జై అమరావతి

P.Venkateswara Rao
529 views
9 hours ago
#అమరావతి #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *అమరావతి.. కమ్మరావతి❗* APRIL 3, 2026🎯 రాజ్యసభలో ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు-2026పై చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కులం కేంద్రంగా ఆమె చేసిన కామెంట్స్పై, ఆమె సామాజిక వర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలే అమరావతి అంటే కమ్మరావతి అనే విమర్శ వుందని, దాని నుంచి బయటికి రావాలని కోరుకుంటున్న తరుణంలో రేణుకాచౌదరి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. వైసీపీ హయాంలో మూడు రాజధానుల కాన్సెఫ్ట్ తెరపైకి వచ్చినప్పుడు, అమరావతి రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. అప్పట్లో అమరావతికి మద్దతుగా రేణుకా చౌదరి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలైన రేణుకా చౌదరి, తానొక పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నానన్న సంగతి మరిచిపోయారు. ఒక సామాజిక వర్గానికి చెందిన అన్యాయంపై పోరాడుతున్నాననే స్పృహలోనే ఆమె ఉండిపోయారు. రాజ్యసభలో అమరావతి బిల్లు సవరణపై కూడా తానొక కుల నాయకురాలిగానే మాట్లాడారన్న విమర్శ వెల్లువెత్తుతోంది. “నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను. పెట్టరా పేరు అమరావతి. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టుపేరు అని నేనే అన్నాను” అమరావతి కాదు, కమ్మరావతి అనే విమర్శలను ఆమె కొట్టి పారేయడానికి బదులు ఔను ఆ రకంగానే రాజధాని పేరు పెట్టండని అత్యున్నత చట్ట సభా వేదికగా డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇట్లే మాట్లాడ్తారనే విమర్శ వెల్లువెత్తుతోంది. రేణుకా చౌదరి నిత్యం సంచలనాల కోసం ఏదో ఒకటి మాట్లాడుతుంటారని పలువురు విమర్శిస్తున్నారు. అమరావతిని కులం కోణంలో చూడకూడదని కోరుకునే వారికి రేణుకా చౌదరి రాజ్యసభలో ప్రసంగం ఏ మాత్రం నచ్చడం లేదు. ఇదేం రోగమని సొంత సామాజిక వర్గానికి చెందిన వారే ప్రశ్నిస్తున్నారు. దేశ అత్యున్నత చట్టసభలో కమ్మరావతి అని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. ఇదేమైనా కుల పంచాయితీనా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో అమరావతిపై కమ్మ కుల ముద్ర వేయడాన్ని తప్పు పట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ రాజకీయ సంచలనం, అలాగే మీడియా దృష్టిని ఆకర్షించేందుకు రాజ్యసభలో కమ్మరావతి అని పేరు పెట్టాలని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అడిగినట్టు రేణుకా చౌదరి కాసింత గర్వంగా చెప్పుకోవడం విడ్డూరంగా వుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరైనా అమరావతిపై కమ్మరావతి అనే కుల ముద్ర వేస్తే ఖండించాల్సింది పోయి, కీలక పదవుల్లో వుంటూ చిల్లర మాటలు మాట్లాడ్డం తగదని హితవు చెబుతున్నారు. అమరావతి కాదు, కమ్మరావతి అని పిలిపించుకోవడం వల్ల ఎక్కడో ఉన్న మీకు పోయేదేమీ లేదని, స్థానికులైన తాము తీవ్రంగా నష్టపోతామనే ఆవేదన ఆ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి వ్యక్తమవుతోంది. అమరావతిలో కమ్మ వాళ్లతో పాటు అన్ని కులాలు, మతాల వారున్నారని మళ్లీమళ్లీ చెప్పుకోవాల్సి వస్తోందని అంటున్నారు. కమ్మవాళ్లంతా ధనవంతులు కాదని, నేటికీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూలిపనులు చేసుకుంటూ, రెక్కాడితే తప్ప డొక్కాడని కమ్మ వారు ఎంతో మంది ఉన్నారని అంటున్నారు. కమ్మ కులంలో ఐదారుగురు సంపన్నవంతులుంటే, లక్షలాది మంది పేదరికంతో మగ్గిపోయే వారున్నారన్నారు. రాజ్యసభలో రేణుకా చౌదరి కమ్మరావతి అని మాట్లాడ్డం ద్వారా, రాజధానిపై ఉన్న కులం ముద్ర నిజమే అని పార్లమెంట్ సభ్యులు