Tamil politics

P.Venkateswara Rao
557 వీక్షించారు
9 గంటల క్రితం
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక విజయ్❗* MAY 4, 2026🎯 రాజకీయాల్లోకి చాలామంది స్టార్లు వచ్చారు. కానీ ఇలా వస్తూనే అలా చరిత్ర సృష్టించిన హీరోలు అతికొద్ది మంది. ఇంకా చెప్పాలంటే, తమిళనాట ఎంజీఆర్, తెలుగులో ఎన్టీఆర్ మాత్రమే. ఇప్పుడీ ఇద్దరి సరసన విజయ్ చేరాడు. తమిళనాట అతడు చరిత్ర సృష్టించాడు. స్టార్ పవర్ అందరికీ ఉంటుంది. తమకు చాలా క్రేజ్ ఉందని చాలామంది హీరోలు చెప్పుకుంటారు. కానీ ఆ క్రేజ్-పాపులారిటీ ఏ స్థాయిలో ఉంది, ఎంతమందిని కదిలించామనేది ఓట్లు-సీట్లు రూపంలో తెలుస్తుంది. కమల్ హాసన్, పవన్ కల్యాణ్, చిరంజీవి, విజయ్ కాంత్ లాంటి స్టార్స్ వల్ల కానిది, విజయ్ చేసి చూపించాడు. పార్టీ పెట్టిన వెంటనే చాలామంది ఇది కూడా ఓ ‘సినిమా పార్టీ’ అనుకున్నారు. ఒకప్పట్లా రాజకీయాల్లో సినీతారలు ప్రభావం చూపలేరని భావించారు. నిజానికి ఇలాంటి అపోహలు, సర్వేలు, సలహాలు, భ్రమల వల్లనే రజనీకాంత్ రంగంలోకి దిగకుండానే తన రాజకీయ కలల్ని తన చేతులతో తానే చిదిమేసుకున్నారు. చిరంజీవి పార్టీ పెట్టారు కానీ రాజకీయాల్ని శాసించలేకపోయారు. పవన్ కల్యాణ్ కూడా పార్టీ పెట్టారు కానీ మరో పార్టీకి మద్దతివ్వడంతోనే ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోంది. విజయ్ మాత్రం ఇలా పార్టీ పెట్టారు, అలా టార్గెట్ కొట్టారు. అలా జననాయగన్ సినిమాను పూర్తిచేసి, ఇలా నేరుగా సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. ఇంకా చెప్పాలంటే, జస్ట్ పార్టీ పెట్టిన 26 నెలల్లోనే విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇది మామూలు విజయం కాదు, అనితరసాధ్యం. తమిళనాటు విజయ్ విజిల్ మోత మోగిపోయింది. సింహం సింగిల్ గానే సత్తా చాటింది. ఒకప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్కు సాధ్యమైన విజయాన్ని దశాబ్దాల తర్వాత విజయ్ సాధించి చూపించారు. అయితే ఇదేదో ఆయాచితంగా జరగలేదు. తన సినీ కెరీర్పై ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇకపై సినిమాలు చేయనని ప్రకటించారు. అంతకంటే ముందు నుంచి తన ఫ్యాన్ అసోసియేషనన్ను ఛారిటబుల్ ట్రస్ట్గా మార్చారు. ఆ తర్వాత తన మనుషులు అనుకున్న వ్యక్తుల్ని ఇండిపెండెంట్లుగా దింపి విజయాలు అందుకున్నారు. మరోవైపు సినిమాలతో సంబంధం లేకుండా తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునే పనిలో పడ్డారు. మరోవైపు తమిళనాడులో ఉన్న పొలిటికల్ గ్యాప్ కూడా విజయ్ కి కలిసొచ్చింది. ఇవన్నీ ఒకెత్తయితే.. తిరుగులేని పట్టుదల, వెనక్కుతగ్గని సాహసాన్ని చూపించారు విజయ్. ధైర్యే సాహసే.. అన్నట్టు ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఓవైపు ప్రచారంలో ధనప్రవాహం సాగుతుంటే, తను అభిమానాన్ని ప్రజల్లోకి ప్రవహింపజేశాడు. దీనికితోడు సరైన ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాడు. ఎక్కడ, ఎప్పుడు మీటింగ్ పెట్టాలి, ఎలాంటి స్పీచ్ ఇవ్వాలి, ఎలాంటి వాగ్దానాలు చేయాలనే విషయాల్ని పక్కాగా రీసెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగారు విజయ్. ఈ పట్టుదల, ధైర్య-సాహసాలకు తోడు పక్కా ప్లానింగ్, కూసింత అదృష్టం కూడా తోడవ్వడంతో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. భారతీయ ఎన్నికల చరిత్రలోనే తిరుగులేని చరిత్రను సృష్టించింది. నిజానికి విజయ్ మేజిక్ ఫిగర్కు దూరంగా ఉన్నాడు. అయితే మిగతా పార్టీలు, ప్రభుత్వాన్ని స్థాపించే స్థితిలో లేవు. కాబట్టి క్యాంపు రాజకీయాలు నడపాల్సిన అవసరం విజయ్కు లేదిప్పుడు. బయట నుంచి అతికొద్దిమంది ఎమ్మెల్యేల మద్దతు దొరికితే చాలు, 'విజయ్ అనే నేను..' అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేసేయొచ్చు. ఆ అద్భుత ఘట్టాన్ని కూడా మరికొన్ని రోజుల్లో మనం కళ్లారా చూడబోతున్నాం. జన నాయగన్ సినిమా విడుదలతో పనిలేదిప్పుడు. ఆయన నిజంగానే జన నాయకుడయ్యాడు.
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
562 వీక్షించారు
11 గంటల క్రితం
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సంచలనం నటుడు విజయ్ టీవీకే పార్టీ అన్యూహ ప్రదర్శన! లేదా అందరూ ఊహించినట్లే సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ - రాజకీయాల్లో కొత్త శకానికి నాంది,సంకేతం! ( తమిళగ వెట్రి కజగం )! మరోసారి తమిళనాడు ఓటర్లు ఎవ్వరూ ఊహించని రీతిలో విలక్షణ తీర్పు ఇచ్చారు.ఈమారు తమిళ హీరో విజయ్ పార్టీ అయిన టీవీకే పార్టీకి బ్రహ్మరథం పట్టారు.మొత్తం 234 స్థానాలు ఉండగా, ఇప్పటికే టీవీకే పార్టీ 104 చోట్ల చాలా స్పష్టమైన అధిక్యంలో వుంది.దీన్నిబట్టి చూస్తే ఇప్పటికే తమిళనాడు సీఎం పీఠంపై హీరో విజయ్ ఆశీనులు కావడం దాదాపు ఖాయం అయినట్లే.ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ పార్టీ అధిపత్యానికి గండి కొట్టి భాజపా పార్టీ అధిక్యంలో కొనసాగుతూ వుంది.ఇక అస్సాంలో సైతం భాజపా సంపూర్ణ అధిపత్యం సంపాదించగా, పుదుచ్చేరీలో ఎన్నార్ కాంగ్రెస్ (ఎన్డీయే )జోరు చూపి అధిక్యంలో ఉండగా,కేరళలో మాత్రం (యూడీఎఫ్ ) మంచి జోరు చూపి చాలా స్పష్టమైన అధిక్యం చూపి అధికారం చేపట్టే దిశగా ముందడుగు వేయడం అనేది దాదాపు ఖాయమై పోయింది.ఇది ఇలా ఉంటే ఇదివరకు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది కమలహాసన్,విజయ్ కాంత్,రజనీకాంత్ వంటి పెద్ద పెద్ద హీరోలతోనే సాధ్యం కాలేదు.అలాంటిది ప్రస్తుత తమిళ దళపతిగా తమిళ రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకుంటున్న విజయ్ కి మాత్రమే సాధ్యం కావడం ఎంతైనా హర్షణీయమైన,పెను సంచలనాత్మక విషయం.అదేమాదిరి ఫలితాలు వెలువడక ముందు నుంచి పలు ఛానెళ్ల సర్వేలు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి విజయ అవకాశాలు వున్నాయి అని అంచన వేసినప్పటికి ఏ మూలానో ఇటు ప్రజలకు,అటు రాజకీయ విశ్లేషకులకు ఒకింత అనుమానంగా ఉండేది.అయితే వారి అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తూ విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళ ఓటర్ల హృదయాలను గెలుచుకోని తమిళనాడులో ఓ ఆతి పెద్ద పార్టీగా అవతరించడం ఎంతైనా ఓక గొప్ప విశేషం. ఏదిఏమైనా మొదట్నుంచి కూడా తమిళ ఓటర్లు ఒకే పార్టీకి వరుసగా పట్టం కట్టరు.