరంజనాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః (90) ఓం వంద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాననాయై నమః ఓం రక్త మధ్యాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100) ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108) ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ॥ -- సరస్వతీ అష్టోత్తర శత నామావళి #sri panchami(sarswati devi) #sarasathi devi pooja. sri. panchami #సరస్వతి దేవి #📚 సరస్వతీ దేవి 🙏 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4.4K views
2 months ago
సరస్వతీ దేవి చరిత్ర..!!👍👍💐💐 హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగాసరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం..💐 ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. “శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”. పరాశక్తి, జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9వ శతాబ్దానికి చెందినది పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు.💐 పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటాన్ని గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంధ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది. ఆలయాలు..💐 ఆంధ్రప్రదేశ్...బాసర. ఆదిలాబాదు జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదు కు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. వరంగల్.. హైదరాబాదు కు సుమారు 48 కి.మీ. దూరం లోగల వరంగల్ లోని ఈఆలయం క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. జమ్ము ‍‍& కాష్మీర్.. కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. “నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని” అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది. శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కధనం. దేశమంతటినుండీ పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు. ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు (8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706). అంతకంటె ముందు కాలం గ్రంధం “శారదా మహాత్మ్యం” లో ఈ మందిరానికి వెళ్ళే యాత్రీకుల ప్రయాణ మార్గం వర్ణన ఉంది. ఆ రెండు వర్ణనల ప్రకారం ఈ మందిరం ఎగువ కిషన్‌గంజ్ లోయ ప్రాంతంలో ఉండాలి. శాండిల్య మునికి శారదా దేవి ప్రత్యక్షమైనదని చెప్పే స్థలం లోనే ఈ మందిరం నిర్మింపబడింది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. 10వ శతాబ్దంలో ‘అల్ బెరూని’ కూడా ఈ మందిరాన్ని వర్ణించాడు. కర్ణాటక..శృంగేరి.. కర్ణాటక లోని శృంగేరిలో ఆదిశంకరాచార్యులచే ప్రతిష్టింపబడిన సరస్వతీ మూర్తిని అనేకులు దర్శిస్తారు. తమిళనాడు..కూతనూర్.. తమిళనాడులో ‘కూతనూర్’ వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ వూరు మైలాదుతురై – తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కధ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు. కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది. రాజస్థాన్...పిలానీ.. రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది. ‘బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ సైన్సెస్’ ఆవరణ అయిన విద్యావిహార్‌లో ఈ మందిరం ఉంది. ఖజురాహో ఖండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మింపబడిన ఆధునిక మందిరం ఇది. ఇంకా.. హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. “శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ” అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని ప్రసిద్ధి ఉన్నది. క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము ఉత్తర ప్రదేశ్‌లో మధుర సమీపంలోని ‘ఖజ్జాలీటీలా’లో లభించింది. గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను ముద్రించాడు. అలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడ వంశ రాజుల తన నాణెములపై సరస్వతీ దేవి రూపమును ముద్రించాడు. క్రీ.