ఓం శ్రీమహాలక్ష్మీ నమోస్తుతే💐🎂

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
474 views
19 hours ago
*అలమేలు మంగ - పద్మావతి తాయారు* ఆమె కరుణాంతరంగ.. శ్రీవారి హృదయాంతరంగ..తన బిడ్డలకు వరాలిచ్చేందుకు ఆమె ఏడు కొండలూ దిగివచ్చారు... అల్లంత దూరంలో ఉండి వారి కోరికలను తన పతిదేవుడికి నివేదిస్తున్నారు... అంత ప్రేమ చూపుతారు కాబట్టే ఆమె దేవదేవుడి గుండెల్లో నిక్షిప్తమయ్యారు... జగాలేలే ఆ తండ్రి. నడి రేయి ఏ జామునో ఆమె కోసం ఏడు కొండలూ దిగి వస్తున్నారు. అయ్యవారు - వేంకటేశ్వరుడు అమ్మవారు - పద్మావతీదేవి వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవం.. భక్తుల పాలిట కొంగు బంగారం. ఆపద మొక్కుల వాడు. అనాధ రక్షకుడు. తిరుమల శ్రీనివాసునికి ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగితే అమ్మవారికి కార్తిక మాసంలో కన్నుల పండువగా జరుగుతాయి. అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించిన పంచమినాటికి ముగిసేలా తొమ్మిది రోజుల ముందు ప్రారంభించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తమిళ కార్తికమాసం శుక్లపక్ష పంచమికి ముగిసేట్లుగా ఉత్సవాలు జరుగుతాయి శ్రీ పద్మావతీ దేవి. దేవేరుడికి ఏ మాత్రం తీసిపోని కరుణామయి. భక్తులపాలిట కల్పవృక్షం. భక్తుల విన్నపాలను, కోరికలను పతికి విన్నవించేందుకే వెలిసిన కరుణాంతరంగ!! ఆమె వ్యూహలక్ష్మి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని తమను రక్షించేందుకు భువికి వచ్చిన శ్రీమన్నారాయణుడిగా భక్తులు కొలుస్తారు. ఆగ్రహంతో విచక్షణ మరిచిన భృగు మహర్షిని అనుగ్రహించిన భర్తపై కోపంతో వైకుంఠం వదిలి భూమికి చేరిన శ్రీమహాలక్ష్మినే పద్మావతీదేవిగా భావిస్తారు. శ్రీనివాసుడు ఏడుకొండలను నివాసంగా చేసుకోగా, మహాలక్ష్మి ఆయన హృదయంపై కొలువుదీరింది. వ్యూహలక్ష్మి పేరుతో పూజలు, ఆరాధనలు అందుకునే అమ్మ భక్తులను అనుగ్రహించమని స్వామిని ప్రోత్సహిస్తూ ఉంటుందని చెబుతారని భక్తుల నమ్మకం. శ్రీ వేంకటేశ్వరుని హృదయ పీఠంపై పద్మాసన స్థితిలో వ్యూహలక్ష్మి ఉంటారు. ఈమెను దర్శించడం, ఆరాధించడం అందరికీ సాధ్యపడదు. అందుకే అందరికీ దర్శనమివ్వాలనే తలంపుతోనే అమ్మవారు సువర్ణముఖీ తీరంలో స్వతంత్ర వీరలక్ష్మిగా కొలువుదీరారని అంటారు. అంటే శ్రీనివాసుని హృదయ పీఠంపై ఉన్న దేవేరే తిరుచానూరులో ఉన్న పద్మావతీ దేవి. సరోవరం లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరాక ఆమెను వెదుకుతూ స్వామి కూడా వచ్చేశారు. ఆయన ప్రస్తుత తిరుచానూరులో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసుకుని పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు. కార్తిక మాసంలో పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని బంగారు పద్మంలో అమ్మ ప్రత్యక్షమయ్యారు. అలా పద్మంలో నుంచి వచ్చారుకాబట్టి ఆమె పద్మావతి అయిందని అంటారు. మరో కథ ప్రకారం సంతానం కోసం యజ్ఞం చేసిన నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజు యజ్ఞ భూమిని దున్నుతున్న సమయంలో ఓ పెట్టె