ఒక్కో పర్యాయం ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ తమ పరిణతిని, వివేకాన్ని చాటుకుంటూ తమకంటూ ఓక ప్రత్యేకతను సృష్టించుకున్నారు అనే మాట అక్షర సత్యం.అలాగే తమిళ దళపతి విజయ్ ఈ అసాధారణ,అత్యద్భుత ఫలితాలతో కేవలం కింగ్ మేకర్ కాదు ' కింగే ' అని నిరూపించుకుంటూ తాను పోటీ చేసిన చెన్నై జిల్లాలోని అయిన పెరంబుర్,తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి రెండు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి మరీ విజయకేతనం ఎగురవేశారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.ఏమైనా టీవీకే పార్టీని స్థాపించిన రెండేళ్ల రెండు మాసాల అతి స్వల్ప వ్యవదిలోనే ఓక గొప్ప చరిత్ర లిఖించారు తమిళ హీరోగా అశేష తమిళ ప్రజల్లో పాపులర్ గా ముద్రపడ్డ విజయ్ గారు. అంతేకాదు టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ' విజిల్ ' వేయించి మరీ మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు ఇటు పాలిటిక్స్ లోనూ ' సూపర్ హిట్ ' కొట్టారు విజయ్.జయ జయహో విజయ్! హ్యాట్సాఫ్ టూ తమిళ ఓటర్స్. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #Tamil politics
VIHA FOLKS
44.3K వీక్షించారు
17 గంటల క్రితం
VIHA FOLKS YOUTUBE CHANNEL సినిమాని ఆపగలిగారు కానీ, CM అవ్వకుండా ఆపలేకపోయారు... సినిమావాడు CM అంటే ఏదో తెలియని సంతోషం..... VIHA FOLKS & NIHA FOLKS #📺5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..లైవ్ అప్‌డేట్స్👈 #tamilanadu raajakeeyaalu #vijay thalapathy #vijay #tamilanadu
P.Venkateswara Rao
722 వీక్షించారు
18 రోజుల క్రితం
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *పూలు విసిరితే బాంబు అనుకుని… దళపతి భయంతో పరుగో పరుగు…‼️* April 15, 2026🏃 రీల్ హీరో… రియల్ భయం: దళపతికి ఎదురైన ఆ ‘పువ్వుల’ పరీక్ష! సినిమా తెరపై వందల మంది విలన్లను ఒంటిచేత్తో చితక్కొట్టేసే ‘మాస్టర్’ ఆయన. తుపాకీ గుళ్లకు ఎదురెళ్లినా, బాంబు పేలుళ్ల మధ్య నుంచి స్టైలిష్‌గా నడుచుకుంటూ వచ్చినా… అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కానీ, తెర వెనుక రియల్ లైఫ్ కథ వేరేలా ఉంటుంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌కి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఆ ప్రయాణం… ఆ కేరింతలు! రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్, తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ప్రచారంలో భాగంగా ఒక బహిరంగ ర్యాలీలో వినూత్నంగా సైకిల్ యాత్ర చేపట్టారు. కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తూ, అభిమానుల కేరింతల మధ్య, భారీ భద్రతా వలయంలో ఆయన ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అంతా సవ్యంగానే సాగుతోంది అనుకుంటున్న తరుణంలో ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. పూల వర్షమా? బాంబు దాడియా? జనసందోహం మధ్య నుంచి ఒక అభిమాని