Mana Hindu devalayalu. మన హిందూ దేవాలయాలు..

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
563 views
12 hours ago
ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం 'శ్రీకాళహస్తి'* --------------------------------- 🌹భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు. **సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి, అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. **ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. **ప్రాణ వాయు లింగం శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతే కాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. **శ్రీకాళహస్తి విశేషాలు శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కధనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తిక్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహా భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరున్ని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతిపురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకూ అడుగడుగునా ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. **భక్తుడికే అగ్రతాంబూలం: సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరున్ని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. పరమేశ్వరుడికి మహా భక్తులైన రోమస మహర్షి, ధూర్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. వేశ్య కన్యలు, యాదవరాజు, వశిష్టుడు ఇలా ఎన్నో కధలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి. **రాహుకేతు శాంతి పూజలు: శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్ట మొదటి గుర్తొచ్చేది రాహు కేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహు కేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహు కేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకే సారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. **చెంగల్వ రాయుని ఆలయం: శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీదేవసేన సమేత చెంగల్వ రాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదే విధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్ర నామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామి వారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్ర గుప్తుడులు ప్రతిష్టించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. **ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్క సారి సందర్శించిన వారి మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు, భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు. తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా ఉంటుంది. #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #తెలుసుకుందాం #శ్రీకాళహస్తి దేవాలయం 🕉
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.7K views
27 days ago
🕉️🛕 #శ్రీశైల_మహిమ – #శ్రీగిరి రహస్యం, #మల్లికార్జునుని కరుణ, దూళి దర్శనం వైభవం 🛕🕉️ 🌺 #ఓం_శ్రీ_భ్రమరాంబికా_సమేత_శ్రీ_మల్లికార్జున_స్వామినే_నమః 🌺 ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🌿 #శ్రీగిరి – "#శ్రీ" అనే మహామంత్ర రహస్యం "#శ్రీగిరి" అన్నప్పుడు అందులో "శ్రీ" అనే పదమే ఈ క్షేత్ర మహిమను తెలియజేస్తుంది. లలితా సహస్రనామం "శ్రీమాతా" అనే నామంతో ప్రారంభమవుతుంది. "#శ్రీ" అనే పదంలోని "శ" కారం, "ర" కారం, "ఈ" కారం బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి అనే త్రిశక్తులను సూచిస్తాయి. ఈ మూడు శక్తులు ఏకమై వెలసిన మహాశక్తి స్వరూపిణి శ్రీ భ్రమరాంబికాదేవి. అందుకే #శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ పవిత్ర పర్వతంపై అడుగుపెట్టిన భక్తుడు సరస్వతీ కటాక్షమో, లక్ష్మీకటాక్షమో ప్రత్యేకంగా ప్రార్థించనవసరం లేదు. ఆ పర్వతమే అతనికి కావలసిన అనుగ్రహాన్ని ప్రసరిస్తుంది. అంతటి మహాశక్తి నిండిన దివ్యక్షేత్రం శ్రీశైలం. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 📖 ఆది #శంకరాచార్యులవారి వచనం > శ్రీశైలశృంగే విబుధాతిసంగే తులాద్రితుంగేపి ముదావసంతమ్ । తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసార సముద్రసేతుమ్ ॥ (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం) యోగతారావళిలో ఆది శంకరులు ఇలా అన్నారు— > సిద్ధింతథావిధమనో విలయాంసమాదౌ శ్రీశైలశృంగ కుహరేషు కదోపలప్స్యే । గాత్రం యథా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడమ్ ॥ #శ్రీశైలంలో మనస్సు అత్యంత త్వరగా లయమై సమాధి స్థితి కలుగుతుందని శంకరాచార్యులు పేర్కొన్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా యోగులు ధ్యానంలో మునిగిపోతారు. వారిని తీగలు చుట్టుకున్నా, పక్షులు గూళ్లు కట్టినా వారికి తెలియదు. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🌿 #సిద్ధుల భూమి – శ్రీశైలం #శ్రీశైలం అనేక ఔషధ మూలికలకు నిలయం. అనేక మంది సిద్ధులు, మహర్షులు, యోగులు తపస్సు చేసిన పుణ్యభూమి. #శ్రీశైలానికి సమీపంలో సిద్ధేశ్వరం అనే క్షేత్రం ఉంది. అక్కడ అమ్మవారికి భక్తులు స్వయంగా కుంకుమ బొట్టు పెట్టవచ్చు. అమ్మవారి నుదుటిని తాకినప్పుడు అది శిలలా కాకుండా సజీవంగా, మృదువుగా అనిపిస్తుందని భక్తుల అనుభవం. #శ్రీశైలం అనేక ఉపాసనలకు ఆలవాలమైన మహాక్షేత్రం. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🛕 #మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఎందుకు వెలిశారు? గణాధిపత్యాన్ని ఎవరికివ్వాలనే సందర్భంలో పరమేశ్వరుడు గణపతి, కుమారస్వామిని పిలిచి— "భూమండలాన్ని తొందరగా ప్రదక్షిణం చేసి వచ్చినవాడికి గణాధిపత్యం ఇస్తాను" అని చెప్పారు. #కుమారస్వామి వెంటనే నెమలి వాహనంపై బయలుదేరి ప్రపంచంలోని దేవాలయాలన్నింటినీ దర్శిస్తూ ప్రదక్షిణం చేయసాగాడు. ఆశ్చర్యకరంగా, ప్రతి ఆలయంలోనూ కుమారస్వామి లోపలికి వెళ్తున్నప్పుడు గణపతి బయటకు వస్తున్నట్లు కనిపించేవాడు. దీనిలో ఒక గొప్ప రహస్యం ఉంది. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🕉️ #దేవాలయ ప్రదక్షిణ రహస్యం దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు కేవలం ప్రధాన దేవతనే కాదు, ఆ దేవాలయంలో కొలువై ఉన్న మహాభక్తులందరికీ నమస్కరించి వారి అనుగ్రహంతోనే స్వామి దర్శనం చేయాలి. శివాలయాలలో నాయనార్లు, విష్ణు ఆలయాలలో ఆళ్వార్లు భక్తి స్వరూపులుగా కొలువై ఉంటారు. వారిని దర్శించకుండా కేవలం ప్రధాన దేవతను మాత్రమే దర్శిస్తే సంపూర్ణ అనుగ్రహం లభించదని ఆచార సంప్రదాయం చెబుతుంది. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🐂 #నంది ఎందుకు పక్కకు తిరిగి ఉన్నాడు? అరుణాచలంలో ఈశాన్య లింగం వద్ద నందీశ్వరుడు కొద్దిగా పక్కకు తిరిగి ఉంటాడు. ఒకసారి కొందరు పరమభక్తులు శివుని దర్శించడానికి వచ్చారు. కానీ నంది మధ్యలో ఉండటంతో వారికి దర్శనం సరిగా కాలేదు. అప్పుడు భక్తుల ప్రార్థన విని పరమేశ్వరుడు— "నా భక్తులకు దర్శనం అయ్యే వరకు కొద్దిగా పక్కకు తిరుగు" అని నందికి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను శిరసావహించిన నంది తన ముఖాన్ని పక్కకు తిప్పాడు. అప్పటి నుండి భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా అలాగే నిలిచి ఉన్నాడని సంప్రదాయం చెబుతుంది. ఇది భక్తులపై పరమేశ్వరుని అపారమైన ప్రేమకు నిదర్శనం. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🪔 #గణపతి విజయం కుమారస్వామి ప్రపంచ ప్రదక్షిణం చేస్తుండగా, గణపతి మాత్రం— "తల్లిదండ్రులే సమస్త లోకాల స్వరూపం" అని భావించి పార్వతీ పరమేశ్వరులకు మూడు ప్రదక్షిణలు చేశాడు. తల్లిదండ్రుల ప్రదక్షిణమే భూమండల ప్రదక్షిణంతో సమానమని భావించిన పరమేశ్వరుడు గణపతికి గణాధిపత్యాన్ని ప్రసాదించాడు. కుమారస్వామి ఓటమిని అంగీకరించినప్పటికీ కొద్దిగా అలిగి కైలాసాన్ని విడిచి వెళ్లిపోయాడు. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🌸 #మల్లికార్జునుని అవతరణ రహస్యం పుత్రవాత్సల్యంతో పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు, పార్వతీదేవి ప్రతి పౌర్ణమి నాడు కుమారస్వామిని దర్శించడానికి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి మల్లెతీగలతో చుట్టబడిన అర్జున వృక్షం క్రింద శివపార్వతులు కొలువుదీరారు. అందుకే— మల్లిక + అర్జున = మల్లికార్జునుడు అనే నామం ప్రసిద్ధి చెందింది. ఈ కథలోని అంతరార్థం— భక్తుడు భగవంతునికి దూరమైతే... భగవంతుడే భక్తుని వద్దకు వస్తాడు. అందుకే శ్రీశైలం భక్తుని కోసం ఎదురుచూసే క్షేత్రం. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🌺 #శ్రీశైలంలో దూళి దర్శనం మహిమ శ్రీశైలంలో అత్యంత విశిష్టమైన ఆచారం దూళి దర్శనం. ఇతర క్షేత్రాలలో స్నానం చేసి దర్శనం చేయడం ఆచారం. కానీ శ్రీశైలంలో మాత్రం యాత్రికుడు ప్రయాణపు అలసటతో, పాదాలపై అంటుకున్న మట్టితో, స్నానం చేయకుండానే స్వామి దర్శనం చేస్తే దానిని దూళి దర్శనం అంటారు. భక్తుడు తన కోసం పడిన కష్టాన్ని చూసి మల్లికార్జున స్వామి పరమానందంతో పొంగిపోతాడని విశ్వాసం. మట్టితో నిండిన పాదాలతో, చెమటతో అలసిపోయిన శరీరంతో భక్తి భావంతో స్వామిని దర్శిస్తే ఆయన సర్వకామ్య సిద్ధిని ప్రసాదిస్తాడని శైవ సంప్రదాయం చెబుతోంది. అందుకే శ్రీశైల యాత్రలో దూళి దర్శనానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. ━━━━━━━━━━━❖━━━━━━━━━━━ 🙏 ముగింపు #శ్రీశైలం #జ్యోతిర్లింగం మాత్రమే కాదు... #శక్తిపీఠం కూడా. అది కేవలం ఒక దేవాలయం కాదు... భక్తుని కోసం భగవంతుడు ఎదురుచూసే దివ్యక్షేత్రం. ఓం శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామినే నమః। 🙏🕉️ ━━━━━━━━━━━ 🌺🛕🌺 ━━━━━━━━━━━ #శ్రీశైలం #ఓం నమః శివాయ# హర హర మహాదేవ శంభో శంకర# శ్రీశైలం మల్లన్న# పార్వతీ పరమేశ్వర#హర హర శంకర# ఈశ్వర 🕉️🕉️🕉 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂 #hindu temples
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.9K views
28 days ago
#శ్రీ వరాహ స్వామి వారి దివ్య మంగళ దర్శనం ఓం శ్రీ వరాహాయ నమః 🙏 సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ వరాహ స్వామిని ప్రార్థిద్దాం. #వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి #కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. #అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. #తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది. #అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. #అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. #తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. #ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది #తెలుసుకుందాం #తిరుమల తిరుపతి దేవస్థానం #TTD తిరుపతి తిరుమల #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు