*పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న ధూళిపాళ్ళ*
చేబ్రోలు మండలంలోని శలపాడు, వీరనాయకుని పాలెం, శేకూరు గ్రామాలకు సంబంధించి మీసరగడ్డ అనంతరం రెవెన్యూ పరిధిలో ఇటీవల జరిపిన రీసర్వే కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన లబ్ధిదారులకు శలపాడు గ్రామ పంచాయతీ ఆఫీస్ సెంటర్ నందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న *మన ప్రియతమ నాయకులు పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు*
ఈ సందర్భంగా ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ
👉ఇటీవల రెవెన్యూ శాఖ పారదర్శకంగా పూర్తి స్థాయిలో నిర్వహించిన రీసర్వే ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రూపకల్పన చేసిన "నూతన పట్టాదారు పాస్ బుక్ " పంపిణీ కార్యక్రమాన్ని చేబ్రోలు మండల శలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టటం జరిగింది
👉కార్యక్రమములో మండలములోని శలపాడు, వీరనాయకుని పాలెం, శేకూరు గ్రామాలకు సంబంధించిన భూములకు చెందిన మంది 333 రైతులకు "పట్టాదారు పాసు బుక్" లను పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మైలా వెంకట రామరాజు గారు, ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మీ నారాయణ గారు, గుంటూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి తాటి శంకర్ గారు, వేజండ్ల సొసైటీ చైర్మన్ షేక్ రియాజ్ అలీ గారు, శలపాడు నీటి సంఘం అధ్యక్షుడు కంచర్ల శేషగిరి గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోర్ల నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు,రైతులు ,గ్రామ ప్రజలు పాల్గొనినారు....
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్


