ppp

P.Venkateswara Rao
602 వీక్షించారు
2 నెలల క్రితం
#ppp Model: #ఏపీ అప్ డేట్స్..📖 *ఇది వింటే ఇక ఏపీలో పీపీపీ లేదు.. ఓన్లీ డుమ్ డూమ్ ‘డుమ్మా’నే❗* Akshith Kumar December 29, 2025🩺 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పీపీపీ చుట్టునే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటైజేషన్ చేయడం కూటమి ప్రభుత్వానికి ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది. మరోవైపు.. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి వైఎస్ జగన్ సామ దాన భేద దండోపాయాలు అన్నీ వాడేస్తున్నారు! ఈ క్రమంలో తెరపైకి “సిట్” ప్రస్థావన తేవడంతో విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే కోటి మందికిపైగా ప్రజానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ అస్త్రాన్ని బలంగా వ్యతిరేకించినా.. ప్రభుత్వం వెనక్కి తగ్గదా..? ప్రభుత్వ సంగతి పక్కనపెడితే… జగన్ వ్యాఖ్యలకో ఏమో కానీ… తొలి విడతలో నాలుగు కాలేజీలకు టెండర్లు పిలవగా.. ఒక్క సంస్థా రాకపోవడంపై అయినా కూటమి ప్రభుత్వం పునరాలోచించడం లేదా..? పోనీ జగన్ బెదిరింపులు, హెచ్చరికల వల్లే పీపీపీలకు ఏ సంస్థా ముందూ రావడం లేదని అనుకుంటే… మరి తాజాగా జగన్ ఏకంగా “సిట్” ప్రస్థావన తెచ్చారు.. ఈ సమయంలో కూటమికి ఇంకా ఆశలు ఉన్నాయని అనుకోవాలా..? జగన్ జైలు హెచ్చరికలో, సిట్ బెదిరింపులో.. ఈ నేపథ్యంలో ఇక ఏపీలో పీపీపీ ఉండదు.. ఈ విషయంపై ప్రభుత్వం ఎవరినైనా సంప్రదిస్తే.. వారు డుమ్మా కొట్టడమే మిగిలి ఉందా అనే చర్చలో నిజం లేదా..? ఆంధ్రప్రదేశ్ లో తమ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడాన్ని అడ్డుకోనే విషయంలో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంత వరకూ వెల్లడానికైనా సిద్ధం అన్నట్లుగా జగన్ దూకుడు ఉందని అంటున్నారు. ఇందుకు ఏమాత్రం తగ్గకుండా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప‌ది మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటీక‌రిస్తామ‌ని కూటమి సర్కార్ స్పష్టం చేస్తోంది. దీంతో.. ఏపీ రాజకీయ మరింత రసవత్తరంగా మారింది. ఈ సమయంలో ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి, తమ అభిప్రాయాన్ని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… జగన్ నుంచి స్ట్రాంగ్ హెచ్చరికలు వచ్చాయి. తాము అధికారలోకి రాగానే పీపీపీలో దక్కించుకున్న కాలేజీలను తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో… పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటీకరించాలన్న కూట‌మి స‌ర్కార్‌ ప్రయ‌త్నానికి ఆదిలోనే అడ్డు త‌గిలింది. ఇందులో భాగంగా… ఆదోని, మార్కాపురం, పులివెందుల‌, మదనపల్లె మెడికల్ కళాశాలలకు పీపీపీ విధానంలో టెండర్లు ఆహ్వానించగా.. ఒక్క సంస్థ కూడా బిడ్ వేయడానికి ముందుకు రాలేదు. దీంతో టెండ‌ర్లు రాకపోవడానికి జగన్ భయమే కారణమనే ప్రచారం ఓ వర్గం మీడియా విస్తృతంగా చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అది చాలదన్నట్లుగా మరో షాకింగ్ అప్ డేట్ వైసీపీ నుంచి వచ్చింది.. ఈ విషయంలో తగ్గేదేలే అని చెప్పకనే చెప్పింది! ఇందులో భాగంగా… జ‌గ‌న్ పెట్టిన భ‌యానికి మాజీ మంత్రి పేర్ని నాని మ‌రింత జ‌త చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… 2029లో త‌మ ప్రభుత్వం వ‌చ్చిన వెంట‌నే మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై “సిట్” వేస్తామ‌ని హెచ్చరించారు. దీంతో… ఇక పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం అటకెక్కినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