దొరికింది. అందులో వెయ్యి రేకులున్న తామర పుష్పంలో స్త్రీ శిశువు దర్శనమిచ్చింది. ఆమెను బిడ్డగా స్వీకరించిన ఆకాశరాజు పద్మంలో లభించినందువల్ల పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుని యుక్త వయసు రాగానే శ్రీనివాసునికిచ్చి వివాహం జరిపించారని అంటారు. అలమేలు మంగ ఎవరు పద్మావతీ అమ్మవారిని అలమేలు మంగాదేవి అనికూడా పిలుస్తారు. దీనికో కథ చెబుతారు. పూర్వం శుక మహర్షి హిమాలయాల నుంచి బయల్దేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వర్ణముఖీనదీ తీరంలోని ప్రస్తుత క్షేత్రానికి చేరి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసించసాగారు. తర్వాత అక్కడ ఒక ఊరు ఏర్పడింది. దీన్ని మహర్షి పేరుమీదే శ్రీ శుకనూరు అని పిలిచేవారు. తర్వాత అది తిరుగచ్చనూరు అయింది. అది కాల క్రమంలో తిరుచానూరు అయింది. తిరుచానూరులో అమ్మవారు పద్మంపై ఆశీనురాలై ఉంది. తమిళంలో అమ్మవారిని అలర్‌మేల్‌ మంగై అని అంటారు. అంటే తామర పువ్వుపై ఉన్న దేవత అని అర్థం. అందువల్లనే పద్మావతీదేవికి అలమేలు మంగా దేవి అని, తిరుచానూరుకు అలమేలు మంగాపురం అని పేర్లు వచ్చాయి. ముందుగా అమ్మ దర్శనం సాధారణంగా పిల్లలు ముందు తల్లి వద్దకు వెళ్లి గోముగా అడుగుతారు. ఆ తర్వాతే తండ్రి వద్దకు...! ఇక్కడా అంతే. తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించిన తర్వాత స్వామి చెంతకు వెళ్లాలని నియమం. అయితే తిరుమల కంటే ముందు తిరుచానూరు చూడాలని చెబుతారు. కొండపైకి వెళ్లే ముందు దిగువున కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని, ప్రార్థించి తమ కోరికలను విన్నవించుకోవాలి. తర్వాత కొండకు చేరి అయ్యవారిని వేడుకోవాలి. అందుకేనేమో 32 వేలకు పైగా కీర్తనల్లో శ్రీనివాసుడిని అర్చించిన పదకవితా పితామహుడు అన్నమాచార్య తొలిసారిగా అమ్మవారి పైనే శతకాన్ని రచించారు. కీర్తనలతో అర్చించారు. ‘చొచ్చితి తల్లీ! నీ మరుగు సొంపుగ నీ కరుణాకటాక్షమెట్లబ్బెదో నీకు నేడు పరమేశ్వరీ! యోయలమేలు మంగ...’ అంటూ ఆ తల్లిని గురించి తొలిసారిగా శతకం రచించారు. పంచమీ తీర్థం బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైంది పంచమీ తీర్థం. ఇది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరుగుతుంది. అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరంలో ఆమె ఆవిర్భవించిన రోజు జరిగే సేవ ఇది. పద్మ సరోవరం వద్ద అమ్మవారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు పంచమీ తీర్థంలో స్నానం చేస్తారు. ఆనాటి రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తిరుమల నుంచి సారె బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు జరిగే పంచమీ తీర్థంలో చక్రస్నానంనాడు తిరుమల నుంచి అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీ. ఆ రోజు తిరుమల నుంచి అర్చకులు, ఆలయ అధికారులు కాలినడకన సారెను తీసుకువస్తారు. ఇందులో రెండు పట్టు చీరెలు, రెండు పట్టు రవికలు, పచ్చి పసుపు చెట్లు, పసుపు, చందనం ముద్దలు, పూల మాలలు, తులసి మాలలతో