శ్రీ సత్యనారాయణ స్వామి

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4.9K views
1 days ago
సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం.............!! మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము. ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి. 1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు. ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు. 2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు. ౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది. ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను. 4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది. పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు. 5. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు. కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం........ 1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు. 2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి. 3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. 4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది. 5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది. ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి. # శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 🙏🙏🙏🙏🙏 #అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి #అన్నవరం #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
734 views
5 days ago
🙏🕉️ అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి విశిష్టత – స్థలపురాణం 🕉️🙏 🌿 శ్రీ సత్యదేవుని మహిమ 🌿 ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో అన్నవరం క్షేత్రానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. తూర్పు గోదావరి ప్రాంతంలోని రత్నగిరి కొండపై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారు కొలువై ఉన్నారు. అన్నవరం క్షేత్ర మహిమ స్కాంద పురాణంలోని రేవాఖండంలో వివరించబడిందని దేవస్థానం పేర్కొంటుంది. ఇక్కడ స్వామివారు సాధారణ విష్ణు రూపంలో కాకుండా హరి–హర–హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక రూపంలో దర్శనమిస్తారు. అంటే ఒకే స్వామి రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వం దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క అత్యంత విశిష్టత. అందుకే వైష్ణవులు, శైవులు అనే భేదం లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 🙏 🌺 రత్నగిరి కొండకు ఆ పేరు ఎలా వచ్చింది? పురాణ కథనం ప్రకారం మేరు పర్వతుడు, ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు వారికి ఇద్దరు కుమారులను ప్రసాదించాడు. వారిలో ఒకరు భద్రుడు, మరొకరు రత్నాకరుడు. భద్రుడు శ్రీమహావిష్ణువును భక్తితో ఆరాధించి, ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు ప్రసన్నమైన శ్రీమహావిష్ణువు అతనిపై అనుగ్రహం చూపగా, భద్రుడు పవిత్రమైన భద్రాచలంగా మారాడని స్థలపురాణం చెబుతుంది. అక్కడే శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడని విశ్వాసం. అదేవిధంగా రత్నాకరుడు కూడా తన అన్న భద్రుడి మార్గాన్ని అనుసరించి శ్రీమహావిష్ణువును భక్తితో ప్రార్థించాడు. రత్నాకరుడి తపస్సుకు ప్రసన్నమైన శ్రీమహావిష్ణువు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి రూపంలో రత్నాకరునిపై కొలువుదీరాడు. రత్నాకరుడే రత్నగిరి కొండగా మారాడని స్థలపురాణ విశ్వాసం. అందువల్ల ఈ కొండను రత్నగిరి అని పిలుస్తారు. 🙏🌺 🌊 పాంపా నది విశిష్టత రత్నగిరి కొండ పాదాలను పవిత్రమైన పాంపా నది తాకుతూ ప్రవహిస్తుంది. పవిత్రమైన నది కొండను చుట్టుముట్టి ఉండటం ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. 🌺 అన్నవరం అనే పేరు ఎలా వచ్చింది? అన్నవరం అనే పేరుకు రెండు ప్రసిద్ధ విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి — ఈ ప్రాంతంలో పూర్వం దాతృత్వం కలిగిన ప్రజలు నిరంతరం అన్నదానం చేసేవారని, అన్నం పెట్టే ప్రదేశంగా ప్రసిద్ధి చెందడంతో అన్నవరం అనే పేరు వచ్చిందని చెబుతారు. మరొక విశ్వాసం ప్రకారం, ఇక్కడి స్వామివారు భక్తులు కోరిన వరాలను అనుగ్రహించే దేవుడు. అందువల్ల కోరిన వరం ప్రసాదించే క్షేత్రం అనే భావనతో అన్నవరం అనే పేరు వచ్చిందని చెబుతారు. 🙏 🌟 స్వామివారి విగ్రహం ఎలా వెలుగులోకి వచ్చింది? ఒకప్పుడు రత్నగిరి కొండపై స్వామివారి విగ్రహం పూజలు లేకుండా ఉండిపోయిందని స్థలపురాణం చెబుతుంది. అన్నవరం ప్రాంతానికి చెందిన ఎరంకి ప్రకాశం అనే బ్రాహ్మణుడికి ఒక రాత్రి స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి, కొండపై తన విగ్రహం నిర్లక్ష్యంగా ఉందని, దానిని కనుగొని తిరిగి ప్రతిష్ఠించి పూజలు చేయాలని ఆదేశించినట్లు దేవస్థానం చరిత్రలో పేర్కొంటుంది. ఆ బ్రాహ్మణుడు ఈ విషయాన్ని అప్పటి గోరస జమీందారు శ్రీ రాజా ఐ.