అత్యుత్సాహంతో విజయ్‌కి స్వాగతం పలకాలనుకున్నాడు. ఒక్కసారిగా విజయ్ సైకిల్‌కు ఎదురుగా వచ్చి, చేతిలో ఉన్న పూల రెక్కలను ఆయనపైకి విసిరాడు. అయితే, ఆ పూలను విసిరిన వేగం, ఆ వ్యక్తి ఒక్కసారిగా దూసుకువచ్చిన తీరు చూసి విజయ్ కంగారుపడ్డారు. ఆ క్షణం ఆయనకు అది ‘పూల వర్షం’లా అనిపించలేదు సరే కదా, ఎవరో ‘బాంబు’ విసిరినంత భయం కలిగింది. క్షణాల్లో సీన్ రివర్స్! తెరపై తన మేనరిజమ్స్‌తో థియేటర్లను హోరెత్తించే దళపతి, ఆ పూల దెబ్బకు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తక్షణమే సైకిల్ దిగేసి, ప్రాణభయంతో వెనక్కి తిరిగి తన వ్యాన్ వైపు పరుగు తీశారు. అది చూసిన ఆయన సెక్యూరిటీ టీమ్, మిగిలిన సిబ్బంది ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ర్యాలీ కాస్తా గందరగోళంగా మారింది. నెటిజన్ల సెటైర్లు.. ఫ్యాన్స్ డిఫెన్స్! ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “స్క్రీన్ మీద అంత హీరోయిజం చూపించే వ్యక్తి, రియల్ లైఫ్‌లో ఇంత పిరికివాడా?” అని కొందరు ట్రోల్ చేస్తుంటే, “రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు.. ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది” అని విజయ్ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరైతే “అది కేవలం పువ్వుల వల్ల వచ్చిన భయం కాదు, వేరే వైపు నుంచి కూడా జనం మీదకు వస్తుండటంతో ఆయన అప్రమత్తమయ్యారు” అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న విజయ్, మరోవైపు తన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ లీకేజీ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎదురైన ఈ ‘పువ్వుల బాంబు’ ఉదంతం ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక మరిచిపోలేని (లేదా మర్చిపోవాలనుకునే) జ్ఞాపకంగా మిగిలిపోనుంది… అవునూ, ఆ సినిమా లీక్ ఉద్దేశపూర్వకమా..? ఆ సీన్స్ వోట్లకు ఉపకరిస్తాయనే భావనతో లీక్ చేయబడిందా..!?
P.Venkateswara Rao
938 వీక్షించారు
19 రోజుల క్రితం
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..‼️* April 15, 2026🎯 ( గోపు విజయకుమార్ రెడ్డి ) …. ఈసారి పెద్ద పెద్ద సీనియర్ విశ్లేషకులకు సైతం అంతు చిక్కని తమిళ రాజకీయాలు…, మర్వాడీ సట్టా మార్కెట్ అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితల మీద జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నా సరే, ఎందుకో ఇప్పటికీ తమిళనాడు జోలికి వెళ్లట్లేదు అంటేనే… ఏదో తెలియని, ఎవ్వరికీ అంతు చిక్కని గ్రౌండ్ రాజకియం జరుగుతుందని అర్ధం… దీనంతటికే కారణం టీవీకే పార్టీ… తిరుగులేని ప్రజాదరణ, ఎక్కడికి వెళ్లినా విరగబడి వస్తున్న జనం, ఆ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనని భయం… వచ్చిన జనాల్లో విజయ్‌కు ఎంత మంది ఓటేస్తారో ఎవ్వరూ సరైన అంచనాలకి రాలేకపోతున్నారు… ఇప్పటి వరకు అందుతున్న గ్రౌండ్ సమాచారం, వివిధ ఇండిపెండెంట్ మీడియా సెఫాలజిస్టుల ప్రకారం విజయ్ TVK మాత్రం అధికారంలోకి రాదు కానీ 15- 20% ఓట్లతో 5-10 