పాటు రెండు బంగారు నగలు ఉంటాయి. ఇంకా వివిధ పిండి వంటలు ఒక్కో పడి వంతున పంపుతారు. అంటే 51 పెద్ద లడ్డూలు, 51 వడలు, 51 దోసెలు సారెలో భాగంగా పంపుతారు. వీటిని ఏనుగు అంబారీపై ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు. తిరుచానూరులో పంచమీ తీర్థం ముగిశాకే తిరుమలలో స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. నీరాజ‌నం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఇద్దరు దేవేరులు. శ్రీదేవి, భూదేవి. శ్రీవారి మూలవిరాట్టుపై శ్రీదేవి శాశ్వత స్థానాన్ని పొందగా, భూదేవి రూపాన్ని స్వామి వక్ష స్థలంపై అలంకరిస్తారు. వ్యూహలక్ష్మి తిరుచానూరులో కొలువుదీరి ఉన్న పద్మావతీదేవి కాగా, భూదేవి ఎక్కడ కొలువుదీరారనే సందేహం కలుగుతుంది. ఈ విషయాన్ని వరాహ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యం వివరిస్తుంది. స్వామి వారి ఆనంద నిలయాన్ని నిర్మించింది తొండమాన్‌ చక్రవర్తి. ఆయన ఒకసారి నేరుగా శ్రీవారి ఏకాంత మందిరంలోకి వచ్చినప్పుడు, హఠాత్తుగా ప్రవేశించిన ఆయనను చూసి శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దాక్కుంటే, భూదేవి ఆలయంలోని బావిలో దాక్కు,న్నారు. ఆ బావే ఇప్పటి సంపంగి ప్రదక్షిణంలో ఉన్న పూలబావి అని చెబుతారు. తర్వాత రామానుజులు తిరుమల సందర్శించినప్పుడు ఈ గాథ తెలుసుకుని ఆ బావిలోనే అమ్మను ప్రతిష్ఠించి నివేదనలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పూలమాలలను కూడా ఆ బావిలోనే వేసే ఏర్పాట్లు చేసినట్లు చెబుతారు.. పూర్వం అయ్యవారి ఆరాధన ఇక్కడే సుమారు 9, 10 శతాబ్ధాలకంటే ముందే తిరుచానూరులో ఎక్కువ మంది అయ్యవారిని ఆరాధించేవారట. అందుకే తిరుచానూరులో కూడా శ్రీ వేంకటేశ్వరుడి మూర్తిని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతారు. కాగా తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు కూడా తిరుచానూరులోనే జరుగుతుండేవి. అప్పట్లో తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ధ్వజారోహణ ఉత్సవం మాత్రమే జరిగేది. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే జరుగుతుండేవి. రామానుజాచార్యుల కాలం నుంచి కొండపై ఉత్సవాలను నిర్వహించటం మొదలయ్యింది. #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #ఓం శ్రీ మహాలక్ష్మీయ్ నమః #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.7K views
22 days ago
🌺 శ్రావణ మాసం – వరలక్ష్మీ వ్రతం విశిష్టత 🌺 🙏 శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివుడు, పార్వతీదేవి, మహాలక్ష్మి, వరలక్ష్మీదేవి తదితర దేవతలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు అమ్మవారి పూజకు విశేషమైనవిగా భావిస్తారు. 🌸🪔 🌺 శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున వరాలను ప్రసాదించే వరలక్ష్మీ దేవిని పూజిస్తారు. 