శ. 10వ శతాబ్దంలో ఒరిస్సా (ఖచ్చింగ్)లో వీణాపాణియైన సరస్వతి విగ్రహం చెక్కబడింది. పాల వంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా (హాష్‌తోష్) మ్యూజియంలోను భద్రపరచబడ్డాయి. ఇంకా వివిధ మ్యూజియంలలో సరస్వతి శిల్పాలున్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోను, ఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఘంటసాలలో క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం లభించింది. క్రీ.శ. 10వ శతాబ్దికి చెందిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. కారెంపూడి, తంజావూరు, హలెబీడు, శ్రీరంగంలలో సరస్వతీ దేవి విగ్రహాలున్నాయి. పేర్లు.. అనేక హిందూ దేవతలకు వలెనే సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి. ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు.. 1. భారతి 2. సరస్వతి 3. శారద 4. హంస వాహిని 5. జగతీ ఖ్యాత 6. వాగీశ్వర 7. కౌమారి 8. బ్రహ్మ చారిణి 9. బుద్ధి ధాత్రి 10. వరదాయిని 11. క్షుద్ర ఘంట 12. భువనేశ్వరి ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి. ఇంకా వివిధ సందర్భాలలో చెప్పబడిన కొన్ని నామములు – అనుష్టుప్, ఆదిత్య, ఈ, ఉక్తి, ఐందవి, కభార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీః, గీర్దేవి, గౌః, జూం, పుస్తకమ్, బ్రాహ్మీ, భగవతీ, భారతీ, భాషా, మహాలక్ష్మీః, వర్ణ రూపిణీ, వాక్, వాణీ, వారీ, శారదా, శ్రీః, సావిత్రీ – అన్న నామాలు వాడబడినాయి. అచ్చ తెలుగులో వివిధ కవులు వాడిన సంబోధనలు – అంచ తత్తడి చెలియ, తూటిగానపు తేజీగల బోటి (హంస వాహిని) కలన తపసి తల్లి (నారదుని తల్లి) చదువుల తల్లి, చదువుల వెలది తల వాకిటను మెలగు చెలువ, పలుకు చెలి (వాగ్రూప) నలువ రాణి, వెన్నుని కొడుకు రాణి (బ్రహ్మకు భార్య) పొత్తము ముత్తో (పుస్తక రూపిణి) మినుకు జేడియ (విద్యుద్రూపిణి) లచ్చి కోడలు (లక్ష్మీ దేవికి కోడలు) వెల్ల ముత్తైదువ (తెల్లని రూపము గలది) ప్రార్ధనలు, స్తోత్రాలు.. తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు. తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునాయుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా పెక్కు సంస్కృత ప్రార్ధనా స్తుతులతో బాటు తెలుగులో కూడా అనేకానేక స్తోత్రాలున్నాయి. ఏదైనా రచన ఆరంభంలో గురువునూ, వినాయకునీ, తల్లిదండ్రులనూ, ఇష్ట దైవాన్నీ స్తుతించడం తెలుగు సాంప్రదాయిక రచనలలో ఆనవాయితీ గనుక సరస్వతి స్తుతులు చాలా ఉండవచ్చును. వాటిలో కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి. శ్రీ సరస్వతీ నిత్యపూజా విధానము శ్రీ సరస్వతీ కవచం శ్రీ మహాసరస్వతీ ధ్యానం పుస్తక పూజ (అక్షరాభ్యాసం) శ్రీ సరస్వతీ ప్రార్ధన శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం శ్రీ సరస్వతీ సహస్ర నామావళి శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రం శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళి శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం శ్రీ సరస్వతీ స్తోత్రము (అగస్త్య ప్రోక్తం) శ్రీ సరస్వతీ సూక్తము శ్రీ సరస్వతీ గాయత్రి. స్వస్తి..!!💐 #sri panchami(sarswati devi) #sarasathi devi pooja. sri. panchami #సరస్వతి దేవి #📚 సరస్వతీ దేవి 🙏 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.3K views
