ppp

P.Venkateswara Rao
602 views
3 months ago
#ppp Model: #ఏపీ అప్ డేట్స్..📖 *ఇది వింటే ఇక ఏపీలో పీపీపీ లేదు.. ఓన్లీ డుమ్ డూమ్ ‘డుమ్మా’నే❗* Akshith Kumar December 29, 2025🩺 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పీపీపీ చుట్టునే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటైజేషన్ చేయడం కూటమి ప్రభుత్వానికి ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది. మరోవైపు.. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి వైఎస్ జగన్ సామ దాన భేద దండోపాయాలు అన్నీ వాడేస్తున్నారు! ఈ క్రమంలో తెరపైకి “సిట్” ప్రస్థావన తేవడంతో విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే కోటి మందికిపైగా ప్రజానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ అస్త్రాన్ని బలంగా వ్యతిరేకించినా.. ప్రభుత్వం వెనక్కి తగ్గదా..? ప్రభుత్వ సంగతి పక్కనపెడితే… జగన్ వ్యాఖ్యలకో ఏమో కానీ… తొలి విడతలో నాలుగు కాలేజీలకు టెండర్లు పిలవగా.. ఒక్క సంస్థా రాకపోవడంపై అయినా కూటమి ప్రభుత్వం పునరాలోచించడం లేదా..? పోనీ జగన్ బెదిరింపులు, హెచ్చరికల వల్లే పీపీపీలకు ఏ సంస్థా ముందూ రావడం లేదని అనుకుంటే… మరి తాజాగా జగన్ ఏకంగా “సిట్” ప్రస్థావన తెచ్చారు.. ఈ సమయంలో కూటమికి ఇంకా ఆశలు ఉన్నాయని అనుకోవాలా..? జగన్ జైలు హెచ్చరికలో, సిట్ బెదిరింపులో.. ఈ నేపథ్యంలో ఇక ఏపీలో పీపీపీ ఉండదు.. ఈ విషయంపై ప్రభుత్వం ఎవరినైనా సంప్రదిస్తే.. వారు డుమ్మా కొట్టడమే మిగిలి ఉందా అనే చర్చలో నిజం లేదా..? ఆంధ్రప్రదేశ్ లో తమ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడాన్ని అడ్డుకోనే విషయంలో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంత వరకూ వెల్లడానికైనా సిద్ధం అన్నట్లుగా జగన్ దూకుడు ఉందని అంటున్నారు. ఇందుకు ఏమాత్రం తగ్గకుండా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప‌ది మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటీక‌రిస్తామ‌ని కూటమి సర్కార్ స్పష్టం చేస్తోంది. దీంతో.. ఏపీ రాజకీయ మరింత రసవత్తరంగా మారింది. ఈ సమయంలో ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి, తమ అభిప్రాయాన్ని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… జగన్ నుంచి స్ట్రాంగ్ హెచ్చరికలు వచ్చాయి. తాము అధికారలోకి రాగానే పీపీపీలో దక్కించుకున్న కాలేజీలను తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో… పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటీకరించాలన్న కూట‌మి స‌ర్కార్‌ ప్రయ‌త్నానికి ఆదిలోనే అడ్డు త‌గిలింది. ఇందులో భాగంగా… ఆదోని, మార్కాపురం, పులివెందుల‌, మదనపల్లె మెడికల్ కళాశాలలకు పీపీపీ విధానంలో టెండర్లు ఆహ్వానించగా.. ఒక్క సంస్థ కూడా బిడ్ వేయడానికి ముందుకు రాలేదు. దీంతో టెండ‌ర్లు రాకపోవడానికి జగన్ భయమే కారణమనే ప్రచారం ఓ వర్గం మీడియా విస్తృతంగా చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అది చాలదన్నట్లుగా మరో షాకింగ్ అప్ డేట్ వైసీపీ నుంచి వచ్చింది.. ఈ విషయంలో తగ్గేదేలే అని చెప్పకనే చెప్పింది! ఇందులో భాగంగా… జ‌గ‌న్ పెట్టిన భ‌యానికి మాజీ మంత్రి పేర్ని నాని మ‌రింత జ‌త చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… 2029లో త‌మ ప్రభుత్వం వ‌చ్చిన వెంట‌నే మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై “సిట్” వేస్తామ‌ని హెచ్చరించారు. దీంతో… ఇక పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం అటకెక్కినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
