"భక్తి సమాచారం"

Satya Vadapalli
4.2K views
9 days ago
కృష్ణ మంత్రాలు- మంత్రాల అర్థాలు జపించడం వలన కలిగే లాభాలు శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని అవతారము. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు సమస్త మానవాళికి గొప్ప సందేశాన్ని అందించాడు. నిజానికి, భగవద్గీతలో కృష్ణుని బోధనలను ఇప్పటి విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు మోటివేషనల్ స్పీచెస్ లో వివరిస్తున్నారు కూడా. అంతటి ప్రాధాన్యత కలిగినవి శ్రీకృష్ణుని బోధనలు. మానవాళిని అన్నిరకాల బాధల నుంచి రక్షించేవాడని శ్రీకృష్ణుడిని కొలుస్తారు. ఈ రోజు ఈ ఆర్టికల్ లో శ్రీకృష్ణుని మంత్రాలూ వాటి అర్థాలు. వాటిని జపించడం వలన కలిగే లాభాలను తెలుసుకుందాం శ్రీకృష్ణుని మహామంత్రము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అర్థం: ఈ మంత్రంలో శ్రీమహావిష్ణువు అవతారలైన శ్రీరాముడిని అలాగే శ్రీకృష్ణుడిని స్తుతించడం జరిగింది. మానవాళికి విముక్తిని ప్రసాదించే శ్రీ వాసుదేవునికి నమస్కారాలను తెలియచేయుచున్నాము. కృష్ణ భక్తి మంత్రం 'జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసడై గౌర్ భక్తా వృంద' అర్థం ఈ మంత్రంలో శ్రీకృష్ణుడి గొప్ప భక్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. వారి ఆశీస్సులను కూడా అందించమని ప్రార్థించడం జరిగింది. కృష్ణాష్టకం - 1 'వసుదేవ సూతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్' అర్థం వసుదేవ తనయా, నీవు కంసుని అలాగే చాణూరుని వంటి రాక్షసులను వధించిన శక్తివంతుడవు. దేవకీ మాతకు పరమానందాన్ని కలిగించావు. నీవు ఈ విశ్వానికే దేవుడవు. వాసుదేవునికి వందనం. కృష్ణాష్టకం - 2 'అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కనకన కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్' అర్థం అతసీ పుష్పాలను అలంకరించుకుని, కడియాలతో అలాగే దండలతో మెరుస్తున్న వాసుదేవుడు కుడిచేతికి రత్నాలతో చేయబడిన కడియాలు వేసుకున్నాడు. వాసుదేవునికి వందనం. కృష్ణాష్టకం - 3 'కుటిలలాకా సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననామ్ విలసత్ కుండల ధరమ్ కృష్ణం వందే జగద్గురుమ్' అర్థం శ్రీకృష్ణుని కురులు నల్లగా నిగనిగలాడుతున్నాయి. ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తోంది. చెవులు మెరుస్తున్నాయి. శ్రీకృష్ణునికి వందనం. కృష్ణాష్టకం - 4 'మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింజావ చూదంగం కృష్ణం వందే జగద్గురుమ్' అర్థం మందార పూల పరిమళంతో మెరుస్తున్న శ్రీకృష్ణభగవానుడి చిరునవ్వు అలాగే నాలుగు చేతులూ అత్యంత సుందరమైనవి. శ్రీకృష్ణ పరమాత్ముని కురులపై నెమలి పింఛం కొలువైంది. శ్రీ వాసుదేవునికి వందనాలు. శ్రీకృష్ణ పరమాత్ముని మంత్రాలను ఎలా జపించాలి: బ్రహ్మముహూర్త వేళలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు ఈ మంత్రాలను పఠిస్తే ఉత్తమం. ఉదయాన్నే స్నానం చేసి శ్రీకృష్ణుని పఠం ముందు కూర్చోవాలి. కృష్ణ మంత్రాన్ని తులసి మాలతో లెక్కపెట్టుకుంటూ 108 సార్లు పఠించాలి. జపమాలని మూడు వేళ్లపైన ఉంచి జపిస్తూ ఉండాలి. (చిటికెన వేలు, ఉంగరం వేలు అలాగే మధ్య వేలిని కలుపుతూ) బొటనవేలుని సపోర్ట్ గా వాడుకోవాలి. చూపుడువేలుని ఒంపుగా ఉంచాలి. సవ్యదిశలోనే జపమాలని తిప్పాలి. కృష్ణ మంత్రాన్ని జపించడం వలన కలిగే లాభాలు అన్ని రకాల భయాలు అలాగే కలవరాలు తొలగిపోతాయి. ధైర్యం అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అన్నిరకాల వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లోని నెగటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రవేశిస్తాయి. విద్యార్థులు జ్ఞానం మెరుగవుతుంది. ఉద్యోగస్తుల అలాగే వ్యాపారులకు ఎదుగుదల అలాగే విజయం లభిస్తాయి. #శ్రీ కృష్ణ #🕉️🙏🌺శ్రీ రాధే కృష్ణ 🌺🙏🕉️ #🙏🏻భక్తి సమాచారం😲 #దేవుళ్ళ స్టేటస్ #🌅శుభోదయం
హరికృష్ణ ఆచార్య
13.9K views
11 days ago