2 months ago
వసంత పంచమి విశిష్టత…........!! ఈ రోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే. మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. మాఘశుద్ధ పంచమినే ‘వసంత పంచమి’ అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు. సరస్వతి దేవికి పూజా విధానం....... వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల, మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. “యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః.. ” శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు. శ్రీ మాత్రే నమః. #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #📚 సరస్వతీ దేవి 🙏 #సరస్వతి దేవి #sarasathi devi pooja. sri. panchami #sri panchami(sarswati devi)
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
6.4K views
2 months ago
#చాలా_మందికి_ఉండే_సందేహం_ఇది. #దసరా_నవరాత్రుల్లో_చేసే_సరస్వతీ_పూజకు, మాఘ మాసంలో వచ్చే వసంత పంచమి పూజకు మధ్య తేడా ఏంటి.. ఏ రోజుకి ఎక్కువ ఫలితం ఉంటుంది... #అక్షరాభ్యాసానికి_విద్యకు_అత్యంత_శక్తివంతమైన_రోజు "వసంత పంచమి"! 📚✍️ మాఘ మాసంలో శ్యామల నవరాత్రులతో పాటు వచ్చే మరొక అత్యంత ముఖ్యమైన రోజు "శ్రీ పంచమి" లేదా "వసంత పంచమి". ఈ రోజు సాక్షాత్తూ ఆ చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మించిన రోజు. 2026లో వసంత పంచమి జనవరి 22 (గురువారం) న వస్తుంది. "మీ పిల్లలు చదువులో రాణించాలా? లేదా మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే జనవరి 22న వచ్చే వసంత పంచమిని అస్సలు మిస్ అవ్వకండి!" 🌟 ఈ రోజు విశిష్టత ఏమిటి? 📖 సరస్వతీ జయంతి:- సృష్టికర్త బ్రహ్మ దేవుని వాక్కు నుండి సరస్వతీ దేవి ఉద్భవించిన రోజు ఇది. అందుకే ఈమెను 'సకల విద్యాధిదేవత' అని పిలుస్తారు. 📑 అక్షరాభ్యాసం:- చిన్న పిల్లలకు విద్యను ప్రారంభించడానికి (అక్షరాభ్యాసం) ఏడాదిలోకెల్లా అత్యంత శ్రేష్ఠమైన ముహూర్తం ఈ రోజే. దీనికి వేరే ముహూర్త బలంతో పనిలేదు. 🕯️ పూజా విధానం & నియమాలు:- ✨ అమ్మవారికి తెలుపు అంటే ఇష్టం. కాబట్టి తెల్లని లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిది. ✨ విద్యార్థులు తమ పుస్తకాలను, పెన్నులను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. ✨ అమ్మవారికి పాలు, పెరుగు, నెయ్యి, చక్కెరతో చేసిన పదార్థాలు లేదా "కేసరి భాత్" (పసుపు రంగు స్వీట్) నైవేద్యంగా పెట్టాలి. ✨ "ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే ఆ పిల్లల నాలుకపై సరస్వతీ దేవి నర్తిస్తుందని నమ్మకం. 🌺 దసరా నవరాత్రుల్లో చేసే సరస్వతీ పూజకు, మాఘ మాసంలో వచ్చే వసంత పంచమి పూజకు మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. 1. శరన్నవరాత్రులు (దసరా) - మూలా నక్షత్రం సరస్వతీ పూజ:- ✨ సందర్భం:- అమ్మవారు దుర్గాదేవిగా రాక్షస సంహారం చేస్తున్నప్పుడు, ఆయుధాలకు శక్తిని ఇస్తూనే, జ్ఞానాన్ని కూడా ప్రసాదించే రూపంగా సరస్వతిని పూజిస్తారు. ✨ దసరా సమయంలో వచ్చే మూలా నక్షత్రం రోజున సరస్వతీ అలంకారం చేస్తారు. మూలా నక్షత్రం సరస్వతీ దేవికి జన్మ నక్షత్రం. ✨ ఎప్పుడు చేయాలి?:- ఇప్పటికే చదువుకుంటున్న వారు, ఉద్యోగాల్లో ఉన్నవారు తమ విద్యలో లేదా వృత్తిలో "విజయం" సాధించడానికి, ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ పూజ చేస్తారు. అందుకే దీన్ని విజయదశమికి ముందు చేస్తారు. 