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని… అందుకే రెండు పాత ద్రావిడ పార్టీలు ఈసారి అభ్యర్థుల ఎంపికలో ఒక కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నాయి… మనవాళ్లదే హవా… గుర్తుందా..? KGF ( కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ) ఓ మూడు నాలుగు నెలల కిందట కోయంబత్తూరులో ఒక భారీ బహిరంగ సభ పెట్టి, కమ్మలకి ఉప ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసినప్పుడు అందరూ నవ్వుకున్నారు… ఈ కమ్మాభిమానం రెండు రాష్ట్రాలని దాటి పక్క రాష్ట్రానికి కూడా వ్యాపిస్తున్నదా అని, కానీ గ్రౌండ్ రియాలిటీ ఇంకో విధంగా ఉంది… ఒక్కసారి ఈ క్రింది షీట్ చుడండి, అన్ని పార్టీలు ఎలా మన తెలుగు కులాలకి సీట్లు ఇచ్చారో తెలుస్తుంది… రియాలిటీ vs పర్‌సెప్షన్…. తమిళులు భాషా దురభిమానులు ప్లస్ తమిళేతరులను కూడా పెద్దగా పట్టించుకోరు… కానీ ప్రస్తుత ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్థులలో ఏకంగా 75 మంది నాన్ తమిళయన్స్ ఉన్నారు, అలాగే తమిళ బ్రాహ్మణులు తమిళ రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్ అంటారు కదా, ప్రధాన పార్టీలు ఏ ఒక్క బ్రాహ్మణ కులానికి టికెట్ ఇవ్వలేదు… 18 మంది కమ్మ వారు (DMK-11, AIADMK-7), కాపులు మొత్తం 11 మంది (DMK-7, AIADMK-4), రెడ్లు మొత్తం 10 ( DMK-5, AIADMK-5)… ఓవరాల్‌గా DMK- 47, AIADMK-28 మొత్తం 75… తమిళనాడు అసెంబ్లీ మొత్తం సీట్ల సంఖ్య 234 తో పోలిస్తే ఇలా టికెట్లు పొందిన తమిళేతరుల సంఖ్య గణనీయంగా ఉన్నట్టే కదా… TVK పార్టీ చాలావరకు కొత్త వారికి టికెట్లు ఇవ్వడం వలన… అంటే 1983 లో ఎన్టీయార్ TDP పార్టీ పెట్టినప్పుడు… 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు… ఎలాగయితే కొత్తవారికి మెజారిటీ సీట్లు ఇచ్చారో, అలాగే ఇప్పుడు విజయ్ TVK పార్టీ కూడా చేసింది… అందుకే ఆ పార్టీ అభ్యర్థుల సరైన డేటా, ప్రొఫైల్స్ సాధించడం కష్టమైంది… చూద్దాం కింగ్ ఎవరో కింగ్ మేకర్ ఎవరో… ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే…, తెలుగు కులాలలో ఎక్కవ టిక్కెట్లు పొందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ NDA కూటమికి మద్దతుదారులు… కానీ తమిళనాడులో DMK వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చింది… మరి అక్కడ కూడా వీళ్ళు NDA కి సపోర్ట్ చేస్తారో లేక DMK ఎక్కువ సీట్లు ఇచ్చిందని ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారో తెలియదు… ఎందుకంటే DMK స్టాలిన్‌కు సీబీఎన్ కంటే కూడా కెసిఆర్, జగన్‌లతో పాత దోస్తానా ఉంది కదా…
P.Venkateswara Rao
643 వీక్షించారు
1 నెలల క్రితం
