ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩

PSV APPARAO
581 views
1 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శ్రీకృష్ణ జన్మాష్టమి/శ్రీకృష్ణ జయంతి/గోకులాష్టమి/అష్టమి రోహిణి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #🙏హ్యాపీ కృష్ణాష్టమి🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 *పుట్టెడు కష్టాలతో చెర శాలలో జన్మించిన శ్రీ కృష్ణ పరమాత్ముడు తన చిలిపి చేష్టలతో వెన్న ముద్దల దొంగగా పెరిగి పెద్ద అయ్యే తరుణంలో పసి వయసులోనే తల్లి యశోదకు తన బుల్లి నోటిలో లోకాన్ని మొత్తం చూపించి దైవాంశ సంబుతుడయ్యాడు, కుటుంబ సభ్యుల మధ్య వైరం వచ్చాక మహా భారత యుద్ధ భూమిలో ధర్మం నెలకొని ఉన్న పంచ పాండవులు వైపు అస్త్ర శస్త్రములు పట్టుకోకుండా తన తెలివితేటలతో కేవలం రధ సారధిగా ఉంటూ పాండవులను గెలిపించి చరిత్ర సృష్టించి ప్రధాన భూమిక పోషించాడు, నేడు కలియుగానికి లోక పావనుడయ్యాడు, అంతటి గొప్ప మహానుభావుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకుందాం!* 🦚శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 💐🦚
PSV APPARAO
612 views
7 days ago
#*రక్షాబంధన్* ఎంత పవర్ఫులో ఒకసారి చూద్దాం.... #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #శుభ శ్రావణ మాసం ... రాఖీ పూర్ణిమ ... నరాళి పూర్ణిమ 🙏 *రక్షాబంధన్‌లో అన్నయ్యకు రాఖీ కట్టే ముందు...* _మొదటి రాఖీ ఎవరికి కట్టాలి?_ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ ప్రత్యేక రోజున సోదరీమణులు తమ అన్నయ్య లేదా తమ్ముడి దీర్ఘాయుష్షు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం కోరుకుంటూ వారి చేతికి రక్షాసూత్రాన్ని కడతారు. అందుకు ప్రతిగా అన్నదమ్ములు కూడా జీవితాంతం తమ సోదరికి రక్షణగా ఉంటామని దృఢంగా సంకల్పం చేస్తారు. అయితే శాస్త్రోక్త విశ్వాసాలు, ధార్మిక సంప్రదాయాల ప్రకారం అన్నయ్యకు రాఖీ కట్టే ముందు ముందుగా శ్రీ గణేశుడికి రాఖీని సమర్పించే ప్రత్యేక విధానం ఉంది. _మొదట గణేశుడికి రాఖీ ఎందుకు కట్టాలి?_ సనాతన ధర్మంలో శ్రీ గణేశుడిని ప్రథమ పూజ్య దేవతగా భావిస్తారు. ఆయన సర్వవిఘ్నహర్త — అంటే జీవితంలోని అన్ని దుఃఖాలు, ఆటంకాలు, విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏదైనా శుభకార్యం లేదా పండుగను ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ. రక్షాబంధన్ రోజున కూడా ముందుగా గణేశుడికి రాఖీని సమర్పించడం ద్వారా పూజ శుభప్రదంగా సాగుతుందని, అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. _శ్రీ గణేశుడిని ఎలా పూజించాలి?_ ఈ రోజున సోదరీమణులు ముందుగా స్నానం చేసి, గణేశుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం, ధూపం వెలిగించి పూజను ప్రారంభించాలి. గణపతికి సింధూరం, అక్షతలు, పూలు మరియు మిఠాయిలను సమర్పించిన అనంతరం, మొదటి రక్షాసూత్రాన్ని ఆయన పాదాల వద్ద సమర్పించాలి. గణేశ పూజ అనంతరం అన్నయ్యకు రాఖీ కట్టే సరైన విధానం శ్రీ గణేశుడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే అన్నయ్యకు రాఖీ కట్టే విధిని ప్రారంభించాలి. ముందుగా అన్నయ్యను తూర్పు లేదా ఉత్తర దిక్కు వైపు ముఖం చేసి కూర్చోబెట్టాలి. ఆ తర్వాత అన్నయ్య నుదుటిపై సింధూరం, అక్షతలతో తిలకం పెట్టి హారతి ఇవ్వాలి. తదుపరి అన్నయ్య కుడి చేతికి రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తర్వాత అన్నయ్యకు మిఠాయి తినిపించి, అతని సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థించాలి. ఆ తర్వాత అన్నయ్య తన సోదరికి కానుక ఇచ్చి, జీవితాంతం ఆమెకు రక్షణగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. శ్రీ గణేశుడికి ముందుగా రాఖీ కట్టడం అనేది ధార్మిక విశ్వాసం, సంస్కృతి మరియు భక్తితో ముడిపడిన ఒక సంప్రదాయం. అయితే ఇది ప్రతి కుటుంబంలో తప్పనిసరిగా పాటించాల్సిన కఠినమైన నియమం కాదు. అనేక కుటుంబాల్లో రక్షాబంధన్ పూజను గణేశుడి పూజతో ప్రారంభిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో నేరుగా అన్నయ్య చేతికి రాఖీ కట్టే సంప్రదాయం కూడా ఉంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