2. వసంత పంచమి (మాఘ మాసం) - సరస్వతీ జయంతి:- ✨ సందర్భం:- పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు సృష్టిని చేసినప్పుడు, లోకానికి వాక్కును (మాటను), జ్ఞానాన్ని ఇవ్వడానికి సరస్వతీ దేవిని ఆవిర్భవింపజేసిన రోజు ఇది. ఇది అమ్మవారి పుట్టినరోజు (Appereance Day). ✨ విశిష్టిత :- ఇది ప్రకృతిలో వసంత కాలం వచ్చే సమయం. కొత్త చిగుళ్లు వచ్చినట్లుగా, మనిషిలో కొత్త జ్ఞానం చిగురించడానికి ఇది శ్రేష్ఠం. ✨ ఎప్పుడు చేయాలి?:- ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి (ఉదాహరణకు: అక్షరాభ్యాసం, సంగీతం నేర్చుకోవడం, కొత్త భాష నేర్చుకోవడం) ఇది అత్యంత బలమైన రోజు. 🤔 ఏది మంచిది? ఎప్పుడు చేయాలి? రెండు సమయాలు మంచివే, కానీ మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి: 📖 అక్షరాభ్యాసం (మొదటిసారి చదువు మొదలుపెట్టడం): దీనికి వసంత పంచమి సాటిలేని రోజు. ఏ ముహూర్తం చూడక్కర్లేదు. 📑 పరీక్షల్లో విజయం లేదా ఉన్నత విద్య: దీనికి దసరా నవరాత్రుల్లో చేసే పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ✨ అర్థమయ్యేలా చెప్పాలంటే: దసరా - విజయం కోసం, ✨ వసంత పంచమి - జ్ఞానోదయం (ప్రారంభం) కోసం. "దసరా నవరాత్రుల్లో వచ్చే సరస్వతీ పూజ మన చదువుకు బలాన్ని (విజయాన్ని) ఇస్తే, వసంత పంచమి పూజ మనకు జ్ఞానాన్ని (ఆరంభాన్ని) ఇస్తుంది. ఈ రెండూ కళ్లు లాంటివి, దేని ప్రాధాన్యత దానిదే!" ✨ ఫలితం:- వసంత పంచమి రోజున సరస్వతీ అష్టోత్తరం లేదా "యా కుందేందు తుషారహార ధవళా..." అనే శ్లోకాన్ని చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. 🔱 "జ్ఞానం కంటే మించిన సంపద లేదు. ఈ వసంత పంచమి మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. 🙏🌺 శ్రీ మాత్రే నమః 🌺🙏 #sri panchami(sarswati devi) #sarasathi devi pooja. sri. panchami #సరస్వతి దేవి #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #📚 సరస్వతీ దేవి 🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2K views
2 months ago
విద్యాభ్యాసానికి ప్రారంభం - అక్షరాభ్యాసం ! అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. "అక్షరం " అంటే క్షయము లేనిది, నాశనం లేనిది అని అర్ధం. మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ....అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా..." అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిని ప్రార్ధించడం ఆచారం! చదువుల తల్లి...అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతిజన్మదినo - మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - శ్రీ పంచమి . దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీ దేవి అహింసా దేవత! చల్లని తల్లి! బ్రహ్మవైవర్త పురాణం లో కూడా ఈ విషయమే ఉంది. ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, శ్రీ రాధాదేవి...అనే ఐదుగురు ప్రకృతి శక్తులనీ..వీరిలో మూడో శక్తులని, వీరిలో సరస్వతి పరమాత్మనుంచి వచ్చిన ఉద్భవించిన వాణికి, విద్య, ఙ్ఞాన ,బుద్ధులనీ చెప్తోంది. అటువంటి ఙ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, ఙ్ఞానప్రాప్తి కలుగుతుంది అని పురాణ వచనం. శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతం లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన ఙ్ఞానం లభిస్తుంది ..నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న...అలాంటి మొదలైన పదార్ధాలు నివేదన చేసి, ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్య ని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు,, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!! #sri panchami(sarswati devi) #sarasathi devi pooja. sri. panchami #సరస్వతి దేవి #📚 సరస్వతీ దేవి 🙏 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