#tamilanadu raajakeeyaalu *పోటాపోటీగా తాయిలాలు… రాజకీయాల్లో మాత్రం వెకిలి కూతలు…‼️* March 27, 2026🎯 ( తోట భావనారాయణ ) …. తమిళనాడులో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ విమర్శలకు మహిళలే టార్గెట్ అవుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ ను అవమానించే క్రమంలో నటి త్రిష గురించి బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఆ తరువాత నామమాత్రంగా విచారం వ్యక్తం సరి పెట్టారు. అది జరిగిన కొద్ది రోజులకే అన్నా డీఎంకే నాయకుడొకరు స్టాలిన్ వాగ్దానానికి వక్ర భాష్యం చెబుతూ మరో నయనతార పేరు ప్రస్తావించారు. ఇలా మహిళల్ని అవమానించటం తమిళనాట కొత్తేమీ కాదు. నాయకుల బాహుభార్యత్వం మొదలు వివాహేతర సంబంధాల దాకా ఆరోపణలకు ముడి సరకు కావటం అక్కడ ప్రత్యేకత. కరుణానిధి బ్రతికి ఉన్నంత కాలం ఆయన భార్యల మీద అన్నా డీఎంకే కామెంట్స్ చేస్తూనే ఉండేది. ముగ్గురు భార్యలంటూ తరచూ ప్రస్తావించేది. . మొదటి భార్య పద్మావతి చనిపోయాక ఆయన దయాళు అమ్మాళ్ ను చేసుకున్నారు. ఆమెకు అళగిరి (గతంలో కేంద్ర మంత్రి), స్టాలిన్ ( ఇప్పటి ముఖ్యమంత్రి), తమిళరసు అనే ఇంకో కొడుకు, సెల్వి అనే కూతురు ఉన్నారు. హిందీ వ్యతిరేకోద్యమంలో పరిచయమైన రాజాత్తి అమ్మాళ్ ఇంకో భార్య. ఈమె కూతురే కనిమొళి. ( ఒకప్పుడు ది హిందూలో సబ్ ఎడిటర్, ఆ తరువాత ఎంపీ. 2 జి స్కామ్ లో ఏడాదిపాటు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంపీ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ కార్యకర్తలు తమ పనులు కావటం లేదంటూ ఫిర్యాదు చేశారు. “నా ఇంటికో కార్డు ముక్క రాయండి చాలు, నే చూసుకుంటా” అని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. వెంటనే జయలలిత “ ఏ ఇంటికి?” అని ప్రశ్నించారు. నిజానికి ఇద్దరు భార్యల ఇళ్ళ దగ్గరా పోలీస్ సెక్యూరిటీ ఉండటం రహస్యమేమీ కాదు. అయితే, జయలలిత ప్రశ్నతో ఇరుకునపడ్డ కరుణానిధి “నా సంగతి సరే, ఇంతకీ నిన్ను కుమారి అని సంబోధించాలా? శ్రీమతి అని సంబోధించాలా?” అంటూ ఎదురు ప్రశ్న వేశారు. కరుణానిధి లాంటి పెద్దమనిషి అలా మాట్లాడటం మీద అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. ఎంజీ రామచంద్రన్ కూడా ఇద్దరు భార్యలు చనిపోయాక హీరోయిన్ జానకితో ప్రేమలో పడ్డారు. రెండో భార్య చనిపోకముందే ప్రేమించుకున్నారని చెప్పుకుంటారు. అప్పటికే పెళ్ళయిన జానకి తన భర్తకు విడాకులిచ్చాక ఎమ్జీఆర్ ను పెళ్లి చేసుకున్నారు. ఎమ్జీఆర్ చనిపోయాక 24 రోజుల పాటు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎమ్జీఆర్ సరసన నటించిన మరో హీరోయిన్ జయలలిత ఆయనకు రాజకీయ శిష్యురాలయ్యారు. పార్టీ ప్రచారకార్యదర్శిగా దూసుకుపోతున్న సమయంలో ఉన్నట్టుండి పక్కనబెట్టటం, ఇంటికే పరిమితం కావాల్సి రావటం జయలలితను బాధించింది. ఎమ్జీఆర్ సన్నిహితులందరూ అప్పటిదాకా పొగిడినా, వెంటనే ప్లేట్ ఫిరాయించి జయలలిత మీద దుమ్మెత్తి పోశారు. అప్పట్లో చంద్రలేఖ అనే ఐఎఎస్ అధికారిణి మదురై కలెక్టర్ అయ్యారు. తమిళనాడుకు రెండో మహిళా కలెక్టర్ గా ఆమె గురించి చెప్పుకునేవారు. ఎమ్జీఆర్ ప్రత్యేకంగా ఆమెకు ఆ పోస్ట్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఆమె సూచన మేరకే తనను పక్కనబెట్టారని జయలలిత కూడా నమ్మారని కూడా చెప్పుకునేవారు. జయలలిత అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ సీఎండీగా ఉన్న చంద్రలేఖ మీద యాసిడ్ దాడి జరిగింది. అందమైన చంద్రలేఖను అందవిహీనంగా మార్చిన యాసిడ్ దాడి వెనుక సీఎం జయలలిత