P.Venkateswara Rao
583 views
4 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 #PPP🩺 #సంపద సృష్టి ⁉️ *👀అమ్మకానికి భవానీ ద్వీపం..❗* * ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాలు విక్రయం * అడ్వెంచర్‌ థ్రిల్‌ సిటీ పేరుతో విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌.. విశ్వనాథ్‌ అవెన్యూస్‌ సంస్థలకు కట్టబెట్టిన వైనం * మాజీ మంత్రి గంటా సన్నిహితులవే ఈ సంస్థలు * సర్వే నంబర్‌ కూడా లేకుండా జీవో ఇచ్చిన బాబు సర్కార్‌ * రూ.4,600 కోట్ల విలువైన 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు పన్నాగం సాక్షి, అమరావతి Nov 26 2025 * కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి రమణీయత మధ్య హాయిగా ఆహ్లాదాన్ని పంచే కీలక పర్యా­టక ప్రాజెక్టు ‘భవానీ ద్వీపం’పై చంద్రబాబు సర్కార్‌ కన్నుపడింది. * ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత దాదాపు 230 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రకృతి స్వర్గధామం విలువ అక్షరాలా రూ.4,600 కోట్లు! * ఇప్పటికే కృష్ణా నదికి అటు వైపు రాజ­ధాని ప్రాంతం అమరావతిలో వేల ఎకరాలు బినా­మీల పేరుతో కొల్లగొట్టిన ఎల్లో గ్యాంగ్‌.. నది నడి మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని కూడా చెరబట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. * అందుకు సీఎం చంద్రబాబు తనకు అలవాటైన పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌­నర్‌ షిప్‌ (పీపీపీ) విధానాన్ని పక్కా పన్నాగంతో తెరపైకి తెచ్చారు. * ఆ విధానం ముసుగులో తన బినావీులకు భవానీ ద్వీపాన్ని ధారాదత్తం చేసేందు­కు కుతంత్రాన్ని వేగవంతం చేశారు. * మార్కెట్‌ అంచనాల ప్రకారం భవానీ ద్వీపంలో ఎకరా భూమి విలువ పుష్కరకాలం కిందటే రూ.4 కోట్లకుపైగా ఉంది. * ప్రస్తుతం రాజధాని నేపథ్యంలో ఎకరం రూ.20 కోట్లు పైగా పలుకుతోంది. * ఈ లెక్కన రూ.4,600 కోట్లు చేస్తుంది. * ఇంతటి ఖరీదైన భూమి­ని చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీని­వాసరావు అనుచరుడికి అప్పనంగా దోచి పెడుతోంది. * సూత్రధారి బాబు.. నారాయణ, గంటా పాత్రధారులు * గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం.. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష అసోసియేట్స్‌ ఫిషింగ్‌ లిమిటెడ్‌ మౌలిక సదుపాయాలు–పెట్టుబడుల సంస్థకు భవానీ ద్వీపాన్ని 55 ఏళ్ల పాటు లీజు రూపంలో కట్టబెట్టేందుకు నిర్ణయించారు. * ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్‌సీపీతోపాటు టీడీపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. * ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పెద్దే సూ­త్రధారిగా.. నాటి పాత్రధారులను తెరపైకి తెచ్చి ఈ భారీ భూ దోపిడీకి కుతంత్రం రచించినట్లు తెలుస్తోంది. * ప్రస్తుతం అమరావతిలో తన దోపిడీ భాగస్వామి మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ద్వారానే కథ నడిపిస్తుండటం గమనార్హం. * గంటా శ్రీనివాసరావు బినామీగా గుర్తింపు పొందిన కాశీ విశ్వనాథ్‌కు చెందిన విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ ప్రైవేటు లిమిటెడ్, విశ్వనాథ్‌ అవెన్యూస్‌(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను తెరపైకి తెచ్చింది. * ఆ సంస్థలకు ’అడ్వెంచర్‌ థ్రిల్‌ సిటీ’ పేరుతో భవానీ ద్వీపాన్ని దశల వారీగా కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. * ఇప్పటికే 10 ఎకరాలను కట్టబెడుతూ కనీసం సర్వే నంబర్లు కూడా లేకుండా ఈ నెల Nov 13వ తేదీన జీవో జారీ చేయడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. * అంతేకాకుండా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు కట్టబెట్టడం ప్రభుత్వ బరితెగింపును బట్టబయలు చేస్తోంది. * కాశీ విశ్వనాథ్‌ కేవలం ముసుగు అన్నది బహిరంగ రహస్యం. * నిర్లక్ష్యం మాటున కబ్జా కుట్ర! * ప్రపంచంలోనే మంచి నీటి సముదాయ ద్వీపంగా విశేష గుర్తింపు పొందిన భవానీ ద్వీపాన్ని కొల్ల­గొట్ట­డం కోసమే చంద్రబాబు ప్రభుత్వం దానిని పర్యాటకపరంగా అభివృద్ధి చేయకుండా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ఏడాది వరదల్లో దెబ్బ­తిన్న భవానీ ద్వీపంలో కనీస మౌలిక సదుపాయాలను పునరుద్ధరించనే లేదు. * 230 ఎకరాల్లో భవా­నీ ద్వీపం భూములను నోటిఫై చేయగా, 30 ఎకరా­ల్లో భవానీ ఐలాండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (బీఐటీసీ) ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. * ఇందులో ఏపీటీడీసీకి చెందిన 45 గదుల కాటేజీల ద్వారా ఆతిథ్య సేవలను అందిస్తోంది. * ఈ క్రమంలో ఇంద్రకీలాద్రి కింద ఉన్న అత్యంత విలువైన, ఏపీటీడీసీకి కీలక ఆదాయ వనరుగా ఉన్న బెరంపార్కు హోటల్‌తో పాటు ద్వీపంలోని 45 గదులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. * ఈ టెండర్‌ ప్రక్రియ ముగిసి ప్రైవేటు వ్యక్తులకు వీటిని కట్టబెడితే.. అదే బెరంపార్కులో నుంచి భవానీ ద్వీపానికి వెళ్లే మార్గంలో సామాన్యులు అడుగు పెట్టలేని దుస్థితి దాపురిస్తుంది. * గత ప్రభుత్వంలో పర్యాటక వెలుగులు * వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24లో భవానీ ద్వీ­పా­న్ని రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చి దిద్దింది. * పర్యాటక శాఖ ద్వారానే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. దాంతో సందర్శకుల ద్వారా భారీగా పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. * 2022–23లో రికార్డు స్థాయిలో రూ.3.13 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2023–24లో రూ.4 కోట్లకు చేరుకుంది. * గత ప్రభుత్వంలోనే దుర్గగుడి సమీపం నుంచి భవానీ ద్వీపానికి రోప్‌వే కూడా మంజూరైంది. * కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం పడిపోయింది. * 4 వేల ఎకరాల్లో ద్వీప సముదాయం! * కృష్ణానదిలో భవానీ ద్వీపంతో పాటు గుంటూరు జిల్లాలోనూ విస్తరించిన ద్వీప సముదాయాలన్నీ కలిపితే సుమారు 4 వేల ఎకరాలు ఉంటుంది. * గత టీడీపీ ప్రభుత్వంలో ఇందులో 700 ఎకరాల భూమిని అనువైనదిగా గుర్తించి వినియోగంలోకి తీసుకొచ్చేలా కాన్సెప్ట్‌ ప్లాన్‌ను రూపొందించింది. * వాటిని నాలుగు జోన్లుగా విభజించి ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించింది. * దీనిని అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. * మళ్లీ ఇప్పుడు తాజాగా పర్యాటక ప్రాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 3,914 ఎకరాల పర్యాటక భూములను నోటిఫై చేసి.. అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టేలా కుట్రలు చేస్తోంది. #ఇది మంచి ప్రభుత్వం#
P.Venkateswara Rao
676 views
5 months ago
#ppp #పబ్లిక్ టాక్.. 🗣️ లచ్చల్ లచ్చల కోట్లు పెట్టుబడులు వస్తున్న ప్పుడు.. చీప్ గా ఐదు వేల కోట్లు లేవని మెడికల్ కాలేజీలని ప్రైవేటోడికి సమర్పించుకోవటం ఏంటి..⁉️
P.Venkateswara Rao