నమ్మే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరు చివర్లో చౌదరి పేరు, అందుకు తగ్గట్టు మాటల్లో గర్వం... మొత్తం కులానికి చేటు తెచ్చేలా వుందనే ఆవేదన కమ్మవారి నుంచి వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అభిప్రాయం కూడా కులం కోణంలో వ్యక్తమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. “పార్లమెంట్ ఉభయసభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన. మీరు కట్టేది అమరావతే తప్ప, కమ్మరావతి కాకుండా చూసుకోండి. తస్మాత్ జాగ్రత్త!” అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అమరావతి కేవలం కమ్మవాళ్లకు సంబంధించిన రాజధాని అనే అభిప్రాయం కలిగిన వారెందరో ఉన్నారు. అందుకే విజయసాయిరెడ్డి లాంటి వారు మీరు కట్టేది అమరావతే తప్ప, కమ్మరావతి కాకుండా చూసుకోండి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. రేణుకా చౌదరి లాంటి వారి చేష్టలతో అమరావతి గురించి కుల రాజధాని అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే, వాళ్ల సామాజిక వర్గానికి చెందిన వారే ఆ మాట అంటున్నప్పుడు, ఇక మిగిలిన వారు అనుకోవడంలో తప్పేం వుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక్కసారి బలమైన కుల ముద్ర పడితే, రానున్న రోజుల్లో ఆ సామాజిక వర్గంతో పాటు టీడీపీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు, ప్రమాదం ఏంటో తెలియకపోవచ్చు. పరిస్థితులు బాగాలేనప్పుడే సమస్య ఏంటో అనుభవంలోకి వస్తుంది.
P.Venkateswara Rao
532 views
19 hours ago
*అందరూ ఆడుకునేవాళ్లే..❗ #అమరావతి రాజధాని ఓ విషాదగాథ…‼️* April 3, 2026🎯 ( ఎ. సాయిశేఖర్ ) …. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ (TDP), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మధ్య ఎప్పుడూ ఒక వివాదాస్పద అంశంగానే ఉంది. ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం మరియు రాజకీయ పైచేయి సాధించాలనే తాపత్రయం దీనికి కారణం.Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ కొత్త గ్రీన్ ఫీల్డ్ రాజధాని – అమరావతికి అనుకూలంగా ఉన్నారు. అదే సమయంలో, మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై ఎప్పుడూ సందేహాలు వ్యక్తం చేస్తూ, విశాఖపట్నం వైపు మొగ్గు చూపారు. అమరావతి రాజధాని బిల్లు అంటే ఏమిటి? …… బుధవారం లోక్‌సభ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ ఒక బిల్లు ఆమోదించింది. ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 లోని సెక్షన్ 5 (2) ను సవరించింది. 2024లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల కాలపరిమితి ముగియడం, మార్చి 27, 2026 నాటికి అది నిలిచిపోవడంతో ఈ సవరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళుతుంది. జగన్ ఎలా ఎదురుదాడి చేశారు? అదే రోజు జగన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, అమరావతి గురించి నాయుడు చెబుతున్న ‘గొప్ప ప్రణాళికలు’ అమలు చేయడం అసాధ్యమని నొక్కి చెప్పారు. రూ. 65,000 కోట్ల భారీ వ్యయం ఆచరణాత్మకం కాదని, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ అమలు సాధ్యం కాదని ఆయన వాదించారు. ఆయన తన ‘ప్లాన్ బి’గా మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలుపుతూ రాజధాని కారిడార్ చేయాలనే తీవ్రమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. కానీ, జగన్ తన ఆలోచనా క్రమంలో అనుకోకుండా లేదా వ్యంగ్యంగా, ఈ కారిడార్‌ను “MaViGun” (మూడు నగరాల మొదటి అక్షరాలు) అని పిలవచ్చని సూచించి, ఆ సీరియస్ ప్రతిపాదనను నవ్వుల పాలు చేశారు. వేర్వేరు నగరాల మొదటి అక్షరాలను కలిపి తెలుగులో అర్థం పర్థం లేని పదంగా, లేదా వేర్వేరు అర్థాలు వచ్చేలా ఒక అక్రోనిం (Acronym) సృష్టించినందుకు ఆయనపై టీడీపీ మద్దతుదారులు భారీగా ట్రోలింగ్ చేశారు. జగన్ చేసిన ఈ చర్య వల్ల ఆ సీరియస్ ప్రతిపాదన ఇప్పుడు ఒక అంటరాని పదంగా మారిపోయింది. నాయుడు ఎక్కడ తప్పు చేశారు? హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన మెస్సయ్యగా చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ప్రజలు ఆయన వెనుక నిలిచారు. 