*దయచేసి రైతులందరికీ విన్నపం , ఎటువంటి పరిస్థితుల్లోనూ పంట అవశేషాలను తగలబెట్టకండి* , వ్యవసాయ శాఖ ద్వారా గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తున్నాం. ఎండల తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి , ఆర్పవచ్చులే అనుకోని రైతులు నిప్పు పెడుతున్నారు,కానీ ఒకసారి మంటలు వ్యాపించాక అదుపు లోకి తీసుకురావడం చాలాకష్టం.
నిన్న జీళ్లచెరువు , గోపాలరావుపేట మరియు నేలపట్ల గ్రామాలలో రైతులు మొక్కజొన్న పంట అవశేషాలు తగలబెట్టడం వలన మంటలు ఎక్కువగా వ్యాపించాయి , ఫైర్ ఇంజన్ తీసుకువచ్చి మంటలు ఆర్పడం జరిగింది.
కావున రైతులకు మరొకసారి పంట అవశేషాలను తగలబెట్టరాదని విన్నపం🙏🙏
#📸 వీధి ఫోటోగ్రఫీ #🆕Current అప్డేట్స్📢 #farmers #animals