PSV APPARAO
573 views
7 days ago
#హయగ్రీవ జయంతి - శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి రోజు మరో ఆధ్యాత్మిక ప్రత్యేకత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శ్రీహరిహరుల శుభ అధ్యాత్మిక పవిత్ర మాసం "శ్రావణ మాసం" ప్రారంభం #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు *హయగ్రీవ ఆవిర్భావం* శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రూపాల్లో అవతరించాడు. ఆయన తేజోమయమైన రూపంతో హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. వేదోద్ధరణే లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. వేదాల సంరక్షణలో నిరంతరం మహా విష్ణువు నిమగ్నమై ఉంటాడని, హయగ్రీవావతారం తెలియజేస్తుంది. సృష్టికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా ల మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దగ్గర ఉన్న నాలుగు వేదాలను అపహరించారు. వారు సముద్రంలో ప్రవేశించి, రాసాతలానికి చేరకున్నారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ అవి లేకపోతే తానూ సృష్టిని చేయడం కుదరదని విచారించసాగాడు. శ్రీమహావిష్ణువును స్తుతించాడు. బ్రహ్మ ఆవేదన శ్రీహరి అర్థం చేసుకొని వేద క్షణ కోసం ఒక దివ్య రూపాన్ని పొందాడు. ఆ రూపమే హయగ్రీవ అవతారం శ్రీహరి ధరించిన హయగ్రీవావతరం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రాసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు సామవేదం గానం చేయసాగాడు. ఆ గానావాహిని రసాతలం అంటా మారు మోగింది ఆ గానానికి రసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున రాక్షసులకూ వినిపించింది. ఆ గానానికి పరవశించిన ఆ రాక్షసులిద్దరు బ్రహ్మ దగ్గర నుంచి దొంగిలించిన వేదాలను ఒక చోట దాచిపెట్టి గానం వినిపించిన వైపుకు బయలుచేరారు. ఎంత వెతికినా వారికి ఎవరూ కనిపించలేదు. తిరిగి వేదాలను దాచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలకి వచ్చి చూశారు అక్కడ దివ్య కాంతితో ఉన్న హయగ్రీవుడిని చూసి తాము దాచిన వేదాలను మాయం చేసింది. అతడేనని గ్రహించి కోపంతో అతని మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు హయగ్రీవుడు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. అలా హయగ్రీవావతారం వేదోద్ధారణ లక్ష్యంగా అవతరించింది. వేదాలను కాపాడిన ఆ స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞాన ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దైవతలకు దర్శనమిచ్చాడు. శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఆ రోజున హయగ్రీవస్వామిని పూజించడం వలన విద్యతో పాటు విజ్ఞానం లభిస్తాయని పురాణ వచనం. జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ | ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే || జ్ఞానం, ఆనందం మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్పటికాకృతి కలిగి అన్ని విద్యలకు ఆధారమైన విద్యాధిదేవుడైన హయగ్రీవుడికి సమస్కరిస్తున్నాను. అని ఈ శ్లోకానికి అర్ధం. హయగ్రీవుడిని పూజించిన వారికి విద్యలం లభించడమే కాదు సకల సమస్యలు తీరి చల్లగా బతుకుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. భాగవతంతో పాటు దేవీ పురాణం, స్కాంధ పురాణం. అగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యను: అభ్యసించేవారు హయగ్రీవ ఆవిర్భావం రోజునే ప్రారంభిస్తారు. ఆ రోజున హయగ్రీవస్వామిని షోడశోపవారాలతో అష్టోత్తరాలతో పూజించాలి. ఆయనకు ప్రీతికరమైన యాలకుల మాలను వేసి శనగ గుగ్గిళ్లను నివేదించాలి తెల్లని పూలతో పూజించడం శ్రేష్టం. ఆ రోజున ఉప్పులేని ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
PSV APPARAO
538 views
7 days ago
#శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #శ్రీహరిహరుల శుభ అధ్యాత్మిక పవిత్ర మాసం "శ్రావణ మాసం" ప్రారంభం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభ శ్రావణ మాసం ... రాఖీ పూర్ణిమ ... నరాళి పూర్ణిమ 🙏 *నరాళి పూర్ణిమ* రాఖీపౌర్ణమిని మహారాష్ట్రలో నరాళి పూర్ణిమగా జరుపుకుం టారు. మహారాష్ట్ర కోస్తా తీరంలో కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవున్ని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. రాఖీ పండుగ సందర్భంగా వీరు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరి వరు ణదేవుడ్ని పూజిస్తారు. సంపదలకు ప్రతీక అయిన సింధూ రాన్ని ఒకరి నుదిటిపై మరొకరు దిద్దుతారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఘూలాన్ పూర్ణిమ పేరుతో రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరు లకు రాఖీలు కడతారు. రాఖీ పండుగను భారతదేశం, నేపా ల్లో సార్వత్రికంగా, మిగతా దేశాల్లోని హిందువులు, జైనులు, సిక్కులు జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని 'బలేవా' అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. ఈ రోజున లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టి విష్ణుమూర్తిని కావా లని కోరుకుంటుందట. అలాగే ద్రౌపది శ్రీకృష్ణుడికి రాఖీ కట్టి నందుకు వస్త్రాపహరణ సమయంలో ఆమెను ఆదుకుంటాడు. అలాగే పదిహేను శతాబ్దంలో రాణి కర్ణావతి, హుమాయూను రాఖీ కడుతుంది. ఇవన్నీ రాఖీ పండుగను శతాబ్దాలుగా జరు పుకుంటున్నారు అని చెప్పడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
PSV APPARAO
557 views
10 days ago
#రామేశ్వరం జ్యోతిర్లింగం #రామేశ్వరం యాత్ర #రామేశ్వరం #రామేశ్వరం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *శ్రీ రామేశ్వరం జ్యోతిర్లింగం* *పవిత్రత–వాస్తుశిల్పం మరియు భక్తి యొక్క త్రివేణి సంగమం* హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రావణ మాసంలో దేవాధిదేవుడైన మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. మహాదేవుడు ఆది–అనాది, అజన్ముడు, అనంతుడు. శివుని మహిమ గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో దక్షిణ భారత పవిత్ర భూమిపై కొలువై ఉన్న శ్రీ రామేశ్వరం జ్యోతిర్లింగం మహిమ అద్భుతమైనది, అలౌకికమైనది. రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక ద్వీపంలో ఉంది. హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నాలుగు ధామాలలో ఇది దక్షిణ ధామం. ఉత్తరాన బద్రీనాథ్, పశ్చిమాన ద్వారక, తూర్పున జగన్నాథపురి, దక్షిణాన రామేశ్వరం ఉన్నాయి. ఈ ప్రధాన ఆలయం పూర్తి పేరు అరుల్మిగు రామనాథస్వామి ఆలయం. ఒక వైపు హిందూ మహాసముద్రం, మరో వైపు బంగాళాఖాతం ఉండటంతో ఈ ప్రాంతం సహజ సౌందర్యంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సుమారు 50 వేల జనాభా కలిగిన రామేశ్వరం పట్టణానికి రామనాథస్వామి ఆలయం మరియు పర్యాటక రంగమే ప్రధాన జీవనాధారాలు. దక్షిణ భారత ద్రావిడ వాస్తుశిల్ప శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఒక అద్భుతమైన, భవ్యమైన నిర్మాణానికి నిదర్శనం. 12వ శతాబ్దంలో తొలుత నిర్మించబడిన ఈ ఆలయం అనంతరం పునర్నిర్మించబడింది. భారతదేశంలోని అన్ని ఆలయాలలోకెల్లా అత్యంత పొడవైన, కళాత్మకమైన కారిడార్‌ (ప్రాకారం) రామేశ్వరం ఆలయంలో ఉంది. ఈ ఆలయం సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 1,212 భారీ, శిల్పాలతో అలంకరించబడిన స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభంపై ఉన్న శిల్పకళ ఒకదానికొకటి భిన్నంగా, అత్యంత సున్నితమైన నైపుణ్యంతో రూపొందించబడింది. ఆలయ తూర్పు గోపురం 173 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయ ప్రాంగణంలో 22 పవిత్ర తీర్థకుండాలు ఉన్నాయి. శివలింగాన్ని దర్శించుకునే ముందు ఈ కుండల పవిత్ర జలంతో స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. సముద్రతీరంలో ఉన్న తీర్థకుండం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇక్కడే శ్రీరాముడు