#📙ఆధ్యాత్మిక మాటలు #🛕అయోధ్య రామమందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి 
31-10-2025	ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా"	మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆధ్యాత్మిక, ఆత్మిక గుప్త ముక్తిదళము, మీరు మొత్తం ప్రపంచానికి ముక్తిని ఇవ్వాలి, మీరు మునిగిపోయిన నావలను తీరానికి చేర్చాలి’’
ప్రశ్న:-సంగమములో తండ్రి మొత్తము కల్పమంతటిలోనూ ఉండని ఏ యూనివర్శిటీని తెరుస్తారు?
జవాబు:-రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవడము కోసం చదువుకునే గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీని లేక కాలేజ్ ను సంగమములో తండ్రి మాత్రమే తెరుస్తారు. ఇటువంటి యూనివర్శిటీ మొత్తము కల్పములో ఉండదు. ఈ యూనివర్శిటీలో చదువు చదువుకుని మీరు డబల్ కిరీటధారులుగా, రాజులకే రాజులుగా అవుతారు.
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను మొట్టమొదట బాబా అడుగుతున్నారు, ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ మీకు ఎటువంటి వ్యాపార-వ్యవహారాలు లేవు, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కూడా లేరు. మేము అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు వెళ్తున్నాము అన్న ఆలోచనతో మీరు వస్తారు. ఇలా ఎవరు అంటున్నారు? ఆత్మ శరీరము ద్వారా అంటుంది. పారలౌకిక తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు, ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇలా అనంతమైన తండ్రి వచ్చి నేర్పించడమనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ప్రతి ఒక్కరి నావ మునిగిపోయి ఉంది, ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతగా నావ తీరానికి చేరుతుంది. ఓ నావికుడా, నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కదా. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ పురుషార్థముతో తీరానికి చేరాలి. ఏ విధముగా ఈత నేర్పిస్తే, అది నేర్చుకున్న తర్వాత తమంతట తామే ఈదుతారు. అవన్నీ దైహిక విషయాలు. ఇవి ఆత్మిక విషయాలు. ఆత్మ ఇప్పుడు బురద ఊబిలో చిక్కుకుపోయిందని మీకు తెలుసు. దీని గురించి ఒక జింక ఉదాహరణను కూడా ఇస్తారు. అది నీరు అనుకుని వెళ్తుంది, కానీ అక్కడ బురద ఉంటుంది, అప్పుడు అందులో చిక్కుకుపోతుంది. అప్పుడప్పుడు స్టీమర్లు, కార్లు మొదలైనవి కూడా బురదలో చిక్కుకుపోతాయి, అప్పుడు వాటిని బయటకు తీస్తారు. అలా తీసేవారిని సాల్వేషన్ ఆర్మీ (ముక్తిదళము) అని అంటారు. మీరు ఆత్మిక ముక్తిదళము. అందరూ మాయ యొక్క ఊబిలో చాలా చిక్కుకుని ఉన్నారని మీకు తెలుసు, దీనిని మాయ ఊబి అని అంటారు. దీని నుండి మీరు బయటకు ఎలా రావచ్చు అనేది తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారు కూడా రక్షిస్తారు కానీ అక్కడ మనుష్యులకు మనుష్యుల సహాయము అవసరమవుతుంది. ఇక్కడైతే ఆత్మ వెళ్ళి ఊబిలో చిక్కుకుంది, దీని నుండి మీరు బయటకు ఎలా రావచ్చు అనే మార్గాన్ని తండ్రి తెలియజేస్తారు. అప్పుడు ఇతరులకు కూడా మీరు మార్గాన్ని తెలియజేయవచ్చు. మీ నావ ఈ విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి ఎలా వెళ్ళగలదు అని స్వయానికి మరియు ఇతరులకు మార్గాన్ని తెలియజేయాలి. సత్యయుగాన్ని క్షీర సాగరము అనగా సుఖ సాగరము అని అంటారు. ఇది దుఃఖ సాగరము. రావణుడు దుఃఖ సాగరములో ముంచేస్తాడు. తండ్రి వచ్చి సుఖ సాగరములోకి తీసుకువెళ్తారు.