🙏🌺 🌸 వరలక్ష్మీ దేవిని ఎందుకు పూజించాలి? అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు— 💰 ధనసంపద 🌾 ధాన్యసమృద్ధి 🏡 కుటుంబ సుఖశాంతులు 💍 సౌభాగ్యం 👶 సంతాన శ్రేయస్సు 🧘 ఆరోగ్యం, మానసిక ప్రశాంతత 🏆 విజయాలు, కార్యసిద్ధి 🌺 కుటుంబ క్షేమం కలగాలని ప్రార్థిస్తారు. “వరాలను ప్రసాదించే తల్లి” కనుక ఆమెను వరలక్ష్మీ అని భక్తితో పిలుస్తారు. 🙏🪷 🌺 చారుమతి చరిత్ర 🌺 🌸 పరమ పవిత్రమైన వరలక్ష్మీ వ్రత కథకు ప్రసిద్ధమైన మూలకథ చారుమతి వృత్తాంతం. పూర్వం మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి అనే సద్గుణ సంపన్నురాలైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. 👩‍🦱🌸 ఆమె తన భర్తను ఎంతో గౌరవంతో చూసేది. 🙏 అత్తమామలను తన తల్లిదండ్రుల వలె భావించి భక్తితో సేవించేది. ❤️ ఇంటి పనులను ఓర్పుతో, శ్రద్ధతో చేసేది. 🏡 అందరితోనూ మితంగా, మృదువుగా, ప్రేమగా మాట్లాడేది. 🌺 🌅 ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, దేవతలను పూజించి తన దినచర్యను ప్రారంభించేది. 🪔🌸 భర్తను దైవస్వరూపంగా భావించి సేవించడం, అత్తమామలను గౌరవించడం, పెద్దలను ఆదరించడం, అందరితో మంచిగా ఉండడం ఆమె జీవితంలో ముఖ్యమైన లక్షణాలు. 🙏🌷 🌺 మహాలక్ష్మి స్వప్న దర్శనం 🌺 చారుమతి యొక్క భక్తి, వినయం, సేవాభావం, సద్గుణాలు చూసి మహాలక్ష్మీదేవి సంతోషించిందని కథనం. 🪷✨ ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చింది. 🌟🌺 అమ్మవారు ఆమెతో తనను భక్తిశ్రద్ధలతో పూజించే వారికి సకల శుభాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తానని తెలియజేసి, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని చెప్పింది. 🙏🪔 🌸 ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయాలని అమ్మవారు సూచించినట్లు చారుమతి కథలో చెప్పబడుతుంది. 🪷 చారుమతి తన కుటుంబానికి చెప్పడం 🪷 🌅 ఉదయం నిద్రలేచిన చారుమతి తనకు వచ్చిన స్వప్నాన్ని భర్తకు, అత్తమామలకు వివరించింది. 🙏 అందరి అనుమతితో ఇరుగుపొరుగు స్త్రీలను కూడా పిలిచి, అమ్మవారు చెప్పిన విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించేందుకు సిద్ధమైంది. 🌺🪔 ఇంటిని శుభ్రం చేసి, మంగళకరంగా అలంకరించి, కలశాన్ని ప్రతిష్ఠించి, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించింది. 🌼🥥🍌 స్త్రీలందరూ కలిసి భక్తితో వరలక్ష్మీదేవిని పూజించారు. 🙏🌸 ✨ అమ్మవారి అనుగ్రహం ✨ వ్రతం పూర్తయిన తరువాత చారుమతి మరియు ఆమెతో కలిసి వ్రతం చేసిన స్త్రీలు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారని కథనం. 🌺🙏 💰 వారి ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరిశాయి. 🌾 ధనధాన్యాలు సమృద్ధిగా లభించాయి. 🐘 గజరాజులు, వైభవం కలిగాయని కథలో చెప్పబడుతుంది. 🏡 కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొన్నాయి. 🌸 చారుమతితో పాటు వ్రతం చేసిన స్త్రీల కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాయి. అందుకే వరలక్ష్మీ వ్రతం స్త్రీలలో ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న పవిత్రమైన సంప్రదాయంగా భావిస్తారు. 🙏🪷 🌺 అష్టలక్ష్ములను పూజించాలా? 