యజ్ఞం మరియు పూజ చేయడానికి ముందు స్నానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయం లోపల ఉన్న ఈ కుండల జలం గంగాజలంతో సమానంగా పవిత్రమైనదిగా భావిస్తారు. రామేశ్వరం జ్యోతిర్లింగ ప్రతిష్ఠ వెనుక రామాయణ కాలానికి చెందిన అద్భుతమైన పౌరాణిక కథ ఉంది. లంకపై దండెత్తి, మాత సీతను రాక్షసరాజు రావణుడి చెర నుంచి విముక్తి చేయడానికి సేతుబంధం నిర్మించే ముందు, విజయానికి ఆశీర్వాదం పొందేందుకు శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. శివలింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని శివుని నివాసమైన కైలాస పర్వతానికి పంపించారు. హనుమంతుడు కైలాసానికి చేరుకుని, పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, తన చేతులతో హనుమంతుడికి శివలింగాన్ని ప్రసాదించాడు. హనుమంతుడు తిరిగి రావడంలో ఆలస్యం కావడంతో, శుభముహూర్తం దాటిపోతున్న సమయంలో ఋషిమునుల సలహాతో జగజ్జనని సీతాదేవి సముద్రతీరంలోని ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది. శ్రీరాముడు ఆ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించారు. ఈ శివలింగమే రామనాథస్వామిగా, ఈ క్షేత్రం రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. హనుమంతుడు కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకుని తిరిగి వచ్చినప్పుడు, అప్పటికే మరొక శివలింగం ప్రతిష్ఠించబడినట్లు చూసి బాధపడ్డాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకుని, అతడు భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చిన శివలింగాన్ని కూడా పక్కనే ప్రతిష్ఠించారు. ఆ శివలింగానికి “హనుమతీశ్వర” లేదా “విశ్వేశ్వర” అనే పేరు పెట్టారు. శ్రీరాముడు హనుమంతుడికి వరమిచ్చాడు—భక్తులు ముందుగా హనుమంతుడు తీసుకువచ్చిన “హనుమతీశ్వర” శివలింగాన్ని దర్శించి పూజించిన తరువాతే, సీతాదేవి ప్రతిష్ఠించిన “రామేశ్వరం” శివలింగం పూజ పూర్తిగా ఫలించినట్లుగా భావించబడుతుంది. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. లంకకు చేరుకోవడానికి వానరసేన నలుడు, నీలుడి నాయకత్వంలో సముద్రంపై సుమారు 30 కిలోమీటర్ల పొడవైన రాతి వంతెనను నిర్మించింది. ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు విస్తరించిన ఈ సేతువు 14వ శతాబ్దం వరకు నీటి మట్టానికి పైభాగంలోనే ఉండేదని చెబుతారు. అయితే విధ్వంసకరమైన వరదలు, తుఫానుల అనంతరం ఇది సముద్రంలో మునిగిపోయింది. నేటికీ అంతరిక్షం నుంచి తీసిన చిత్రాల్లో రామసేతు స్పష్టంగా కనిపిస్తుంది. రామేశ్వరంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన, నీటిపై తేలే రాళ్లను నేటికీ భక్తుల దర్శనార్థం ఉంచారు. యుద్ధం ముగిసిన తరువాత విభీషణుడి అభ్యర్థన మేరకు శ్రీరాముడు తన ధనుస్సు కొనతో ఈ సేతువులోని ఒక భాగాన్ని విచ్ఛిన్నం చేశారు. అందువల్ల ఆ ప్రదేశం *“ధనుష్కోడి”* గా ప్రసిద్ధి చెందింది. “ప్రేమలోనే ధర్మం ఇమిడి ఉంది. మనిషి శరీరం మరియు మనస్సుతో పవిత్రంగా లేకపోతే, అతను ఎన్ని తీర్థక్షేత్రాలను సందర్శించినా దానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.” *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
633 views
14 days ago
#శనీశ్వర స్వామి దేవాలయం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శనిదేవ్ #జై శనిదేవ్ 🌹🌹🙏🙏 #జై శనిదేవ్ *భారతదేశంలోని మూడు విశిష్ట సిద్ధ శనిపీఠాలు* శనిదేవునికి సంబంధించిన అద్భుతమైన సిద్ధ పీఠాలలో భారతదేశంలోని మూడు పీఠాలు ప్రధానమైనవిగా పరిగణించబడుతున్నాయి. అవి మహారాష్ట్రలోని శని శింగణాపూర్ శనిపీఠం, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ శనిశ్చర దేవాలయం మరియు ఉత్తరప్రదేశ్‌లో కాశీ సమీపంలోని కోకిలావన సిద్ధ శనిదేవాలయం. మహారాష్ట్రలోని శని శింగణాపూర్ శనిపీఠం: ఈ గ్రామంలో శనిదేవుని అద్భుత మహిమ ప్రత్యక్షంగా కనిపిస్తుందని విశ్వసిస్తారు. ఈ గ్రామంలో నేటి వరకు ఎవరూ తమ ఇళ్లకు తాళాలు వేయరు. ఇక్కడ ఎవరూ దొంగతనం చేయరని, ఒకవేళ దొంగతనం