P.Venkateswara Rao
583 వీక్షించారు
3 నెలల క్రితం
#ఏపీ అప్ డేట్స్..📖 #PPP🩺 #సంపద సృష్టి ⁉️ *👀అమ్మకానికి భవానీ ద్వీపం..❗* * ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాలు విక్రయం * అడ్వెంచర్‌ థ్రిల్‌ సిటీ పేరుతో విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌.. విశ్వనాథ్‌ అవెన్యూస్‌ సంస్థలకు కట్టబెట్టిన వైనం * మాజీ మంత్రి గంటా సన్నిహితులవే ఈ సంస్థలు * సర్వే నంబర్‌ కూడా లేకుండా జీవో ఇచ్చిన బాబు సర్కార్‌ * రూ.4,600 కోట్ల విలువైన 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు పన్నాగం సాక్షి, అమరావతి Nov 26 2025 * కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి రమణీయత మధ్య హాయిగా ఆహ్లాదాన్ని పంచే కీలక పర్యా­టక ప్రాజెక్టు ‘భవానీ ద్వీపం’పై చంద్రబాబు సర్కార్‌ కన్నుపడింది. * ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత దాదాపు 230 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రకృతి స్వర్గధామం విలువ అక్షరాలా రూ.4,600 కోట్లు! * ఇప్పటికే కృష్ణా నదికి అటు వైపు రాజ­ధాని ప్రాంతం అమరావతిలో వేల ఎకరాలు బినా­మీల పేరుతో కొల్లగొట్టిన ఎల్లో గ్యాంగ్‌.. నది నడి మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని కూడా చెరబట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. * అందుకు సీఎం చంద్రబాబు తనకు అలవాటైన పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌­నర్‌ షిప్‌ (పీపీపీ) విధానాన్ని పక్కా పన్నాగంతో తెరపైకి తెచ్చారు. * ఆ విధానం ముసుగులో తన బినావీులకు భవానీ ద్వీపాన్ని ధారాదత్తం చేసేందు­కు కుతంత్రాన్ని వేగవంతం చేశారు. * మార్కెట్‌ అంచనాల ప్రకారం భవానీ ద్వీపంలో ఎకరా భూమి విలువ పుష్కరకాలం కిందటే రూ.4 కోట్లకుపైగా ఉంది. * ప్రస్తుతం రాజధాని నేపథ్యంలో ఎకరం రూ.20 కోట్లు పైగా పలుకుతోంది. * ఈ లెక్కన రూ.4,600 కోట్లు చేస్తుంది. * ఇంతటి ఖరీదైన భూమి­ని చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీని­వాసరావు అనుచరుడికి అప్పనంగా దోచి పెడుతోంది. * సూత్రధారి బాబు.. నారాయణ, గంటా పాత్రధారులు * గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం.. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష అసోసియేట్స్‌ ఫిషింగ్‌ లిమిటెడ్‌ మౌలిక సదుపాయాలు–పెట్టుబడుల సంస్థకు భవానీ ద్వీపాన్ని 55 ఏళ్ల పాటు లీజు రూపంలో కట్టబెట్టేందుకు నిర్ణయించారు. * ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్‌సీపీతోపాటు టీడీపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. * ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పెద్దే సూ­త్రధారిగా.. నాటి పాత్రధారులను తెరపైకి తెచ్చి ఈ భారీ భూ దోపిడీకి కుతంత్రం రచించినట్లు తెలుస్తోంది. * ప్రస్తుతం అమరావతిలో తన దోపిడీ భాగస్వామి మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ద్వారానే కథ నడిపిస్తుండటం గమనార్హం. * గంటా శ్రీనివాసరావు బినామీగా గుర్తింపు పొందిన కాశీ విశ్వనాథ్‌కు చెందిన విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ ప్రైవేటు లిమిటెడ్, విశ్వనాథ్‌ అవెన్యూస్‌(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను తెరపైకి తెచ్చింది. * ఆ సంస్థలకు ’అడ్వెంచర్‌ థ్రిల్‌ సిటీ’ పేరుతో భవానీ ద్వీపాన్ని