784 views
5 months ago
#P P P నాకో చిన్న డౌట్.. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆ గుడి గవర్నమెంట్ గుడి కాదు, అది ప్రైవేట్ వాళ్ళది అన్నారు.. మరి టీటీడీ, సింహాచలం, గుడులు govt కదా..? మరి వాటిలో జరిగినపుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు..? అలాగే govt medical colleges ni kuda private vallaki ichesi repu private vallu sariga ట్రీట్మెంట్ చేయక ఎవరైనా చనిపోతే, అప్పుడు కూడా ప్రభుత్వం ఇలానే, అది ప్రైవేట్ హాస్పిటల్ మాకు ఏమి సంబంధం లేదు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి..✍️
P.Venkateswara Rao
739 views
5 months ago
#P P P వైద్య రంగంలో తీవ్ర సంక్షోభం! అత్యంత తీవ్రమైన విషయం భారతదేశ ఆరోగ్యరంగం పతన అంచున ఉంది — దీనిని భారత పార్లమెంటరీ కమిటీ కూడా అంగీకరించింది. జీ న్యూస్‌ తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో జరుగుతున్న సర్జరీల్లో సుమారు 44% ఆపరేషన్లు నకిలీ, మోసపూరిత లేదా అవసరం లేని వాటిగా తేలాయి.అంటే దేశంలో జరుగుతున్న దాదాపు సగం ఆపరేషన్లు కేవలం రోగులను లేదా ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడానికే చేస్తారు. నివేదిక ప్రకారం — 55% గుండె ఆపరేషన్లు, 48% గర్భాశయం తొలగించే శస్త్రచికిత్సలు (Hysterectomy), 47% క్యాన్సర్ సర్జరీలు, 48% మోకాలి మార్పిడి ఆపరేషన్లు, 45% సిజేరియన్ (C-Section) డెలివరీలు, భుజం, వెన్నెముక వంటి శస్త్రచికిత్సలలో సగం వరకు అవసరం లేనివి లేదా నకిలీగా జరుగుతున్నాయని తేలింది. మహారాష్ట్రలోని ప్రముఖ ఆసుపత్రుల్లో జరిగిన సర్వేలో, పెద్ద ఆసుపత్రుల్లో సీనియర్ వైద్యులకు నెలకు ఒక కోటి రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారని తేలింది. దానికి కారణం — ఎవరు ఎక్కువ టెస్టులు, చికిత్సలు, అడ్మిషన్లు, ఆపరేషన్లు చేయిస్తారో (అవసరం ఉన్నా లేకపోయినా), వారికే ఎక్కువ జీతం లేదా బోనస్ ఇస్తారు. (మూలం: BMJ Global Health) టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం — మరణించిన రోగులను కూడా బతికినట్టుగా చూపించి చికిత్స చేసిన ఘటనలు బయటపడ్డాయి. ఒక ఘటనలో, ఒక ప్రసిద్ధ ఆసుపత్రి 14 ఏళ్ల బాలుడిని ఇప్పటికే చనిపోయినా బతికినట్టుగా చూపించి ఒక నెల పాటు వెంటిలేటర్ మీద ఉంచి, కుటుంబం నుండి లక్షల రూపాయలు వసూలు చేసింది. తరువాత అతడిని చనిపోయినట్టుగా ప్రకటించారు. దర్యాప్తులో ఆసుపత్రి దోషిగా తేలి కుటుంబానికి ₹5 లక్షలు పరిహారం ఇచ్చారు. కానీ కుటుంబం ఎదుర్కొన్న మానసిక బాధకు ఎవరు బాధ్యులు? కొన్ని సందర్భాల్లో, మరణించిన రోగిపై కూడా తక్షణ శస్త్రచికిత్స జరుగుతోందని నటించి డబ్బు వసూలు చేసి, తర్వాత “ఆపరేషన్ సమయంలో చనిపోయారు” అని చెబుతారు. (మూలం: Dissenting Diagnosis – డా. గద్రే మరియు శుక్లా) బీమా (మెడిక్లెయిమ్) మోసాలు భారతదేశంలో సుమారు 68% మందికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, అవసరమైనప్పుడు క్లెయిమ్ తిరస్కరించబడుతుంది లేదా కొంత మాత్రమే చెల్లిస్తారు.మిగతా భారాన్ని కుటుంబమే భరించాల్సి వస్తుంది. సుమారు 3,000 ప్రసిద్ధ ఆసుపత్రులు బీమా సంస్థల ద్వారా నకిలీ క్లెయిమ్‌ల కారణంగా బ్లాక్‌లిస్టు అయ్యాయి.కోవిడ్ కాలంలో అనేక ఆసుపత్రులు నకిలీ కోవిడ్ కేసులు చూపించి బీమా కంపెనీలను మోసం చేశాయి. మానవ అవయవాల అక్రమ రవాణా 2019లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెలుగులోకి తెచ్చిన ఘటనలో,కాన్పూర్‌కి చెందిన సంగీత కశ్యప్‌కు ఉద్యోగం పేరుతో ఢిల్లీ ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకెళ్లి, “హెల్త్ చెక్‌అప్” పేరుతో చేర్చారు.