చేయడానికి ప్రయత్నించినా శనిదేవుని కోపదృష్టికి గురవుతారని చెబుతారు. గ్వాలియర్ శనిశ్చర దేవాలయం: ఈ దేవాలయంలో మహావీరుడు హనుమంతుడు లంక నుండి విసిరినట్లు చెప్పబడే అద్భుతమైన శనిదేవుని పిండం ఉంది. ఇక్కడ ప్రతి అమావాస్య రోజున శనిశ్చర జాతర నిర్వహించబడుతుంది. కోకిలావన సిద్ధ శనిదేవాలయం: ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇక్కడ శనిదేవునికి దర్శనం ఇచ్చి, ఈ వనం శనిదేవునిదేనని ఆశీర్వదించాడని చెబుతారు. ఈ వనాన్ని ప్రదక్షిణ చేసే వారికి శనిదేవుని కృప లభిస్తుందని విశ్వాసం. అలాగే భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వారికి శనిదేవుని అశుభ దృష్టి పడదని నమ్ముతారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
1.6K views
1 months ago
#పండరీపురం పాండురంగ విట్టల దర్శనం #అలా పండరిపురంలో "వార్కరీ ఉత్సవం" జయ జయ పాండురంగ విఠలా! #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం *పండరీపురం పాండురంగ ఉత్సవం* *పండరీపురం పాండురంగ ఉత్సవం* > ఓం నమో పాండురంగాయ > ఓం నమో పుండరీక వర్మయా > ఓం నమో నారాయణాయ > ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఈ ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే పండరీపురం పాండురంగ ఉత్సవం అంటారు. అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొట్టమొదటిది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేక సేవలు చేస్తారు. కీర్తనలు పాడతారు. మహారాష్ట్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన పండరిపురంలో కొలువైన పాండురంగ స్వామిని విఠలుడు అనికూడా పిలుస్తారు. ఈ స్వామి వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలని చెబుతారు. అంత వైభవంగా అక్కడ ఉత్సవం జరుగుతుంది. మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షం ప్రసాదించడానికి పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీపాండురంగ స్వామివారి లీలా విశేషాలకు నిదర్శనంగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. భీమా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. ఆ కారణం చేత భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దం కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇక్కడ పాండురంగస్వామిని భక్తులు మెట్లమార్గం ద్వారా దర్శించుకుంటారు. పండరీపురంలో శ్రీపాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పుండరీకుడు అనే వ్యక్తి భోగాలాలసుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారు. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై పశ్చాత్తాపం చెంది అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని తమ తల్లిదండ్రులకు సేవచేశాడు. పుండరీకున్ని శ్రీహరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులుకమ్మని చెప్పాడు. పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి ఉంటాడు. పుండరీకుడు తల్లిదండ్రులకు చేసిన సేవలకు మెచ్చుకొని శ్రీహరి అతనికి వరం ఇవ్వాలనుకున్నాడు. పుండరీకుడు శ్రీహరిని అక్కడే ఉండమని కోరుకున్నాడు. అందువల్ల శ్రీహరి అక్కడే శిలారూపుడయ్యాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడ అక్కడే ఉండిపోయింది. కాని తనతో చెప్పకుండ కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయన పక్కన కాకుండ కొంత దూరంగా ఉండి పోయింది. అందువల్లనే పాండురంగ ఆలయంలో కాకుండా ఆలయం వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. పక్కన ఉన్న ఉపాలయాల్లో సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామికూడా కొలువుతీరి ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో కనిపిస్తారు. ఆషాఢ ఏకాదశినాడు నిర్వహించే పాండురంగస్వామి ఉత్సవం సందర్భంగా ఈ ప్రాంతమంత భక్తజన సంద్రమవుతుంది. ఉత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే వారి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*