వి. రామరాయణం గారికి తెలియజేశాడు. ఆయనతో పాటు గ్రామస్థులు, భక్తులు రత్నగిరి కొండపై వెతకగా స్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారు. తరువాత ఆ విగ్రహాన్ని పూజించి, 1891లో శ్రావణ శుద్ధ విదియ రోజున ప్రతిష్ఠించారు. మొదట అక్కడ చిన్న పాక నిర్మించారు. భక్తుల సహకారంతో తరువాత ఆలయం అభివృద్ధి చెందింది. ఆ తరువాత ఆలయం మరింత విస్తరించబడింది. 🕉️ ఒకే రూపంలో త్రిమూర్తులు అన్నవరం స్వామివారి మూలవిరాట్ సుమారు 13 అడుగుల ఎత్తులో ప్రత్యేకమైన రూపంలో ఉంటుంది. స్వామివారి రూపంలో దిగువ భాగం బ్రహ్మ తత్వాన్ని, మధ్య భాగం మహేశ్వర తత్వాన్ని, పై భాగం విష్ణు తత్వాన్ని సూచిస్తుంది. అందువల్ల ఇక్కడ ఒకే స్వామి రూపంలో సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, లయకర్త మహేశ్వరుడు దర్శనమిస్తారని భావిస్తారు. 🙏 “మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతశ్చ మహేశ్వరం అగ్రతః విష్ణు రూపాయ త్రైక రూపాయ తే నమః” అంటే — 🌺 మూలంలో బ్రహ్మస్వరూపుడైనవారికి, 🌺 మధ్యలో మహేశ్వరస్వరూపుడైనవారికి, 🌺 అగ్రభాగంలో విష్ణుస్వరూపుడైనవారికి, 🌺 త్రిమూర్తుల ఏకరూపుడైన శ్రీ సత్యనారాయణ స్వామివారికి నమస్కారం. 🛕 రథాకారంలో ఆలయం అన్నవరం ఆలయ నిర్మాణంలో కూడా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావం ఉంది. ఆలయం రథం ఆకారంలో నిర్మించబడింది. ఆలయ నిర్మాణం ద్వారా ఈ విశ్వాన్ని ఒక మహారథంగా భావించి, దాని హృదయభాగంలో పరమాత్మ కొలువై ఉన్నాడనే తత్వాన్ని సూచిస్తారు. ఆలయంలోని చక్రాలు సూర్యుడు, చంద్రుడు మరియు కాలచక్రాన్ని సూచిస్తాయని దేవస్థానం వివరిస్తుంది. అంటే కాలం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది; కానీ ఆ కాలచక్రానికి అంతరాత్మగా పరమాత్మ నిలిచి ఉంటాడనే గొప్ప తాత్త్విక సందేశం ఇందులో ఉంది. 🙏 🌸 స్వామివారి సన్నిధిలో అనంతలక్ష్మీ అమ్మవారు మొదటి అంతస్తులో మధ్యలో శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారు, ఒక వైపు శ్రీ అనంతలక్ష్మీ అమ్మవారు, మరొక వైపు శివుడు కొలువై ఉంటారు. ఇలా వైష్ణవ, శైవ సంప్రదాయాల ఐక్యతను ఈ క్షేత్రం చాటిచెబుతుంది. 🕉️ పంచాయతనం స్వామివారి పీఠం వద్ద ప్రత్యేకమైన శ్రీమత్ త్రిపథ విభూతి వైకుంఠ మహానారాయణ యంత్రం ప్రతిష్ఠించబడింది. అక్కడ పంచాయతన విధానంలో గణపతి, సూర్యనారాయణ స్వామి, బాలా త్రిపురసుందరి, మహేశ్వరస్వామి తదితర దేవతా స్వరూపాలు ఉంటాయి. 🌺 శ్రీరాముడు క్షేత్రపాలకుడు స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీరామాలయం కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా భావించబడతాడు. అదే ప్రాంతంలో వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్ల సన్నిధులు కూడా ఉన్నాయి. 🙏 సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారు? శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. సంపద, విద్య, సంతానం, శ్రేయస్సు, కుటుంబ సౌఖ్యం, వ్యాపారాభివృద్ధి, కష్టాల నుంచి ఉపశమనం, మనోకామనల నెరవేర్పు వంటి వాటి కోసం భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అన్నవరం క్షేత్రంలో స్వామివారు సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక సత్యనారాయణ స్వరూపంగా వెలసి ఉన్నారనే విశ్వాసం వల్ల ఈ వ్రతానికి మరింత ప్రత్యేకత వచ్చింది. 🌿 సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన పురాణ కథ ఒకసారి మహర్షి నారదుడు భూలోకంలోని ప్రజలు అనేక కష్టాలు, బాధలు అనుభవించడం చూసి ఎంతో విచారించాడు. ప్రజలకు కష్టాల నుంచి విముక్తి కలిగించే మార్గం ఏమిటో తెలుసుకోవాలని శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సుఖసంపదలు, శ్రేయస్సు కలగడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మేలు జరుగుతుందని నారదునికి వివరించినట్లు వ్రతకథలో చెప్పబడింది. ఈ వ్రత మహిమను తెలియజేయడానికి పేద బ్రాహ్మణుడు, ఉల్కాముఖ మహారాజు, తుంగధ్వజ మహారాజు, సాధువు అనే వైశ్యుడు, గోపకులు, కాశీకి చెందిన పేద కట్టెలు కొట్టుకునే వ్యక్తి వంటి అనేక భక్తుల కథలు చెప్పబడతాయి. వారు భక్తితో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లు వ్రతకథ వివరిస్తుంది. 🌺 ఈ క్షేత్రం యొక్క అసలైన సందేశం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది — సత్యమే దైవం. సత్యమే ధర్మం. సత్యాన్ని ఆశ్రయించినవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వాన్ని ఒకే స్వామి రూపంలో దర్శింపజేస్తూ, శైవ–వైష్ణవ భేదాలను తొలగించి “దేవుడు ఒక్కడే — రూపాలు అనేకం” అనే ఆధ్యాత్మిక భావాన్ని అన్నవరం క్షేత్రం చాటిచెబుతోంది. 🙏🕉️ 🌺 శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారికి జై 🌺 🙏 సత్యదేవుని కృప సర్వజనులపై ఉండాలని ప్రార్థిద్దాం 🙏 ఓం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః 🙏 🍚🌾 అన్నవరం ప్రసాదం విశిష్టత 🌾🍚 🙏 అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ఈ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకమైనది. 🌾 ఎర్రగోధుమ నూకతో తయారుచేసే ప్రసాదం అన్నవరం ప్రసాదంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. 🍚🌺 🪔 సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం ఈ ప్రసాదాన్ని స్వామివారి అనుగ్రహ ప్రసాదంగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తారు. 🙏 🌸 వ్రతంలో ప్రసాదాన్ని స్వీకరించడం, ఇతర భక్తులతో పంచుకోవడం ద్వారా భక్తి, సత్యం, దానం, ఐక్యత వంటి సద్గుణాలను ఆచరించాలనే ఆధ్యాత్మిక సందేశం లభిస్తుంది. 🕉️ 📍 17.2833° N, 82.4025° E � suparnidevi.blogspot.com కాపీ పేస్ట్: 📍 GPS: 17.2833° N, 82.4025° E 🛕 శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, అన్నవరం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ 🙏🌺 #అన్నవరం #అన్నవరం_సత్యనారాయణస్వామి #శ్రీవీరవెంకటసత్యనారాయణస్వామి #అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి #అన్నవరం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