దశల వారీగా కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. * ఇప్పటికే 10 ఎకరాలను కట్టబెడుతూ కనీసం సర్వే నంబర్లు కూడా లేకుండా ఈ నెల Nov 13వ తేదీన జీవో జారీ చేయడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. * అంతేకాకుండా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు కట్టబెట్టడం ప్రభుత్వ బరితెగింపును బట్టబయలు చేస్తోంది. * కాశీ విశ్వనాథ్‌ కేవలం ముసుగు అన్నది బహిరంగ రహస్యం. * నిర్లక్ష్యం మాటున కబ్జా కుట్ర! * ప్రపంచంలోనే మంచి నీటి సముదాయ ద్వీపంగా విశేష గుర్తింపు పొందిన భవానీ ద్వీపాన్ని కొల్ల­గొట్ట­డం కోసమే చంద్రబాబు ప్రభుత్వం దానిని పర్యాటకపరంగా అభివృద్ధి చేయకుండా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ఏడాది వరదల్లో దెబ్బ­తిన్న భవానీ ద్వీపంలో కనీస మౌలిక సదుపాయాలను పునరుద్ధరించనే లేదు. * 230 ఎకరాల్లో భవా­నీ ద్వీపం భూములను నోటిఫై చేయగా, 30 ఎకరా­ల్లో భవానీ ఐలాండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (బీఐటీసీ) ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. * ఇందులో ఏపీటీడీసీకి చెందిన 45 గదుల కాటేజీల ద్వారా ఆతిథ్య సేవలను అందిస్తోంది. * ఈ క్రమంలో ఇంద్రకీలాద్రి కింద ఉన్న అత్యంత విలువైన, ఏపీటీడీసీకి కీలక ఆదాయ వనరుగా ఉన్న బెరంపార్కు హోటల్‌తో పాటు ద్వీపంలోని 45 గదులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. * ఈ టెండర్‌ ప్రక్రియ ముగిసి ప్రైవేటు వ్యక్తులకు వీటిని కట్టబెడితే.. అదే బెరంపార్కులో నుంచి భవానీ ద్వీపానికి వెళ్లే మార్గంలో సామాన్యులు అడుగు పెట్టలేని దుస్థితి దాపురిస్తుంది. * గత ప్రభుత్వంలో పర్యాటక వెలుగులు * వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24లో భవానీ ద్వీ­పా­న్ని రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చి దిద్దింది. * పర్యాటక శాఖ ద్వారానే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. దాంతో సందర్శకుల ద్వారా భారీగా పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. * 2022–23లో రికార్డు స్థాయిలో రూ.3.13 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2023–24లో రూ.4 కోట్లకు చేరుకుంది. * గత ప్రభుత్వంలోనే దుర్గగుడి సమీపం నుంచి భవానీ ద్వీపానికి రోప్‌వే కూడా మంజూరైంది. * కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం పడిపోయింది. * 4 వేల ఎకరాల్లో ద్వీప సముదాయం! * కృష్ణానదిలో భవానీ ద్వీపంతో పాటు గుంటూరు జిల్లాలోనూ విస్తరించిన ద్వీప సముదాయాలన్నీ కలిపితే సుమారు 4 వేల ఎకరాలు ఉంటుంది. * గత టీడీపీ ప్రభుత్వంలో ఇందులో 700 ఎకరాల భూమిని అనువైనదిగా గుర్తించి వినియోగంలోకి తీసుకొచ్చేలా కాన్సెప్ట్‌ ప్లాన్‌ను రూపొందించింది. * వాటిని నాలుగు జోన్లుగా విభజించి ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించింది. * దీనిని అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. * మళ్లీ ఇప్పుడు తాజాగా పర్యాటక ప్రాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 3,914 ఎకరాల పర్యాటక భూములను నోటిఫై చేసి.. అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టేలా కుట్రలు చేస్తోంది. #ఇది మంచి ప్రభుత్వం#
P.Venkateswara Rao
676 వీక్షించారు
4 నెలల క్రితం
#ppp #పబ్లిక్ టాక్.. 🗣️ లచ్చల్ లచ్చల కోట్లు పెట్టుబడులు వస్తున్న ప్పుడు.. చీప్ గా ఐదు వేల కోట్లు లేవని మెడికల్ కాలేజీలని ప్రైవేటోడికి సమర్పించుకోవటం ఏంటి..⁉️
