#త్రిలోచన గౌరీ వ్రతం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #కార్తీక మాసం
*త్రిలోచన గౌరీ వ్రతం*
*సౌభాగ్యప్రదాయిని త్రిలోచన గౌరీ వ్రతం*
*అక్టోబర్ 24 శుక్రవారం త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా...*
*న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్ |*
*న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ ||*
అర్థం: *కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీలేదు. గంగానదివంటి ఇతర నదేదీలేదు.*
_శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెలరోజులు పర్వదినాలే._
*సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే* *త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే||*
తాత్పర్యం: *మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థాలను సాధించి, శరణు జొచ్చినవారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీ, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.*
సంతాన సౌభాగ్యాలు తమ జీవితానికి సార్ధకతగా స్త్రీలు భావిస్తుంటారు. అలాంటి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించేది, కాపాడేది గౌరీదేవి అని విశ్వసిస్తుంటారు.
ఇక నోములు, వ్రతాల్లోను వాళ్ల ఆరాధన అందుకునేది, అనుగ్రహించేదికూడా ఆ అమ్మవారే. చల్లని మనసున్న ఆ తల్లిని కార్తీక మాసంలో పూజించడం వలన కలిగే ఫలితాలు అనంతాలని ఆధ్యాత్మిక గ్రంథాలుచెబుతున్నాయి. ముఖ్యంగా 'కార్తీక బహుళ తదియ' రోజున గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. తదియ తిథికి అధి దేవత గౌరీదేవి కావడం వలన ఈ రోజున అమ్మవారిని అంకితభావంతో సేవించాలి. కార్తీకమాసంలో తదియ తిథి రోజున త్రిలోచన గౌరి వ్రతం చేసుకుంటారు.
ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది, శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతేకాదు శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడతాయి.
కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జరరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే
ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతేకాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడో కంటితో దహనం చేసినవాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయంకూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమేకాదు పార్వతీదేవిదికూడా. అందుకే ఆమెను త్రిలోచన అనికూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారుకూడాఅంతే దయతో భక్తులను కనికరిస్తుంది.
అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే, అందుకోసమే కార్తీక మాసంలో తదియ నాడు త్రిలోచన గౌరి వ్రతంచేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజచేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులు పాటించాలి.
ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. "మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేప్రయత్నం చేయాలి. "స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఉభయ సంధ్యలలోచన్నిటి స్నానం చేయాలి.
"ధ్యానం" "బుద్దిని శుద్ధి చేస్తుంది. కావున నిరంతరం ఏ పని చేస్తున్న ధ్యాన స్థితిలో ఉంటూ విద్యుత్థర్మాలు నేరవేర్చుకోవాలి. "దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు. పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు. కావున దేనిమీద నాది అని బ్రాంతిచెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సు కొరకు సహాయపడగలగాలి. "ఉపవాసం" ఉండాలి. దీనివలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది. "క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి. తద్వార మానవ సంబంధాలు బలపడతాయి.
నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడాని కిసిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ, మిగలి పోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం.
మనిషిలో "అహం" తగ్గినరోజు "ఆప్యాయత" అంటే అర్థం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనేదేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించగలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది. నిజానికి ఈ పై సూత్రాలుపాటిస్తే ఏ వ్రతంచేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం. ఆస్థితికి రావడానికి కృషిచేయాలి.
సాధారణంగా ఈశ్వరుణ్ణి త్రిలోచనుడు (మూడు కన్నులు కలవాడు) అంటాం. కానీ ఈరోజు గౌరీ దేవిని అంటే అమ్మవారినికూడా త్రిలోచనిగా భావించి అర్చించాలి. శివ పార్వతులకు భేదంలేదు. వారిద్దరూ ఒక్కటే స్వరూపం. అందుకే శాస్త్రం చెబుతోంది. మూడోకన్ను జ్ఞానానికి సంకేతం. అమ్మవారిని ఈరోజున యధాశక్తి ఆరాధించడంవల్ల గౌరీదేవి అనుగ్రహంవల్ల సాధకుడిలో జ్ఞానశక్తి జాగృతమౌతుంది. ఈ రోజున ఉప్పు వేయకుండా చేసిన పులగం నైవేద్యంగా పెట్టి ఆహారంగా తీసుకోవాలి. అలాగే ఉప్పును దానం ఇవ్వాలి. దీనివల్ల విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
ఈరోజు ఉప్పులేని చప్పిడి ఆహారం తీసుకోవడంవల్ల సాధకుడికి జిహ్వచాపల్యం, కోరికలు తగ్గి ఆరోగ్యం కలుగుతుంది. అమ్మలగన్న అమ్మ మనసు అంతకన్నా సున్నితంగా కనిపిస్తుంది. ఆ తల్లి పూజను ఎంత ఘనంగా చేశారనే దానికంటే, ఎంత భక్తి శ్రద్ధలతో చేశారనే దానికే ఆమె ప్రాధాన్యతనిస్తుంది. అలా తనని ఆరాధించినవారికే ఆమె ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సంతాన సౌభాగ్యాలను అనుగ్రహిస్తుంది.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*