మిమ్మల్ని ఆత్మిక ముక్తిదళము అని అంటారు. మీరు శ్రీమతము ఆధారముగా అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. ఇద్దరు తండ్రులు ఉన్నారని, ఒకరు హద్దు తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి అని ప్రతి ఒక్కరికీ అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి ఉన్నా కూడా అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కానీ వారి గురించి ఏ మాత్రము తెలియదు. బాబా ఏమీ నింద చేయడము లేదు కానీ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఈ సమయములో మనుష్యమాత్రులందరూ పంచ వికారాల రూపీ ఊబిలో చిక్కుకుని ఉన్న ఆసురీ సాంప్రదాయులుగా ఉన్నారని ఇది కూడా అర్థం చేయించేందుకని మాత్రమే చెప్తారు. దైవీ సాంప్రదాయులు వద్దకు వెళ్ళి ఆసురీ సాంప్రదాయులు నమస్కరిస్తారు ఎందుకంటే దైవీ సాంప్రదాయులు సంపూర్ణ నిర్వికారులు. సన్యాసులకు కూడా నమస్కరిస్తారు, వారు కూడా ఇళ్ళు-వాకిళ్ళు వదిలి వెళ్తారు, పవిత్రముగా ఉంటారు. ఈ సన్యాసులకు మరియు దేవతలకు రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. దేవతలదైతే జన్మ కూడా యోగబలముతో జరుగుతుంది. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు ఇచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవని, ఈశ్వరుడి గురించి సంపూర్ణముగా ఎవ్వరూ తెలుసుకోలేరని అందరూ అంటారు. కేవలం ఈశ్వరుడు లేక భగవంతుడు అని అంటే అంత ప్రేమ అనుభవమవ్వదు. అన్నిటికన్నా మంచి పదము ‘బాప్’ (తండ్రి). మనుష్యులకు అనంతమైన తండ్రి గురించి తెలియదు అంటే అనాథల వలె ఉన్నారు.
మనుష్యులు ఏమంటారు మరియు భగవంతుడు ఏమంటారు అన్న టాపిక్ గురించి మ్యాగజైన్ లో కూడా వచ్చింది. తండ్రి ఏమీ నిందించడం లేదు, వారు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే తండ్రికైతే అందరి గురించి తెలుసు కదా. వీరిలో ఆసురీ గుణాలు ఉన్నాయని, పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారని అర్థం చేయించడము కోసం చెప్తారు. ఇక్కడైతే కొట్లాడే అవసరమే లేదు. వారు కౌరవులు అనగా ఆసురీ సాంప్రదాయులు. ఇది దైవీ సాంప్రదాయము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మనుష్యులు, మనుష్యులకు ముక్తి లేక జీవన్ముక్తి కోసం రాజయోగాన్ని నేర్పించడమనేది జరగదు. ఈ సమయములో తండ్రియే ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు. దేహ-అభిమానానికి, దేహీ-అభిమానానికి మధ్యన ఎంత వ్యత్యాసము ఉందో చూడండి. దేహాభిమానము వలన మీరు పడిపోతూ వచ్చారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. మీకు సత్యయుగములో దైహిక సంబంధాలు ఉండవని కాదు. అక్కడ - నేను ఆత్మను, పరమపిత పరమాత్ముని సంతానాన్ని అన్న జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది, ఇది తర్వాత కనుమరుగైపోతుంది. మీరు మాత్రమే శ్రీమతముపై నడుచుకుని ప్రారబ్ధాన్ని పొందుతారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తారు. ఇటువంటి చదువు ఇంకేదీ ఉండదు. డబల్ కిరీటధారులైన రాజులు సత్యయుగములో ఉంటారు, ఆ తర్వాత సింగిల్ కిరీటధారుల రాజ్యాలు కూడా ఉంటాయి, ఇప్పుడు ఆ రాజ్యాలు లేవు, ప్రజలపై ప్రజల రాజ్యము ఉంది. పిల్లలైన మీరు ఇప్పుడు రాజ్యము కోసం చదువుతున్నారు, దీనిని గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీ అని అంటారు. మీ పేరు కూడా వ్రాసి ఉంది. వారు గీతా పాఠశాల అన్న పేరు పెట్టుకుంటారు కానీ వాస్తవానికి అది చదివించేది ఎవరు? శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడైతే చదివించలేరు. శ్రీకృష్ణుడైతే స్వయమే పాఠశాలలో చదువుకునేందుకు వెళ్తారు. రాకుమార, రాకుమారీలు స్కూల్ కు ఎలా వెళ్తారు, అక్కడి భాషే వేరుగా ఉంటుంది. అలాగని సంస్కృతములో గీతను వినిపించారని కూడా కాదు. ఇక్కడైతే అనేక భాషలు ఉన్నాయి. ఏ రాజు ఉంటే, అతను తన భాషను నడిపిస్తారు. సంస్కృత భాష అనేది రాజులెవ్వరిదీ కాదు. బాబా ఏమీ సంస్కృతాన్ని నేర్పించటము లేదు. తండ్రి అయితే సత్యయుగము కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు.
తండ్రి అంటున్నారు, కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందండి. ఇక్కడ ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇక్కడకు ఎవరు వచ్చినా కూడా వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. కామముపై విజయాన్ని పొందడము ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు. ఇది ముఖ్యమైన వికారము. ఈ హింస ద్వాపరము నుండి కొనసాగుతూ వస్తుంది, దీని ద్వారానే వామ మార్గము ప్రారంభమైంది. దేవతలు వామ మార్గములోకి ఎలా వెళ్తారో చూపించే మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా ఛీ-ఛీ చిత్రాలను తయారుచేసారు. అయితే, వామ మార్గములోకి ఎప్పుడు వెళ్ళారు, ఆ తిథి-తారీఖులైతే లేవు. కామ చితిపై కూర్చోవడముతో నల్లగా అవుతారని ఋజువవుతుంది కానీ నామ-రూపాలైతే మారిపోతాయి కదా. కామ చితిపైకి ఎక్కడముతో ఇనుపయుగము వారిగా అవుతారు. ఇప్పుడైతే పంచ తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి కదా, అందుకే శరీరము కూడా ఆ విధముగా తమోప్రధానముగా అవుతుంది. జన్మించినప్పుడే ఒకరు ఒక విధముగా, మరొకరు మరో విధముగా ఉంటారు. అక్కడైతే పూర్తిగా సుందరమైన శరీరాలు ఉంటాయి. ఇప్పుడు తమోప్రధానముగా ఉన్న కారణముగా శరీరాలు కూడా అదే విధముగా ఉన్నాయి. మనుష్యులు - ఈశ్వరా, ప్రభు మొదలైన రకరకాల పేర్లతో తలచుకుంటారు కానీ పాపం వారికి అసలు తెలియనే తెలియదు. ఓ బాబా, మీరు వచ్చి శాంతిని ఇవ్వండి అని ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడైతే కర్మేంద్రియాలతో పాత్రను అభినయిస్తుంది కావున శాంతి ఎలా లభిస్తుంది. విశ్వములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు శాంతి ఉండేది. కానీ కల్పము ఆయుష్షు లక్షల సంవత్సరాలు అనేటప్పటికి పాపం మనుష్యులు ఎలా అర్థం చేసుకుంటారు. వీరి (దేవతల) రాజ్యము ఉన్నప్పుడు ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేది, ఇతర ఏ ఖండములోనూ ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంది అని అనరు. ఇక్కడ ఆత్మ ఏక రాజ్యము ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు మనము ఏక రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ఆత్మ అయిన మీకు తెలుసు. అక్కడ మొత్తం విశ్వానికి యజమానులుగా మనమే ఉంటాము. తండ్రి మనకు అంతా ఇచ్చేస్తారు. ఎవ్వరూ మన నుండి రాజ్యాన్ని లాక్కోలేరు. మనము మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతాము. విశ్వములో సూక్ష్మవతనము, మూలవతనము ఉండవు. ఈ సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. దీని గురించి రచయిత అయిన తండ్రికి మాత్రమే తెలుసు. అలాగని రచనను రచిస్తారని కాదు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా తయారుచేసేందుకు తండ్రి సంగమములోనే వస్తారు. బాబా దూరదేశము నుండి వచ్చారు. కొత్త ప్రపంచము మన కోసమే తయారవుతుందని మీకు తెలుసు. బాబా ఆత్మలైన మన అలంకరణను చేస్తున్నారు. దానితోపాటు శరీరాల అలంకరణ కూడా జరుగుతుంది. ఆత్మ పవిత్రముగా అయినందుకు మళ్ళీ శరీరము కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. సతోప్రధాన