🇮🇳🅰️🅿️ పొలిటికల్ ట్రోల్స్ మీమ్స్😁

P.Venkateswara Rao
557 views
2 months ago
#🇮🇳🅰️🅿️ పొలిటికల్ ట్రోల్స్ మీమ్స్😁 *నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…‼️* February 7, 2026🎯 కొందరు ఉంటారు… జర్నలిస్టులుగా మహా టెంపర్‌మెంట్ చూపించేవాళ్లు… ఏది ఎదురైనా ఢీకొంటారు… నిజాలు రాస్తారు… బెదిరింపులు ఎదురైతే ఎహెపోబే అంటారు… పైగా ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక సంస్థ అనబడే డొల్ల మార్మిక భాష వాడరు… పక్కాగా, సూటిగా, బట్టలిప్పి పేర్లు రాస్తారు… వో ఆనా, ఆనే దేవ్… ఏమొస్తుందో రానీ… జమీన్ రైతు అని నెల్లూరుకు చెందిన ఓ దశాబ్దాల చరిత్ర ఉన్న పత్రిక తీరూ అంతే… ఓనర్, డోలేంద్రప్రసాద్ నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు… వర్తమాన జర్నలిజంలో… ప్రతీకార పోకడల్లో… నిజంపై నిటారుగా నిలబడటం చాలా పెద్ద టాస్క్… తెల్లారిలేస్తే చంద్రబాబుపై నిప్పులురిమే సాక్షిలో నిజానిజాల మాట దేవుడెరుగు, నాణ్యత లేని నాసిరకం కథనాలు… ఒక్క మిసైల్ పేలినట్టు కనిపించదు… క్రెడిబులిటీ లేనితనం, రఫ్ నేచర్… సరే, దానిది కూడా ఓ దశాబ్దాల విషాదం… సరే, విషయానికొద్దాం… ఓ తాజా సంచిక… ముసలితనంలో చంద్రబాబు దురవస్థను పక్కాగా రాసేశాడు… ఎన్టీఆర్ చేతుల్లో నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన అల్లుడి కట్నంగా హైజాక్ చేసిన తీరు వేరు… కానీ సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు, లోకేషుడే పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా తన హస్తగతం చేసుకున్నాడు… మోదీతో భేటీ అయిపోయి, రేప్పొద్దున తెలుగుదేశం అంటే నేను, నేనంటేనే తెలుగుదేశం అన్నంత ఓ సర్టిఫికెట్ పొందాడు… ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ మిత్రులు జాన్తా నై… అన్నీ కాగితాల మీద… వాళ్లు కాడి కింద పడేసినా సరే… సొంతంగా తెలుగుదేశాన్ని తన భుజాల మీద మోయటానికి లోకేష్ రెడీ అయిపోయాడు… ప్రభుత్వంలో, పార్టీలో ఈరోజు చంద్రబాబు నథింగ్… లోకేష్ ఎవరీ థింగ్… కంట్రాక్టులు, ఒప్పందాలు, చెల్లింపులు మన్నూమశానం అన్నీ లోకేషేనట… కాదు… ఎవరో కిలారు రాజేష్ అట… తన గ్యాంగ్ అట… వాళ్లే స్ట్రాటజీ టీమ్ అట… ఒకప్పటి చంద్రబాబు మార్క్ స్ట్రాటజీ టీమ్ గట్రా కాలగతిలో కలిసిపోయాయి… ఈరోజు ఏపీ వర్కింగ్ సీఎం కిలారు రాజేష్ అట… తను మగ శివగామి, తను చెప్పిందే శాసనం అట… పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు… ఒకప్పుడు పప్పు అని వైసీపీ వెక్కిరించిన లోకేషుడు ఈరోజు సర్వంసహాధికారి… అంతటి వీర, భీకర, బీభత్స అరాచక పాలకుడు జగన్‌‌‌కు కూడా అంతుపట్టడం లేదట లోకేష్… అంతటి సినిమాటిక్ పర్సనాలిటీ పవన్ కల్యాణుడే కళ్లప్పగించి, చేష్టలుడిగి చూస్తున్న దృశ్యం… తెలంగాణలోనూ అంతే కదా… కేసీయార్ కొడుకు కేటీయార్… తను చెప్పిందే శాసనం, తను గీసిందే గీత… మొన్నటిదాకా… ప్రభుత్వం, పార్టీ అన్నీ కేసీయార్ నుంచి హైజాక్… ‘‘నువ్వూ నీ అడ్డా ఫామ్ హౌజ్, అంతే’ అని బందీని చేసేశారు… కానీ తెలంగాణజనం కదా, ధైర్యంగా దెబ్బకొట్టి కుర్చీ నుంచి దింపేశారు… ఏపీజనం ఏతులెక్కువ, చేతలు తక్కువ కదా… చేతకాదు… వర్తమాన కథనాల మేరకు… అయిపోయింది, చంద్రబాబు కథ ముగిసింది… ఇప్పుడు లోకేష్ గీసిందే గీత… చెప్పిందే ఉత్తర్వు… తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా వ్యూహిస్టు, స్ట్రాటజిస్టు రాబిన్ శర్మ జస్ట్, నామమాత్రం… సోకాల్డ్ అస్మదీయ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా అంతే… సోకాల్డ్, కులసామ్రాజ్య నేతలు, సలహాదారులు, పెద్ద తలలు అందరూ నిమిత్తమాత్రులేనట… సరే, జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ పెట్టిన ‘తేడా చూడవద్దు, మేమూ గాడిదలమే’ అనే శీర్షిక నాకు అభ్యంతరకరం… నాటి ఎన్‌కౌంటర్ దశరథ్ రామ్ శర్మను ఆదర్శంగా తీసుకున్నాడేమో… కానీ హెడింగుల్లో గానీ, కథనరచనలో గానీ మరీ మర్యాదలు కాదు గానీ… ఇంకాస్త సాఫ్ట్ నేచర్ అవసరమేమో… నో, నో, వీళ్లకు అలా కుదరదు… మళ్లీ వీళ్లే జగన్‌కు చేజేతులా 160 లేదా 170 సీట్లు ఇచ్చేట్టుగా వ్యవహరిస్తున్నారు అంటారా..? సరే, సరే… ఏపీకి వేరే దిక్కేముంది..? ఆల్టర్నేట్ ఏముంది..? సచ్చినట్టుగా అయితే ఎక్స్, లేదంటే వై… దొందూ దొందే… రూపాయికి ఎకరం చొప్పున ప్రభుత్వ భూముల్ని అమ్ముకునే ఈ ప్రభుత్వ పాలనలో… వీర, ధీర, శూర, అరివీర భయంకర చరిత్ర ఉన్న తెలుగు జనానికి వేరెవడు దిక్కున్నాడు..?!