ఉన్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చంద్రలేఖ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సుబ్రహ్మణ్యస్వామి పిలుపు మేరకు జనతా పార్టీలో చేరి తమిళనాడు శాఖకు అధ్యక్షులయ్యారు. జయలలిత జైలుకెళ్ళటానికి కారణం.. తమిళనాడు ప్రభుత్వం కాదు.. స్వామి, చంద్రలేఖ పెట్టిన అవినీతి కేసులే. అయితే, సుబ్రమణ్య స్వామి గాని చంద్రలేఖ గాని జయలలితమీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఒకసారి రిపోర్టర్లు ఆమె వివాహితేనా అని అడిగితే. నేనలాంటి విషయాలు మాట్లాడను. మాట్లాడితే I may win the battle but lose the war అన్నారాయన. ఆమె అవినీతి మీద పోరాడతానే తప్ప వ్యక్తిగత దాడితో తాత్కాలికంగా పైచేయి సాధించటం తన లక్ష్యం కాదని స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా సుబ్రమణ్య స్వామి, చంద్రలేఖ చాలా balanced గా ఉన్నట్టు లెక్క. జయలలిత బ్రతికి ఉన్నంత కాలం ఆమె మీద అభాండాలు మోపుతూ మాట్లాడించటం డీఎంకే కి అలవాటై పోయింది. పార్టీ సభల్లో మాట్లాడటానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి వక్తలను సిద్ధం చేయటం పార్టీకి అలవాటు. వాళ్ళకు ట్రెయినింగ్ ఇచ్చి, ఎవరు ఏయే అంశాలు మాట్లాడాలో కూడా చెప్పేవాళ్ళు. గ్రామస్థాయి నాయకులైతే బాగా దిగజారి మాట్లాడవచ్చని అర్థం. “ఒక తెలుగు తల్లికి, కన్నడ తండ్రికి పుట్టి ఇంకో తెలుగు నటుడితో సహజీవనం చేసిన ఆవిడా మనల్ని పాలించేది?” అంటూ వాళ్ళ ప్రసంగాలు సాగేవి. ఇలాంటి దారుణమైన మాటల్ని సైతం పట్టించుకోకుండా జయలలిత ఎంత మొండిగా ముందుకు సాగారో అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలోనే సాగిన దుశ్శాసన పర్వం కూడా డీఎంకే తీరుకు అద్దం పట్టింది. ఎమ్జీఆర్ ఒకప్పుడు భాగ్యరాజ్ ను తన నటనావారసుడు అని చెప్పినందుకు ఆయన చనిపోయిన కొద్ది నెలలకే భాగ్యరాజ్ ఆయన పేరు మీద పార్టీ పెట్టాడు. అయితే, భాగ్యరాజ్ తన భార్య (నటి) కి విడాకులిచ్చి ఇంకో నటి పూర్ణిమను పెళ్ళి చేసుకోవటాన్ని ప్రస్తావిస్తూ, పెళ్ళిళ్ళలోనూ నువ్వు వారసుడివే అని వెటకారం చేశారు. ఆ తరువాత కాలంలో శరత్ కుమార్ విషయం కూడా వార్తల్లోకెక్కింది. అప్పటికే కొన్నాళ్ళు నగ్మాతో ప్రేమవ్యవహారం నడపటం గురించి పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి. ఆ తరువాత రాధిక దగ్గరవుతున్న క్రమంలో ఆయన తన భార్యకు విడాకు లిచ్చారు. అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న రాధిక వల్ల తమ కుటుంబంలో వచ్చిన మనస్పర్థలే విడాకులకు దారితీశాయని అప్పట్లో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా ఆరోపించారు. శరత్ కుమార్ డీఎంకేలో చేరటాన్ని రాధిక ప్రోత్సహించినప్పుడు అన్నాడీఎంకే వాళ్ళు రాధిక పెళ్ళిళ్ళ మీద దారుణమైన ఆరోపణలు చేశారు. డీఎంకే ఆయనను రాజ్యసభకు పంపినా 2006లో రాజీనామా చేసి మళ్ళీ వీళ్ళిద్దరూ జయలలిత పంచన చేరినప్పుడు డీఎంకే కూడా వీళ్ళ మీద అలాంటి చౌకబారు విమర్శలే చేసింది. