#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్
*తూర్పుగోదావరిలో 18 మంది డిప్యూటీ ఎంపీడీవోలు నియామకం*
తూర్పుగోదావరి జిల్లాలో 18 మంది డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా సచివాలయ పరిపాలనకు సంబంధించి కొత్తగా డిప్యూటీ ఎంపీడీవో (జిఎస్డబ్ల్యూఎస్)లను నియమించారు. గ్రామపంచాయతీలో ఎలాంటి కేసులు లేని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులను, మండల పరిషత్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లకు పదోన్నతి ఇచ్చి డిప్యూటీ ఎంపిడివొలుగా అవకాశం ఇచ్చారు. ఈ 18 మందిలో 12 మంది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు కాగా మరో ఆరుగురు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు.జోన్ 2 పరిధిలో ఉన్న ఈ పద్దెనిమిది మందిని తూర్పుగోదావరి జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.దీంతో వారికి జిల్లా కలెక్టర్ మండలాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
*మండల వారీగా డిప్యూటీ ఎంపీడీవోలు వీరే*
1.గోపాలపురం--ఆర్ వి సత్యనారాయణ
2.రంగంపేట--ఎం శ్రీనివాస్
3.నిడదవోలు-- టి.గోపాలకృష్ణ
4.తాళ్లపూడి-- కేఎస్వివి వీరన్న
5. నల్లజర్ల---కెవివి రాంబాబు
6.కడియం--- ఎస్ శ్యాంప్రసాద్
7. కొవ్వూరు--ఎం ముత్యం
8.గోకవరం.. వి శ్రీరామ్మూర్తి
9.రాజనగరం.. సిహెచ్ దేవదాసు
10.అనపర్తి.. సిహెచ్ శ్రీ శాస్త్రి
11.సీతానగరం--మల్లిడి వెంకటరెడ్డి
12.బిక్కవోలు--వై. మునేశ్వరరావు
13.కోరుకొండ.. గుణ్ణం ప్రసాదరావు
14.దేవరపల్లి.. కాయల వి. సత్యనారాయణ
15.రాజమహేంద్రవరం రూరల్.. దాసరి సూర్యనారాయణ
16.చాగల్లు... పుల్లేటికుర్తి అచ్యుత రామకృష్ణ
17.పెరవలి కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి
18.ఉండ్రాజవరం-- తాళ్లూరి శేనియామకం