ఆమె “డోనర్” అనే పదం విన్న వెంటనే అప్రమత్తమై తప్పించుకుంది. తర్వాత పెద్ద అంతర్జాతీయ అవయవాల స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది, అందులో డాక్టర్లు, సిబ్బంది, పోలీసులు కూడా ఉన్నారు. హాస్పిటల్ రిఫరల్ మోసం కొంతమంది వైద్యులు తప్పుడు రోగనిర్ధారణ చేసి రోగిని పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. అపోలో, ఫోర్టిస్, ఏపెక్స్ వంటి ఆసుపత్రుల్లో రిఫరల్ ప్రోగ్రామ్‌లు నడుస్తున్నాయి. ఉదాహరణకు — ముంబై కోకిలాబెన్ ఆసుపత్రి 40 మంది రోగులను పంపితే ₹1 లక్ష, 50 మందికి ₹1.5 లక్షలు, 75 మందికి ₹2.5 లక్షలు ఇచ్చే ఆఫర్ పెట్టింది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా, డాక్టర్‌కు రిఫరల్ ఫీజు నేరుగా బ్యాంక్‌లో జమ అవుతుంది. డయాగ్నోసిస్ ల్యాబ్ మోసాలు ఇది కోట్ల కాదు, అరబుల రూపాయల వ్యాపారం.బెంగళూరులో జరిగిన ఆదాయపు పన్ను దాడిలో, ఒక ప్రసిద్ధ ల్యాబ్ వద్ద ₹100 కోట్లు నగదు మరియు 3.5 కిలోల బంగారం లభించాయి.ఇవి డాక్టర్లకు లంచంగా ఇవ్వడానికి ఉంచినవే. డాక్టర్లు అవసరం లేని టెస్టులు రాయడం ద్వారా 40–50% కమిషన్ తీసుకుంటారు. భారతదేశంలో 2 లక్షలకుపైగా ల్యాబ్‌లు ఉన్నప్పటికీ, కేవలం 1,000 మాత్రమే ధృవీకృతమైనవి. ఫార్మా కంపెనీల మోసాలు 20–25 పెద్ద ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం డాక్టర్లపై ₹1,000 కోట్లు ఖర్చు చేస్తాయి. కోవిడ్ సమయంలో డోలో టాబ్లెట్ తయారు చేసే కంపెనీ మోసం బయటపడింది. తమ మందులు రాయించేందుకు డాక్టర్లకు నగదు, విదేశీ పర్యటనలు, ఫైవ్‌స్టార్ హోటల్ వసతి ఇస్తారు. ఉదాహరణకు — USV Ltd. ప్రతి డాక్టర్‌కి ₹3 లక్షలు లేదా ఆస్ట్రేలియా/అమెరికా ట్రిప్ ఇస్తుంది. ఆసుపత్రులు – ఫార్మా కంపెనీల గూటి కొన్ని కంపెనీలు శస్త్రచికిత్స పరికరాలు, మందులు తక్కువ ధరకు ఆసుపత్రులకు ఇస్తాయి, కానీ రోగుల నుండి 10 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఇండియా టుడే విచారణ ప్రకారం, EMCURE కంపెనీ తయారు చేసిన క్యాన్సర్ ఔషధం టెమిక్యూర్ ఆసుపత్రికి ₹1,950కి దొరుకుతుంది, కానీ రోగి వద్ద నుండి ₹18,645 వసూలు చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) 2016లో ప్రభుత్వ కమిటీ తెలిపింది — MCI కొత్త మెడికల్ కాలేజీలను అనుమతించడంలో మాత్రమే చురుకుగా ఉంది, కానీ డాక్టర్లు మరియు ఆసుపత్రులపై నియంత్రణ పూర్తిగా విఫలమైంది. MCI నిబంధనలు (పాలించబడని ముఖ్యమైనవి): 1. డాక్టర్ బ్రాండెడ్ మందులు కాకుండా జనరిక్ మందులు మాత్రమే రాయాలి. 2. చికిత్స ప్రారంభానికి ముందు తన ఫీజు స్పష్టంగా చెప్పాలి. 3. పరీక్షలు/చికిత్సకు ముందు రోగి అనుమతి తప్పనిసరి. 4. ప్రతి రోగి యొక్క రికార్డును కనీసం 3 సంవత్సరాలు భద్రపరచాలి. 5. అనైతిక లేదా అర్హతలేని డాక్టర్లను వెల్లడించడం వైద్యుల బాధ్యత. ప్రభుత్వ పథకాలలో కూడా భారీ అవినీతి ఉదాహరణకు, మాజీ సైనికులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు చిన్న వ్యాధులతో చేర్చబడి, నకిలీ చికిత్స బిల్లులు చూపించి ప్రభుత్వ పథకాల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో ఆసుపత్రి సిబ్బంది మరియు అవినీతిపరులైన అధికారులు భాగస్వాములు అవుతున్నారు. 👉 ఈ సందేశం ప్రతి పౌరుడి వరకు చేరాలి, తమను తాము మరియు తమ కుటుంబాన్ని రక్షించుకునే విధంగా జాగ్రత్తగా ఉండాలి. సత్యమేవ జయతే 🇮🇳 వాట్సప్ నుంచి వచ్చిన సమాచారం