#🙏🙏రవి రెడ్డి 🙏🙏 #🇮🇳చరిత్ర🇮🇳 రవి #ప్రేమ + ఆణిముత్యలు +అర్ట్స్ కళలు +G K + ప్రకృతి +హెల్త్ +ఫోక్ సాంగ్స్ + పాటలు+ అందమైన బామలు +Hot #🌹🙏మంచి మాటలు🙏 🌹 భవసాగర తరణం*
కలియుగంలో భగవన్నామ స్మరణతో భవసాగరాన్ని దాటవచ్చని శాస్త్ర వచనం. నామాన్ని స్వాధీనం చేసుకుంటే నారాయణుడు స్వాధీనమై ఉంటాడు. నారాయణుడే కృష్ణుడు. కృష్ణుడే నారాయణుడు. ఆ కృష్ణునికి ఎన్నో నామాలు. కొన్ని నామాల వైదుష్యాన్ని తెలిసుకొందాము.
సర్వ జీవుల రక్షకుడు భగవంతుడే. ఆయన కరుణయే సదా జీవులను కాపాడుతుంది. జనుల ఆర్తిని బాపి రక్షించువాడు కనుక ఆయన జనార్దనునిగా కీర్తింపబడ్డాడు.
ఆయనకు ‘నీలదేహుడ'నే పేరు ఉంది. అనగా నల్లని శరీరం కలవాడు. ఆకాశానిది నీలివర్ణం. ఈ వర్ణం అనంతానికి చిహ్నము.
విష్ణువు ఎందరో దానవులకు శత్రువు. అలాగే జీవుల హృదయాలలో ఉండే కామ క్రోధలోభాలనే అరిషడ్వర్గాలు దానవ గుణాలు వాటిని హరించేవాడు గనుక ఆయన 'దానవ వైరి అయ్యాడు. ఆయన మాధవుడు. 'మ' అంటే లక్ష్మీదేవి. 'ధవుడు' అంటే భర్త. లక్ష్మీదేవి భర్త ఆయనే కనుక ఆయనకు మాధవుడు అనే పేరు వచ్చింది. అయితే కలిమానవులు మననం ద్వారా, దేవతలు ధ్యానం ద్వారా, రాక్షసులు యోగం ద్వారా తరించాలని చెప్పటం కూడా మాధవ శబ్దానికి అర్ధంగా స్వీకరించవచ్చని
కొందరు వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు.
అనన్య భక్తులు ముక్తి కోసం శ్రీకృష్ణుని స్తుతిస్తారు గాన ఆయన ముకుందుడు అయ్యాడు.
అందరిలో అజ్ఞానాన్ని అంతం చేయువాడు కనుక ఆయన అచ్యుతుడు అయినాడు.
సుదర్శన చక్రాన్ని ధరించేడు కనుక ఆయన చక్రధారి.
సకల జీవుల పాపాలను హరించువాడు కనుక ఆయన హరి.
సర్వ వ్యాపకత్వం కలవాడు కనుక విష్ణువు అయ్యాడు.
'ముర' అనే రాక్షసుని సంహరించినందున మురారి.
బాలకృష్ణునిగా వెన్న దొంగిలించాడు కనుక నవనీతచోరుడు.
ఆయనకు గోవిందుడు అనే పేరు ఉంది. గో అనే పదానికి గోవులు, వేదాలు అనే అర్థం ఉంది. వింద అంటే కనుగొనేవాడు, పొందేవాడు అనే అర్థాలు ఉన్నాయి. ఆయన గోవుల కాపరిగా తప్పిపోయిన గోవులను కనుగొనేవాడు, పరమాత్మగా వేదాలను పొంది ఉన్నవాడు కనుక ఆ పేరు వచ్చింది. అలాగే గోవులకు, గోపజనాలకు విందులు చేసేవాడు కనుక ఆ పేరు వచ్చిందని తెలుగు అర్ధాన్ని కూడా చెబుతుంటారు.
గోవర్ధన గిరి ఎత్తిపట్టుకోవడం ద్వారా దానిని ధరించిన వాడు అయినందున ఆయన గిరిధారి అయ్యాడు.
వసుదేవుని కుమారుడుగా వాసుదేవుడయ్యాడు.
నందుని ముద్దుల పట్టి కనుక నందనంద నుడయ్యాడు.
గరుడుడు వేద స్వరూపుడు. గుడ్డు నుంచి పుట్టినవాడు కనుక గరుడునికి అండజుడనే పేరు ఉంది. ఆతనిని వాహనంగా చేసుకున్నవాడు కనుక అండజవాహను డయ్యాడు.
ప్రళయకాలంలో విశ్వమంతా జలమయమైనపుడు వటపత్రంపై శయనించి ఉంటాడు కనుక వటపత్ర శాయి అయ్యాడు.
బాలకృష్ణుని తల్లి యశోద తాడుతో కట్టినందున ఆయన దామోదరుడు అయ్యాడు.
క్షీరసాగరమథన సమయంలో కూర్మరూపుడై మందరపర్వతాన్ని మోసినందున ఆయన నగధరుడన్నారు. నగధరుడ
'క' అంటే సృష్టికారణమైన బ్రహ్మ, దానిలోని 'ఆ' దీర్ఘం స్థితికారకుడైన విష్ణువుని సూచిస్తుంది. ఈశ అనగా శివుడు వీటిని కలిపితే వ్యాకరణరీత్యా కేశవుడవుతుంది. అంటే ఆయన త్రిమూర్త్యాత్మకుడని భావించాలి. ఈ శబ్దంలో త్రిమూర్తులకాధారమైన 'వాసుదేవ చైతన్యం' ఉందని శివుడు పేర్కొన్నట్టు హరి వంశంలో ఉంది.
భక్తుల అపరాధములు క్షమించి కాపాడడం వలన భక్తవత్సలుడయ్యాడు.
ఉత్తమ పురాణ పురుషుడైనందున పురుషోత్తముడయ్యాడు.
హృషీకములనగా ఇంద్రియాలు. వాటిని అదుపులో ఉంచేవాడు కనుక హృషీకేశుడైనాడు.
ఇక కృష్ణ శతకకారుడు ఆయనను ఈ విధంగా కీర్తించాడు.
నీ నామము భవ హరణము
నీ నామము సర్వ సౌఖ్య నివహకరంబున్
నీనామమమృతపూర్ణము నీనామమునే దలతు నిత్యము కృష్ణా అంటూ ప్రార్థించాడు.
నామ వైభవ స్మరణం శాంతి శుభాలనిచ్చి కైవల్య ప్రాప్తి కలిగిస్తుంది.
_ఈ వ్యాసం_
_జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త_
*శ్రీ శ్రీ శ్రీ చక్రధారి గోస్వామి గారి ప్రవచనామృతం* ఆధారంగా రచించబడినది.