790 views
1 months ago
#శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మండపం #🙏🌺శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము 👏🌹🚩 #శ్రీ సత్యనారాయణ స్వామి #🕉️శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం🙏 #అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి *పెళ్లయిన వెంటనే* … శ్రీసత్యనారాయణస్వామివ్రతం ఎందుకు చేయమంటారు? తెలుసుకుందాం…🙏🪷 శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ! *పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. *గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు. *కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారనే విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు! ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు. *సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే. ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు, వ్రతాలు మరే మహర్షీ అందించలేదేమో! అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావొచ్చు. *ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విబేధాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలుకూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. *ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి, సకల సంపదలూ సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని, ఇదీ అదీ అననేల, సకల సౌభాగ్యాలూ వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పారు. *పైగా సత్యనారాయణుడు అంటే, కేవలం విష్ణు స్వరూపమే కాదు! ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం. అందుకే శ్రీ సత్యనారాయణ స్వామివారిని… *"మూలతో బ్రహ్మరూపాయ* *మధ్యతశ్చ మహేశ్వరం* *అధతో విష్ణురూపాయ* *త్ర్త్యెక్య రూపాయతేనమః”* అని స్తుతిస్తారు.* *ఇక, వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది. *కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని; అందుకు, ఆ సత్యనారాయణుని ఆశీస్సులు అవసరమని వారితో తొలుత శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపజేస్తారు. *ఇంకా గర్భాదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వశిస్తారు. *అందువలనే, నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు.*✍️.` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* #శ్రీ సత్యన *పెళ్లయిన వెంటనే* … శ్రీసత్యనారాయణస్వామివ్రతం ఎందుకు చేయమంటారు? తెలుసుకుందాం…🙏🪷 శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ! *పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. *గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు. *కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారనే విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు! ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు. *సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే. ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు, వ్రతాలు మరే మహర్షీ అందించలేదేమో! అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావొచ్చు. *ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విబేధాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలుకూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. *ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి, సకల సంపదలూ సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని, ఇదీ అదీ అననేల, సకల సౌభాగ్యాలూ వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పారు. *పైగా సత్యనారాయణుడు అంటే, కేవలం విష్ణు స్వరూపమే కాదు! ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం. అందుకేారిని… *"మూలతో బ్రహ్మరూపాయ* *మధ్యతశ్చ మహేశ్వరం* *అధతో విష్ణురూపాయ* *త్ర్త్యెక్య రూపాయతేనమః”* అని స్తుతిస్తారు.* *ఇక, వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది. *కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని; అందుకు, ఆ సత్యనారాయణుని ఆశీస్సులు అవసరమని వారితో తొలుత శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపజేస్తారు. *ఇంకా గర్భాదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వశిస్తారు. *అందువలనే, నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు.*✍️.` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*