2014లో నరేంద్ర మోదీ మద్దతు, పవన్ కళ్యాణ్ జనసేన వెలుపల నుండి ఇచ్చిన మద్దతుతో టీడీపీకి అది ఒక మైలురాయిగా నిలిచింది. “సీజర్ భార్య అనుమానానికి అతీతంగా ఉండాలి” అన్నట్లుగా, రాజధాని నిర్మాణ బాధ్యత చేపట్టినప్పుడు నాయుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది. దానికి బదులుగా, రాజధాని స్థలాన్ని ప్రకటించడానికి ముందే భూముల లావాదేవీల్లో ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ జరిగిందన్న జగన్ ఆరోపణలకు ఆయన అవకాశం ఇచ్చారు. తన అనుకూల వర్గాలకు మేలు చేసేలా భూముల ధరలు పెంచారని జగన్ ఆరోపించారు. రాజధాని ఎక్కడ ఉంటుందో ప్రకటించడానికి నాయుడు 10 నెలలు వేచి ఉండకుండా వేగంగా నిర్ణయం తీసుకోవాల్సింది. అమరావతిని ఏప్రిల్ 1, 2015న (సరిగ్గా 11 ఏళ్ల క్రితం) క్యాబినెట్ ఆమోదించింది. డిజైన్ల కోసం చాలా కాలం వేచి ఉండటం, ఏజెన్సీలను మార్చడం, సింగపూర్ కన్సార్టియం, మాకీ అసోసియేట్స్ (వీరు నాయుడిని నిందిస్తూ తప్పుకున్నారు), నార్మన్ ఫోస్టర్‌లను తీసుకురావడం కంటే, మొదట్లోనే విజయవాడ, గుంటూరులోని భవనాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి ఉండాల్సింది. వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్‌లను ‘తాత్కాలికం’ అని పిలవడం ఆయన చేసిన పెద్ద తప్పు. 29 గ్రామాల రైతుల నుండి 34,251 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి ఇవ్వకపోవడం ప్రాజెక్ట్‌ను గందరగోళంలోకి నెట్టింది. ప్రజలు దీనిని ‘గాలిలో మేడలు’ అని పిలవడం ప్రారంభించారు. ఒక ఆలోచన – పరిణామాలు …. జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ, అప్పుడే మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఆలోచనను ప్రతిపాదించారు. కానీ అప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న బలమైన ప్రతిపక్షంగా ఆ ఆలోచనను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా చేయలేకపోయారు. చంద్రబాబు కూడా నిధుల కొరత వల్ల రాజధాని నిర్మాణంలో జాప్యం చేశారు. విభజన చట్టంలోని 9 మరియు 10 షెడ్యూళ్ల ఆస్తుల పంపిణీ (RTC వంటి సంస్థలు, శిక్షణాలయాలు) ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. 2015 అక్టోబర్ 22న ప్రధాని మోదీ చేత శంకుస్థాపన చేయించినా, నాయుడు ఆ ప్రాజెక్ట్‌ను ఒక తార్కిక ముగింపుకు తీసుకురాలేకపోయారు. నాయుడి చపలచిత్తపు నిర్ణయాలు … రాజధాని డిజైన్ కోసం సినిమా దర్శకులు క్రిష్, రాజమౌళి (బాహుబలి సినిమా సెట్టింగ్ స్ఫూర్తితో)లను సంప్రదించడం ఒక ఎగతాళిగా మారింది. కేంద్రం ఇచ్చిన నిధులు ‘తాత్కాలిక’ భవనాలకే సరిపోయాయని, వాటి నిర్మాణ వ్యయం కూడా భారీగా ఉందని విమర్శలు వచ్చాయి. నాయుడు CRDA అనే సంస్థను ఏర్పాటు చేసి 9 నగరాలతో కూడిన భారీ ప్రణాళికలు వేసినా, 5 ఏళ్లు గడిచినా చెప్పుకోదగ్గ పురోగతి లేదు. ఈలోపు జగన్ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లో మద్దతు కూడగట్టుకుని 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించారు. జగన్ నిర్లక్ష్య వైఖరి … 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్, అమరావతిపై తన ‘మ్యాజిక్ బాగ్’ నుండి మూడు రాజధానుల ఆలోచనను తెరపైకి తెచ్చారు. ఇది చట్టపరంగా, పరిపాలనాపరంగా అనేక ఇబ్బందులకు దారితీసింది: న్యాయస్థానాలతో విభేదాలు, ముఖ్యంగా జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం వాస్తవానికి హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. అసెంబ్లీ ఒకచోట, సెక్రటేరియట్ మరోచోట ఉండటం అసంబద్ధమని విమర్శలు వచ్చాయి. అమరావతి రైతులు ఐదేళ్ల పాటు నిరసనలు చేశారు. శాసనపరమైన తప్పులు … నాయుడు అసాధ్యమైన ప్లాన్లతో రాజధానిని ఒక జోక్‌గా మార్చితే, జగన్ మూడు రాజధానుల ఆలోచనతో దానిని అగాధంలోకి నెట్టారు. కౌన్సిల్‌లో మెజారిటీ లేకపోవడంతో ఆ బిల్లు ఆగిపోయింది. దీనికి ఆగ్రహించిన జగన్ శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు, కానీ ఆ బిల్లును పార్లమెంటులో ఫాలో-అప్ చేయకుండా వదిలేశారు. ఆ తర్వాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను తన పార్టీ వారితో నింపుకోవడానికి ఆ కౌన్సిల్‌నే వాడుకున్నారు. టీడీపీ పునరాగమనం … 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ తీర్మానం చేసి, పార్లమెంటులో విభజన చట్ట సవరణ బిల్లును ఆమోదింపజేశారు. దీనిని కొందరు ‘డెడ్ క్యాట్’ (Dead Cat) టెక్నిక్‌గా పేర్కొంటూ ఎన్నికల ఓటింగ్ సరళి వివాదం నుండి దృష్టి మళ్లించే ప్రయత్నంగా అభివర్ణించారు. మావిగన్ వ్యూహం…. జగన్ తన ‘MaViGun’ ప్రతిపాదన ద్వారా, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారితే రాజధానిని మళ్లీ మార్చవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఆయన టైమింగ్ పర్ఫెక్ట్‌గా ఉంది. రాజ్యాంగం 106 సార్లు సవరించబడినప్పుడు, రాజధాని చట్టం కూడా భవిష్యత్తులో మారవచ్చని ఆయన వాదన.Politics రాజ్యాంగం ఏం చెబుతోంది? ఆర్టికల్ 1-4 రాష్ట్ర భూభాగాల గురించి, ఆర్టికల్ 168 శాసనసభల గురించి, ఆర్టికల్ 153 గవర్నర్ గురించి, ఆర్టికల్ 214 హైకోర్టుల గురించి వివరిస్తాయి. కానీ రాజ్యాంగంలో ఎక్కడా ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా రాజధాని ఉండాలని గానీ, అది ఫలానా చోటే ఉండాలని గానీ పేర్కొనలేదు. రాష్ట్ర రాజధానులు సాధారణ చట్టాలు, కార్యనిర్వాహక నిర్ణయాలు లేదా చారిత్రక ప్రాధాన్యత ఆధారంగా నిర్ణయించబడతాయి.., ఆంధ్రులకు ఇప్పటికీ ఓ రాజధాని లేదు, అమరావతితో రెండు ప్రధాన పార్టీలూ ఆడుకుంటూ, రోజురోజుకూ చిక్కుముడిని చేస్తున్నాయి… మొత్తానికి అమరావతి ఓ విషాద గాథ… *(Newsmeter.in సౌజన్యం)…*
P.Venkateswara Rao
508 views
1 days ago
#❤❤మనలో మన మాట❤❤ #అమరావతి #ఏపీ అప్ డేట్స్..📖 *మనలో మన మాట...* ఇదే పని వైయస్ జగన్ చేసి ఉంటే.... రాయలసీమలో ఒక మారుమూల ప్రాంతంలో ...తన వారి చేత చౌకగా భూములు ముందుగానే కొనిపించి... అసైన్డ్ భూములను , పంట భూములను బలవంతంగా తీసుకొని... తక్కువ రేటుకు రైతుల నుండి ఒక 50,000 ఎకరాల భూమిని తీసుకుని... ఏపీకి ఇదే శాశ్వత రాజధాని అని ఒక తీర్మానం చేస్తే.... మన పచ్చ ముఠా ఏమి చేసేదో తెలుసా...? దారిన పోయే ప్రతి అడ్డమైన వాడిని , ప్రతి పనికిమాలిన వాడిని తమ మీడియా కొంపలకు పిలిచి ... శుభ్రంగా స్నానం చేయించి , జుట్టు కత్తిరించి , సూటు బూటు తొడిగించి , కాస్త మేకప్ వేసి ..... మెడలో ఆర్థిక నిపుణుడు , విశ్లేషకుడు , సామాజికవేత్త .. అనే బోర్డులు వేలాడదీసి ... వారి చేత ఇలా చెప్పించేవి జగన్ కి బొత్తిగా అనుభవం లేదని ... గతంలో హైదరాబాదు విషయంలో చేసిన తప్పును ఇప్పుడు మళ్లీ ఏపీలో అన్నీ ఒకే చోట కేంద్రీకరించి ఘోరమైన తప్పు చేస్తున్నాడని ...ప్రవచనాలు చెప్పించేవాళ్లు పచ్చని పంట భూములను నాశనం చేస్తూ, అటు సేద్య రంగానికి.. ఇటు పర్యావరణానికి పెను శాపంలా జగన్ తయారయ్యాడని శపించేవి ... ఒక ప్రాంతంలో రాజధానిని నిర్మించి ఇతర ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని... దీనిపై ఇతర ప్రాంతాల వారు తీవ్రంగా మండిపడుతున్నారంటూ .. పచ్చ మీడియా గుడ్డలు చింపుకొని నడిరోడ్డుపై నాట్యం చేసేది...! ఈ భూమిపై ఎక్కడైనా లక్ష ఎకరాల పరిధిలో రాజధాని ఉందా... రోజుకు 500 కోట్లు అప్పులు చేస్తున్న మనకు ... లక్షల కోట్లతో రాజధానిని నిర్మించడం సాధ్యమేనా .... అని పొద్దస్తమానం చర్చల మీద చర్చలు పెట్టి ... ప్రశ్నల వర్షం కురిపించి .... జగన్ని , జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వాళ్ళు.. కదూ ..!? ఏమంటారు..❓ శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