తత్వాలతో శరీరాలు తయారవుతాయి. వీరివి సతోప్రధాన శరీరాలు కదా, అందుకే సహజ సౌందర్యము ఉంటుంది. రిలీజియన్ ఈజ్ మైట్ (ధర్మములో శక్తి ఉంది) అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు శక్తి ఎక్కడ నుండి లభించింది? ఒక్క దేవీ-దేవతల ధర్మము నుండే శక్తి లభిస్తుంది. ఆ దేవతలే మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు, ఇతరులెవ్వరూ విశ్వానికి యజమానులుగా అవ్వరు. మీకు ఎంత శక్తి లభిస్తుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపనను శివబాబా బ్రహ్మా ద్వారా చేస్తారని వ్రాసి కూడా ఉంది. ఈ విషయాలు ప్రపంచములో ఎవ్వరికీ తెలియవు. తండ్రి అంటారు, నేను బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తాను, ఆ తర్వాత వారిని సూర్యవంశీ రాజ్యములోకి తీసుకువస్తాను. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు పాస్ అయి సూర్యవంశములోకి వస్తారు. ఇదంతా జ్ఞానము యొక్క విషయము. కానీ వారు స్థూల బాణాలు, ఆయుధాలు మొదలైనవి చూపించారు. బాణాలు వేయడం కూడా నేర్చుకుంటారు. చిన్న పిల్లలకు కూడా తుపాకీ పేల్చడం నేర్పిస్తారు. మీది యోగ బాణము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. హింస యొక్క విషయమేదీ లేదు. మీ చదువు కూడా గుప్తమైనది. మీరు ఆధ్యాత్మిక, ఆత్మిక ముక్తిదళము. ఆత్మిక సైన్యమెలా ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. మీరు గుప్తమైన ఆధ్యాత్మిక, ఆత్మిక ముక్తిదళము. మీరు మొత్తము ప్రపంచానికి విముక్తిని ఇస్తారు. అందరి నావలు మునిగిపోయి ఉన్నాయి. ఇకపోతే బంగారు లంక ఏదీ లేదు. బంగారు ద్వారక కిందకు వెళ్ళిపోయిందని, అది బయటకు వస్తుందని కాదు. ద్వారకలో కూడా వీరి రాజ్యముండేది కానీ అది సత్యయుగములో ఉండేది. సత్యయుగీ రాజుల డ్రస్ పూర్తిగా వేరుగా ఉంటుంది, త్రేతాయుగములో వారిది వేరుగా ఉంటుంది. వేర్వేరు డ్రస్ లు, వేర్వేరు ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ప్రతి ఒక్క రాజు యొక్క ఆచారాలు, పద్ధతులు ఎవరివి వారివే ఉంటాయి. సత్యయుగము పేరు వింటూనే మనసు సంతోషిస్తుంది. దానిని స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు కానీ మనుష్యులకు ఏమీ తెలియదు. ముఖ్యమైనది ఈ దిల్వాడా మందిరము. ఇది పూర్తిగా మీ స్మృతిచిహ్నమే. మోడల్స్ అయితే సదా చిన్నవిగానే తయారుచేస్తారు కదా. ఇవి పూర్తిగా ఏక్యురేట్ మోడల్స్. శివబాబా కూడా ఉన్నారు, ఆదిదేవ్ కూడా ఉన్నారు, పైన వైకుంఠాన్ని చూపించారు. శివబాబా ఉన్నప్పుడు తప్పకుండా రథము కూడా ఉంటుంది. ఆదిదేవ్ కూర్చుని ఉన్నారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది శివబాబా రథము. మహావీరులే రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఆత్మలో శక్తి ఎలా వస్తుంది, ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అయిన మనము సతోప్రధానముగా ఉన్నప్పుడు పవిత్రముగా ఉండేవారము. శాంతిధామములో, సుఖధామములో తప్పకుండా పవిత్రముగానే ఉంటాము. ఇది ఎంత సహజమైన విషయము అనేది ఇప్పుడు బుద్ధిలోకి వస్తుంది. భారత్ సత్యయుగములో పవిత్రముగా ఉండేది. అక్కడ అపవిత్ర ఆత్మలు ఉండలేవు. ఇంతమంది పతిత ఆత్మలు పైకి ఎలా వెళ్తారు. తప్పకుండా పవిత్రముగా అయ్యే వెళ్తారు. నిప్పు అంటుకుంటుంది, అప్పుడు ఆత్మలందరూ వెళ్ళిపోతారు. ఇకపోతే శరీరాలు ఉండిపోతాయి. ఈ గుర్తులన్నీ కూడా ఉన్నాయి. హోలిక యొక్క అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. మొత్తము ప్రపంచమంతా ఇందులో స్వాహా అవ్వనున్నది. ఇది జ్ఞాన యజ్ఞము. జ్ఞానమనే పదాన్ని తీసేసి వారు రుద్ర యజ్ఞము అని అంటారు. వాస్తవానికి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది బ్రాహ్మణుల ద్వారానే రచింపబడుతుంది. సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు మీరే. ప్రజాపిత బ్రహ్మాకు అయితే అందరూ సంతానమే కదా. బ్రహ్మా ద్వారానే మనుష్య సృష్టి రచింపబడుతుంది. బ్రహ్మానే గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు, వారి వంశవృక్షము ఉంటుంది కదా. ఏ విధముగా వేర్వేరు వంశవృక్షాలు ఉంటాయి కదా. మూలవతనములో ఆత్మల వంశవృక్షము నియమానుసారముగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. శివబాబా, ఆ తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులు, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణులు మొదలైనవారు, ఇదంతా మనుష్యుల వంశవృక్షము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మిక ముక్తిదళముగా అయి స్వయానికి మరియు సర్వులకు సరైన మార్గాన్ని తెలియజేయాలి. మొత్తం ప్రపంచాన్ని విషయ సాగరము నుండి విముక్తి చేసేందుకు తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి.
2. జ్ఞాన-యోగాలతో పవిత్రముగా అయి ఆత్మ యొక్క అలంకరణను చేయాలి, శరీరాలను కాదు. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము యొక్క అలంకరణ స్వతహాగానే జరుగుతుంది.
వరదానము:-దేని నుండైనా పక్కకు తప్పుకునేందుకు బదులుగా ప్రతి క్షణము తండ్రి ఆధారాన్ని అనుభవము చేసే నిశ్చయబుద్ధి విజయీ భవ
విజయీ భవ యొక్క వరదానాన్ని పొందిన ఆత్మ ప్రతి క్షణము స్వయాన్ని ఆధారము కింద ఉన్నట్లుగా అనుభవము చేస్తుంది. వారి మనసులో సంకల్పమాత్రముగా కూడా ఏ ఆధారము లేనట్లుగా లేక ఒంటరిగా ఉన్నట్లుగా అనుభవమవ్వదు. వారికి ఎప్పుడూ ఉదాసీనత లేక అల్పకాలికమైన హద్దులోని వైరాగ్యము రాదు. వారు ఎప్పుడూ ఏ కార్యము నుండైనా, సమస్య నుండైనా లేక వ్యక్తి నుండైనా పక్కకు తప్పుకోరు. వారు ప్రతి కర్మ చేస్తూ, ప్రతీది ఎదుర్కొంటూ, సహయోగులుగా అవుతూ, అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారు.
స్లోగన్:-ఒక్క తండ్రి సాంగత్యములోనే ఉండండి మరియు తండ్రినే మీ కంపానియన్ (సహచరుని)గా చేసుకోండి.
 
అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి
దివ్య బుద్ధి రూపీ విమానము ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరము యొక్క స్థితిలో స్థితులై, అవ్యక్త వతనవాసులుగా అయ్యి విశ్వములోని సర్వాత్మల కొరకు శుభ భావన మరియు శ్రేష్ఠ కామనల సహయోగపు అలను వ్యాపింపజేయండి. యోగ ప్రయోగము ద్వారా దుఃఖిత-అశాంత ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాష్ ను ఇవ్వండి.
"