P.Venkateswara Rao
784 వీక్షించారు
4 నెలల క్రితం
#P P P నాకో చిన్న డౌట్.. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆ గుడి గవర్నమెంట్ గుడి కాదు, అది ప్రైవేట్ వాళ్ళది అన్నారు.. మరి టీటీడీ, సింహాచలం, గుడులు govt కదా..? మరి వాటిలో జరిగినపుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు..? అలాగే govt medical colleges ni kuda private vallaki ichesi repu private vallu sariga ట్రీట్మెంట్ చేయక ఎవరైనా చనిపోతే, అప్పుడు కూడా ప్రభుత్వం ఇలానే, అది ప్రైవేట్ హాస్పిటల్ మాకు ఏమి సంబంధం లేదు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి..✍️
P.Venkateswara Rao
760 వీక్షించారు
6 నెలల క్రితం
#P P P #U టర్న్ #రెండు కళ్ల సిద్ధాంతం.. 👀 *మరింత సెగ: మెడికల్ కాలేజీల పీపీపీలో యూటర్న్‌.. ❗* 20.09.2025🩺 రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారం యూటర్న్ తీసుకుంది. వైసిపి హయాంలో తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలో విషయంలో ఐదు కాలేజీలను అప్పట్లోనే నిర్మాణం చేపట్టారు. వీటిలో మూడు కాలేజీల్లో తరగతులు కూడా నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10% పనుల కోసం వేచి చూస్తున్నాయి. ఇక, మిగిలిన పది కాలేజీల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్- ప్రైవేట్- పార్టనర్ షిప్ పేరుతో `పిపిపి` విధానాన్ని అవలంబించాలని నిర్ణయించుకుంది. దీనిపై సర్వత్ర విమర్శలు అయితే వచ్చాయి. మేధావి వర్గాల నుంచి రాజకీయ వర్గాల వరకు తటస్థుల నుంచి సొంత పార్టీలోని ఒకరిద్దరు నాయకుల వరకు కూడా వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని తప్పుపట్టారు. సహజంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే వైద్య కళాశాలలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంతో పట్టుపడితే తప్ప భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీ లను కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కేటాయించే పరిస్థితి లేదు. అటువంటిది వైసిపి హయాంలో భారీ సంఖ్యలో కళాశాలలను కేటాయించడం.. వాటికి అయ్యే ఖర్చులో 60 శాతం నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 40% నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి మొత్తంగా 10 కాలేజీలను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిలో ఏడు కాలేజీలకు పునాదుల నుంచి బిల్డింగుల వరకు నిర్మాణాలు కొంతమేరకు పూర్తి కాగా.. మిగిలిన వాటి సంగతి మాత్రం ఇంకా ప్రారంభం కూడా నోచుకోని పరిస్థితిలో ఉన్న మాట వాస్తవమే. అయితే, వీటిని కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోగా వీటిని పిపిపి విధానంలో అప్పగించాలని భావించింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో కొంతమేరకు సీఎం చంద్రబాబు వెనకడుగు అయితే వేశారు. ప్రజల నుంచి సర్వే తీసుకుని దాని ప్రకారం ముందుకు సాగాలని కూడా భావించారు. అయితే, అంతర్గతంగా జరిగిన చర్చలు. అదేవిధంగా మంత్రులు, కీలక నాయకుల నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో పిపిపి విధానానికే ప్రభుత్వం ముగ్గు చూపింది. తాజాగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఐదు కాలేజీలను పిపిపి విధానంలో అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఇక్కడ చిత్రం ఏంటంటే పి పిపి విధానంలో కూడా కొన్ని పక్కా నిబంధనలు నియమాలు ఉంటాయి. ఇప్పుడు వాటిని కూడా సరళీకరించటం, ఆ నిబంధనలో కూడా మార్పులు తీసుకురావడం వంటివి మరో వివాదానికి దారితీస్తున్నాయి. సహజంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు దక్కించుకునేందుకు ఇద్దరి నుంచి కనీసం ఐదుగురు వరకు పోటీ పడాలనే నిబంధన ఉంది. అలాంటిది మెడికల్ కాలేజీల విషయానికి వస్తే కేవలం ఒక్కరు టెండర్ వేసినా కాలేజీలను అప్పగిస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఏర్పడుతోంది. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న పిపిపి విధానం మళ్లీ కొండెక్కే అవకాశమే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిపిపి విధానం కరెక్ట్ అని సీఎం చంద్రబాబు చెబుతుండగా, ఆయా కాలేజీలను నిర్మించేందుకు 6000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించలేదా అనే సందేహాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఇది ఎంతవరకు దారితీస్తుంది.. ఏ మేరకు ఇది సక్సెస్ అవుతుంది.. అనేది అనుసరించే విధానాన్ని బట్టి, ప్రభుత్వం వేసే అడుగులను బట్టి ఆధారపడి ఉంటుందనేది స్పష్టం అవుతోంది. మరోవైపు దీనిపై చేస్తున్న నిరసనలను కొనసాగిస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
P.Venkateswara Rao
843 వీక్షించారు
6 నెలల క్రితం
#P P P #ఏపీ అప్ డేట్స్..📖 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ *పులివెందులకు బాబు సర్కార్ రిటర్న్ గిఫ్ట్❗* SEPTEMBER 5, 2025🎯 స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసినందుకు, రిటర్న్ గిఫ్ట్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు సాధించి ఇస్తామని టీడీపీ, బీజేపీ నాయకులు గొప్పగా చెప్పారు. చెప్పినట్టే జరిగింది. ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేశామని చంద్రబాబు దంపతులు, మంత్రులు నారా లోకేశ్, సవిత, అలాగే కడప జిల్లా నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాబుకు పులివెందుల జెడ్పీటీసీ గెలుపును గిఫ్ట్ ఇచ్చామని టీడీపీ, బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఇంత వరకూ అంతా బాగుంది. మరి పులివెందులకు చంద్రబాబు సర్కార్ రిటర్న్ గిఫ్ట్ ఏం ఇచ్చిందో తెలుసుకుందాం. ఇదే పులివెందుల రూరల్ పరిధిలో వైఎస్ జగన్ హయాంలో అద్భుతమైన వైద్య కళాశాల, ఆస్పత్రిని నిర్మించారు. వైద్య కళాశాలలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వ మనసులో వేరే ఆలోచనలు వుండడంతో అనుమతుల్ని కూడా వద్దని లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పులివెందులతో పాటు మరో తొమ్మిది మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో నడపాలని బాబు కేబినెట్ తీర్మానించింది. మొదటి విడతలో పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు నిర్ణయించడం గమనార్హం. ప్రభుత్వ నేతృత్వంలో నడపాల్సిన పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే, వైద్య విద్యను, అలాగే ప్రజారోగ్యాన్ని మరింత భారం చేయడం తప్ప, మరొకటి కానేకాదనే విమర్శ వెల్లువెత్తుతోంది. మరీ ముఖ్యంగా పులివెందులలో గత ఏడాదిలోనే మెడికల్ కళాశాలను ప్రారంభించాల్సి వుండగా, కేవలం వ్యాపారం కోసం జాప్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ, బీజేపీ నాయకులు పులివెందుల జెడ్పీటీసీని బాబుకు గిఫ్ట్ ఇస్తే, ప్రభుత్వం మాత్రం రిటర్న్ గిఫ్ట్ అక్కడి వైద్య కళాశాలను ప్రైవేట్పరం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలే ఆలోచించాలి.