👉 తెలంగాణ న్యూస్📰

💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
551 వీక్షించారు
8 గంటల క్రితం
💥మన భారతదేశంలో 16వ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది.! మారుతున్న సామాజిక జీవనశైలిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఆధునిక సమాజంలో పెరుగుతున్న 'లివింగ్ రిలేషన్‌షిప్' (సహజీవనం) జంటలను కూడా ఇకపై ఒకే 'కుటుంబం'గా గుర్తించాలని నిర్ణయించింది. 2011 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న ఈ సర్వేలో, 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేశారు. రెండు దశల్లో సాగే ఈ ప్రక్రియలో, తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' సదుపాయాన్ని కూడా కల్పించారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి గృహ వివరాల సేకరణ చేపట్టనున్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. సంక్షేమ పథకాల రూపకల్పనకు, సామాజిక మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ గణన కీలక పాత్ర పోషించనుంది.!👌🏻🇮🇳 #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #JanaGanana❤️🙏🏻 #LiveInRelationship❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
785 వీక్షించారు
3 రోజుల క్రితం
💥ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే.! • మనసా వాచా కర్మణా మద్దతు.! • గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది.! • భూములు ఇచ్చిన రైతులను హింసించింది.! • రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం.! • రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు.! • మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి.! • రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.! • సరైన ప్రణాళిక లేకుండా విభజించారు.! • రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు.! • అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది.! • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.! 💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు.! ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి.! 💥తెలుగు నేల అనే భావనే ఉండేది:కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.! 💥భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు:2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.! 💥రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు:చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.! 💥మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి:భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.! 💥విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు:గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.! 💥ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను” అన్నారు.!!❤️🙏🏻 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️ #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
Adhithya Newsline
668 వీక్షించారు
8 రోజుల క్రితం
జీవన్ రెడ్డి పార్టీలోనే ఉండాలి: టీపీసీసీ చీఫ్🧐 #tpcc #telugunews #assembly#Telangan# #reels #viral
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
665 వీక్షించారు
2 నెలల క్రితం
💥THINK POSITIVE FOR BETTER SOCIETY: 💥ఏపీ ప్రజా సొమ్ముతో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించడం సరైన పద్ధతి కాదు.! 💥ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కుల నాయకుడిది లేదా ఆ పార్టీ నాయకుడిది విగ్రహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లే.! 💥ప్రభుత్వం నడిపేందుకు టాక్స్ కట్టే ప్రజలు తప్పు చేస్తే వారికి ఫైనల్ రూపంలో శిక్ష వేస్తున్నారు జైలు రూపంలో శిక్ష వేస్తున్నారు. మరి ప్రభుత్వం చేసే తప్పులకు ప్రజలు ఏమి చేయలేరా? ఓటు హక్కు వచ్చేవరకు వెయిట్ చేయాలా? 💥పార్టీ నాయకులవి అలాగే కుల నాయకులు విగ్రహాలు పెట్టుకోవాలి అనుకుంటే ప్రజలకు ఇబ్బంది లేని ప్లేస్ లో పర్మిషన్ ఇవ్వడం వరకే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి.!ఇలాంటి విగ్రహాలు ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఐనా పెట్టుకోవచ్చు. అది ఆ పార్టీ కార్యకర్తలు ఆ కుల పెద్దలు చందాలు వేసుకుని పెట్టుకోవాలి.! ఇలాంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి.!ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులు డబ్బు కొరత వల్ల ఆగిపోతున్నాయి.!కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకోవాలి. కచ్చితంగా ఈ విగ్రహం విషయంలో చెడ్డ ప్రభుత్వం అవుతుంది.!! #APCMNaraChandraBabuNaidu❤️🙏🏻 #NCBN❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
1.4K వీక్షించారు
3 నెలల క్రితం
💥నా లీడర్ - నా హీరో ఇద్దరు ఒక్కరే అవ్వడం నా అదృష్టం.. నేను నమ్మిన జనసేన పార్టీ అధినేత & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻 💥దేవుడు గుడిలో ఉంటాడు, మా జనసేనుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా గుండెల్లో ఉంటాడు.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవులు ఆకార్షించలేదు బాధ్యత ఆయనను ముందుకు నడిపింది. నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారి జీవిత సూత్రాలు.!❤️🙏🏻 💥ఇక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻 💥చెప్పాడు అంటే చేస్తాడు. నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దోచుకోలేదు, దాచుకోలేదు.! శ్రీ పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు ఇచ్చాడు.శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాయం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే సాయం చేస్తాడు.!❤️🙏🏻 💥ఒక పక్కన పార్టీ పదవులు కన్నా ప్రజలే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే మరోపక్కన ఏ పదవులు ఆశించకుండా పనిచేసే జనసైనికులు... అదే సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఎదురు చెప్పని జనసైనికులు - మేము.!❤️🙏🏻 💥సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు.. అది ఎక్కడ కూర్చుంటే..అదే సింహాసనం.! అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం.!❤️🙏🏻 💥సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగిన సింహం విలువ తగ్గిపోదు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెనక, నా వెనక ఎంతమంది ఏమి చెప్పుకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి విలువ మరియు నా విలువ ఎప్పుడు తగ్గిపోదు.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకలానే ఉన్నాము, ఉంటాము.! ఎప్పుడు గర్వంతో బ్రతకడం గొప్పకాదు - ధర్మంతో బ్రతకాలి.... ఓడినా, గెలిచినా ధర్మం వైపే నిలబడాలి..అదే మా బలం.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తాం..,ఇలాగే ఉంటాం.! జనంలో ఉంటాం.., జనంతో ఉంటాం.!❤️🙏🏻 💥నా తుది శ్వాస వరకు జనసేన పార్టీతోనే ఉంటాను - పవన్ కళ్యాణ్ గారి కోసమే పయనిస్తాను.! నా గుండె కోసిన అదే మాట - నా గొంతు కోసిన ఒకే మాట... జై జనసేన.. జై పవన్ కళ్యాణ్.!!❤️🙏🏻✊🏻 🙏🏻❤️THANK U 2025 - WELCOME 2026❤️🙏🏻 #AndhraPradesh❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్