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *🍃కాశీ విశ్వనాథాష్టకం🍃* *🌹గంగా తరంగ రమణీయ జటా కలాపం* *గౌరీ నిరంతర విభూషిత వామ భాగం* *నారాయణ ప్రియమనంగ మదాపహారం* *వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్* ॥ 1 ॥ 🌹వాచామగోచరమనేక గుణ స్వరూపం వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం వామేణ విగ్రహ వరేన కలత్రవంతం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥ 🌹భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥ 🌹సీతాంశు శోభిత కిరీట విరాజమానం బాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 4 ॥ 🌹పంచాననం దురిత మత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 5 ॥ ☀️తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనంద కందమపరాజిత మప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 6 ॥ 🌹ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 7 ॥ 🌹రాగాధి దోష రహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 8 ॥ 🌹వారాణశీ పుర పతే స్థవనం శివస్య వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ॥ *🌹విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ* *శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే* ॥ 🌹☀️🌹☀️🌹☀️🌹☀️🌹
🧿 శ్రీ లలితా పరమేశ్వరి మాత 🧿🙏
811 views
18 days ago
*🌿🌼 విష్ణు సహస్రనామం విశిష్టత 🌼🌿* ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా.. పిల్లలు మనమాట వినాలన్నా..(ఎంతవయసు వచ్చినా సరే) ఈ స్తోత్రం పఠించాల్సిందే .! సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి. కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం, భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు. ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు. నామము అందరూ చెప్పవచ్చు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు. దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!! విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ. పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. అది సంజీవనీ ఓషధి వంటిది. కాబట్టి నీవు దీనికి భాష్యం వ్రాయాలి. అని పలికింది. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. ఆతరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు. భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్ర నామ స్తోత్రం. ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది. విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 108 రక్షణ హేతువు. గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108. పూజకు సమయంలేనప్పుడు.. కేశవ, మాధవ, నారాయణ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ. వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. అలా అని ఆలస్యంగా లేవమని కాదు. ఈనామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు. సర్వేజనా సుఖినోభవంతు #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🌻" తొలి ఏకాదశి శుభాకాంక్షలు "🌻 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Satya Vadapalli
2.3K views
1 months ago
జయ మంత్రము జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః| రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః|| దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః| హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః|| న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్| శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః|| అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్| సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్|| రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు ఈ జయ మంత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి విజయం తథ్యం. #🙏🏻భక్తి సమాచారం😲 #🚩 జై భబజరంగబలి🙏 #శ్రీ ఆంజనేయం #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్