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు కూడా ఆయన పెళ్ళిళ్ళ మీద విమర్శలు వచ్చాయి. మొదట వాణీ గణపతిని, ఆ తరువాత సారికను పెళ్ళి చేసుకున్న కమల్ హాసన్ ఆ బంధాలు తెగతెంపులు చేసుకొని కొంత కాలం మరోనటి గౌతమితో సహజీవనం నెరపటం రహస్యమేమీ కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనా, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన తెరమీదికి తెచ్చినవాళ్ళున్నారు. ఇప్పుడు తాజాగా త్రిష మీద దాడి మొదలైంది. ఆమె తనను తాను జయలలితతో పోల్చుకోవటం, సీఎం కావటం తన లక్ష్యమని చెప్పటం ఆమె మీద వ్యాఖ్యలకు కారణం. ఇంకోవైపు విజయ్ భార్య కోర్టుకెక్కి, పేరు చెప్పకుండానే త్రిష గురించి ప్రస్తావించటం, వ్యక్తిగత దాడికి దిగటం చూస్తున్నాం. ముందుగా విజయ్.. త్రిషను వదిలిపెట్టాలంటూ బీజేపీ నాయకుడు నాయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎమ్జీఆర్ తరహాలో విజయ్ ముఖ్యమంత్రి కాకముందే ఈమె జయలలితతో పోల్చుకోవటమేంటని చెవులు కోరుక్కుంటున్నవాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ లేదక్కడ. ఇంకోవైపు అందరి కోర్కెలూ తీరుస్తానన్న స్టాలిన్ హామీకి పెడర్థాలు తీస్తూ, “ నేను నయనతారను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నా కోర్కె తీరుస్తావా?” అంటూ అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వెకిలి వ్యాఖ్య కూడా ఎన్నికల వేళ దుమారం రేపింది. ఈ రెండు విషయాల్లోనూ ఎన్డీయే కూటమి ఇరకాటంలో పడినా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మాత్రం ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపలేని డీఎంకే పాలన గురించి మాట్లాడాలి గాని ఈ వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యమివ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారానికి గురైన ఒక యువతి 16 కిలోమీటర్లు నడిచి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంచలన ఘటనను ఆమె ప్రస్తావించారు. ఒరు వార్తైక్కు కండనమ్ తెరివిత్తవరగళెల్లామ్ ఒరు వాళ్కైక్కు కండనం తెరివిక్కవిల్లయే (ఒక వ్యాఖ్యను ఖండించిన వాళ్ళు ఒక జీవితం పోయినప్పుడు ఖండించలేదే) అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈసారి రాజకీయ నాయకుల వ్యాఖ్యల్లో మహిళల ప్రస్తావన బాగా పెరగటం మీద తమిళనాడులో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఒకవైపు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూనే పోటాపోటీగా మహిళలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. మహిళలకు ఇప్పుడు నెలకు వెయ్యి ఇస్తుండగా దాన్ని 2 వేలు చేస్తానని, కుటుంబానికి 5 వేలు ఏకమొత్తంగా నగదు బదలీ చేస్తామని డీఎంకే చెబుతోంది, తాము కూడా మహిళలకు నెలనెలా రెండు వేల చొప్పున, కుటుంబానికి ఏకమొత్తంగా 2 వేలు ఇస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. విజయ్ ఇంకో అడుగు ముందుకేసి మహిళలకు నెలకు 2,500 చొప్పున ఇవ్వటంతోబాటు పెళ్ళికూతురికి 8 గ్రాముల బంగారం ఇస్తానంటున్నాడు. ఇంకో నాలుగు వారాల్లో జరిగే ఎన్నికల ఫలితాల మీద ఈ తాయిలాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. – *తోట భావనారాయణ*