P.Venkateswara Rao
551 views
1 days ago
#అమరావతి అలాగే ' హెరిటేజ్ ' షేర్లు అన్ని ఇచ్చేయమనచ్చు కద Sir. మన దేవతల అమరావతి కోసం..................⁉️
P.Venkateswara Rao
541 views
1 days ago
#అమరావతి *రెడ్డి కాదు ,కమ్మ కాదు ,కాపు కాదు* మరి ఎవరీ రిటైర్డ్ IAS శివరామకృష్ణన్ సీమాంధ్ర రాజధాని ఎంపికకు కేంద్ర హోం శాఖ మార్చి 28, 2014న 5 గురు నిపుణులతో 'తమిళనాడు ' కు చెందిన రిటైర్డ్ IAS శివరామకృష్ణన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసింది. శివరామకృష్ణన్ నిపుణుల కమిటీ సభ్యుల వివరాలు 1)ప్రొఫెసర్ కె.శివరామకృష్ణన్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణన్ 1958 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. గతంలో కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి కార్యదర్శి, సీఈవోగా పనిచేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగానూ సేవలందించారు. పదవీవిరమణ తర్వాత ప్రపంచబ్యాంకులో అర్బన్ మేనేజ్‌మెంట్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశారు. 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి పట్టణ, గ్రామపంచాయితీల విధివిధానాల రూపకల్పనలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. 2)ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్ న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో అర్బన్ డిజైనింగ్ విభాగానికి హెచ్.వో.డీగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అర్బన్ డిజైనింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. గ్రీన్ ఫీల్డ్ సిటీస్ నిర్మాణంలో ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. ఢిల్లీ పట్టణీకరణ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. యునైటెడ్ నేషన్స్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ అడ్వైసరీ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 3)ప్రొఫెసర్ జగన్ షా ఆయన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సిన్సినాటీ కొలంబియా విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసకులు. 4)అరోమర్ రేవి ఢిల్లీ ఐఐటీ పట్టభద్రుడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పట్టణీకరణలో తలెత్తే సవాళ్ళ అధ్యయనానికి దేశంలో తొలిసారిగా ఏర్పాటైన సంస్థ ఇది. 5) రతిన్ రాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ రిసెర్చ్ డైరెక్టర్‌గాసేవలు అందిస్తున్నారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్రంలో పీ.హెచ్.డీ చేశారు. ఆయన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూ.ఎన్.డీ.పీ)లో ప్రాంతీయ మేనేజర్ గా, 13వ ఆర్థిక సంఘం సలహాదారుగా పనిచేశారు. ఈ కమిటీ 3 నెలల పాటు AP లో తిరిగి విజయవాడ గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. జగన్ హయాములో బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌, , GN రావు కమిటీ కూడా ఇదే చెప్పాయి ఇప్పుడు చెప్పండి కరెక్ట్ బాబా లేక జగనా అన్ని ప్రాంతాలు సమంగా డెవలప్ కావాలని కోరుకున్నాడు దార్శనికుడు జగన్ అంతే కానీ అమరావతికో ఇంకో ప్రాంతానికో వ్యతిరేకం కాదు.