P.Venkateswara Rao
2.5K views
6 months ago
#🇮🇳🅰️🅿️ పొలిటికల్ ట్రోల్స్ మీమ్స్😁 *రాజకీయ పశ్చాత్తాపంలో రఘురామకృష్ణం రాజు❗* 03.10.2025🎯 రఘురామకృష్ణం రాజు( Raghu Ramakrishnan Raju ).. తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అలాగని ఆయన ఎన్నో పదవులు చేపట్టలేదు. ఒకసారి ఎంపీ అయ్యారు.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే ఏపీలో విపరీతమైన పాపులారిటీ సాధించడంలో మాత్రం ముందున్నారు రఘురామకృష్ణంరాజు. అయితే తనకు రాజకీయాలు సంతృప్తినివ్వలేదని.. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ తనకు తాను చెప్పుకున్నారు రఘురామకృష్ణంరాజు. వైసీపీలో అలా జరిగింది. ఇప్పుడు కూటమి హయాంలో ఇలా జరిగింది అని చెప్పుకునే క్రమంలో ఫెయిల్యూర్ అనే పదాన్ని వినియోగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే రఘురామకృష్ణం రాజు ప్రస్థానాన్ని గమనిస్తే మాత్రం.. ఆయన అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేదని ఆయన మాటలు బట్టి అర్థమవుతోంది. * కాంగ్రెస్ మనిషిగా.. కాంగ్రెస్ ( Congress) పార్టీలో సుదీర్ఘకాలం వున్నారు రఘురామకృష్ణంరాజు. వైయస్ రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ చట్టసభలకు రావాలన్న ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశించారు. కానీ ఆయనకు అవకాశం చిక్కలేదు. 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కొద్ది రోజులకే అధినేత జగన్మోహన్ రెడ్డిని విభేదించడం ప్రారంభించారు. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన టిడిపి అభ్యర్థిగా మారారు. ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. * ఆసక్తికర వ్యాఖ్యలు.. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఆరు నెలల కాలంలోనే ఆ పార్టీకి దూరమయ్యారు. 151 సీట్లతో అజేయమైన శక్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అన్ని ఎన్నికల్లోను గెలుపొందుతూ వచ్చారు. అటువంటి సమయంలోనే జగన్ పై తిరుగుబాటు చేశారు రఘురామకృష్ణంరాజు. రచ్చబండ పేరుతో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ బలంగా ఉన్న రోజుల్లోనే.. నెగిటివ్ పెంచిన ఘనత రఘురామకృష్ణం రాజుది. ఒక విధంగా చెప్పాలంటే విపక్షాలకు రఘురామకృష్ణం రాజు ద్వారా మాత్రమే వైసిపి పై వ్యతిరేకత పెంచే ఛాన్స్ వచ్చింది. అయితే రఘురామకృష్ణం రాజు పాపులర్ కావడానికి జగన్ పై ఉన్న కోపమే కారణం. అందుకే రఘురామకృష్ణం రాజును బహిష్కరించాలని చూశారు. వేటు వేయాలని భావించారు. ఆ ప్రయత్నాలన్నీ రఘురామకృష్ణం రాజును పాపులర్ అయ్యేలా చేశాయి. అయితే ఒక విషయంలో మాత్రం రామ్ గోపాల్ వర్మ రఘురామకృష్ణం రాజును హైలెట్ చేశారు. ట్రిపుల్ ఆర్ గా పేర్కొంటూ ఆర్జీవి చేసిన ట్వీట్ తోనే.. రఘురామకృష్ణంరాజు ట్రిపుల్ ఆర్ గా ముద్రపడ్డారు. * ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా.. అయితే రఘురామకృష్ణం రాజు రాజకీయంగా అంత సంతృప్తికరంగా లేరట. తాను ఆశించిన స్థానం దక్కలేదట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎంపీ పదవిని ఎంజాయ్ చేయలేకపోయారు. సొంత నియోజకవర్గానికి వెళ్లలేక పోయారు. చివరి వరకు బిజెపిని నమ్మి మోసపోయారు. టిడిపి ఆదరించి మరో నియోజకవర్గాన్ని కేటాయించింది. మంత్రి పదవి ఆశించారు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. అందుకే తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా చెప్పుకుంటున్నారు రఘురామకృష్ణం రాజు. పనిలో పనిగా ఉచిత పథకాలకు ఓట్లు రావు అని ఉచిత సలహా ఇచ్చారు. తద్వారా సూపర్ సిక్స్ అంటున్న టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశారు. అయితే పొలిటికల్ గా ఏదేదో ఊహిస్తే.. తనకు సరైనది దక్కలేదన్న బాధ మాత్రం రఘురామకృష్ణంరాజులో కనిపిస్తోంది. చూడాలి మరి మున్ముందు ట్రిపుల్ ఆర్ ఎటువంటి సంచలనాలకు వేదిక అవుతారో???