🌺 అవును బ్రో 🙏🌸 వరలక్ష్మీ పూజలో లక్ష్మీదేవి యొక్క వివిధ స్వరూపాలను స్మరించడం, ముఖ్యంగా అష్టలక్ష్ములను ఆరాధించడం అనేక సంప్రదాయాల్లో ఉంది. అయితే ప్రతి ఇంట్లో ఒకే విధమైన పూజా విధానం తప్పనిసరి కాదు; కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం మారవచ్చు. 🙏 🪷 అష్టలక్ష్ములు 🪷 💰 1. ఆదిలక్ష్మి అమ్మవారి ఆదిస్వరూపం. శుభం, మంగళం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఆరాధిస్తారు. 🌸🙏 💵 2. ధనలక్ష్మి ధనం, సంపద, ఆర్థిక సౌభాగ్యం కోసం పూజిస్తారు. 💰🌺 🌾 3. ధాన్యలక్ష్మి ధాన్యసమృద్ధి, ఆహార సమృద్ధి, కుటుంబ పోషణకు ప్రతీకగా భావిస్తారు. 🌾🙏 👶 4. సంతానలక్ష్మి సంతానం మరియు వారి శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. 👨‍👩‍👧‍👦🌸 🐘 5. గజలక్ష్మి వైభవం, రాజసౌభాగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా ఆరాధిస్తారు. 🐘🪷 📚 6. విద్యాలక్ష్మి విద్య, జ్ఞానం, వివేకం కోసం పూజిస్తారు. 📖🙏 🏆 7. విజయలక్ష్మి కార్యాలలో విజయం, ధర్మబద్ధమైన ప్రయత్నాల్లో సాఫల్యం కోసం ప్రార్థిస్తారు. 🏆🌺 💪 8. ధైర్యలక్ష్మి ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టాలను ఎదుర్కొనే శక్తి కోసం ఆరాధిస్తారు. 🪷✨ 🌸 శ్రావణ శుక్రవారాల్లో ఏం చేయాలి? 🌸 🧹 ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. 🪔 ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. 🌺 లక్ష్మీదేవికి పూలతో అలంకరణ చేయాలి. 🥥 కలశాన్ని ప్రతిష్ఠించి పూజించవచ్చు. 🍌 పండ్లు, పాయసం, లడ్డూలు వంటి నైవేద్యాలను శక్తికి తగిన విధంగా సమర్పించవచ్చు. 🙏 వరలక్ష్మీ వ్రతం చేసే రోజున వ్రతకథను చదివి లేదా విని అమ్మవారిని భక్తితో ప్రార్థించాలి. 🌸 ముత్తైదువులను గౌరవించి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం అనేక కుటుంబాల్లోని సంప్రదాయం. 🪷 ముఖ్యంగా భక్తి, శ్రద్ధ, పవిత్రమైన మనసే ప్రధానమైనవి. 🌺 నాలుగు శ్రావణ శుక్రవారాలు 🌺 శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించవచ్చు. 🪔🌸 🌸 1వ శుక్రవారం – కుటుంబ మంగళం కోసం 🌸 2వ శుక్రవారం – ధనధాన్య సమృద్ధి కోసం 🌸 3వ శుక్రవారం – కుటుంబ ఆరోగ్యం, సుఖశాంతుల కోసం 🌸 4వ శుక్రవారం – ఐశ్వర్యం, శ్రేయస్సు, సర్వమంగళం కోసం 🙏 అయితే నాలుగు శుక్రవారాలు తప్పనిసరిగా వరలక్ష్మీ వ్రతం చేయాలి అనే నియమం లేదు. ప్రధాన వరలక్ష్మీ వ్రతానికి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 🌺 🪷 చివరగా... “చారుమతి వంటి భక్తి, సేవాభావం, వినయం మనలో ఉంటే అదే నిజమైన లక్ష్మీ అనుగ్రహానికి మార్గం.” 🙏🌸 🌺 శ్రీ వరలక్ష్మీ దేవి కటాక్షం ప్రతి ఇంటిపై ఉండాలి 💰 ధనధాన్య సమృద్ధి కలగాలి 🏡 సుఖశాంతులు వెల్లివిరియాలి 👨‍👩‍👧‍👦 కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి 🌸 అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి 🪔 శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః 🙏🪷 శ్రీ వరలక్ష్మీ దేవి శుభకటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటూ… 🌺🙏 #తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #ఓం శ్రీ మహాలక్ష్మీయ్ నమః