క్రీడాపోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 24.02.2026.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, పరస్పర స్నేహబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. #🟡తెలుగుదేశం పార్టీ


