**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 1**
హనుమాన్ చాలీసా తులసి దాసు గారు లోకానికి అందించిన గొప్ప మంత్ర రాశి దాన్ని అర్దం తో తెలుసుకొనే ప్రయత్నం ఈరోజు నుండి చేద్దాం, మొత్తం 40 శ్లోకాలు ఉంటాయి, నలభై రోజులలో హనుమాన్ జయంతు పర్వదినం కూడా ఉంది కనుక చక్కగా నలభై రోజులలో ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చక్కగా చదువుకుని హనుమ అనుగ్రహం పొందుదాం..
హనుమాన్ చాలీసా అనేది కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక సాధన. గోస్వామి తులసీదాస్ గారు దీనిని ప్రారంభించే ముందు మన మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలో రెండు దోహాల ద్వారా తెలియజేశారు.
**మొదటి దోహా:**
**శ్రీగురు చరణ సరోజ రజ నిజమను ముకుర సుధారి |**
**బరన ఉఁ రఘుబర బిమల జసు జో దాయకు ఫల చారి ||**
**ప్రతిపదార్థం:**
* **శ్రీగురు చరణ సరోజ రజ:** శ్రీ గురువుల యొక్క పాద పద్మముల ధూళితో
* **నిజమను ముకుర సుధారి:** నా యొక్క మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేసుకుని
* **బరన ఉఁ :** వర్ణిస్తున్నాను/కీర్తిస్తున్నాను
* **రఘుబర బిమల జసు:** రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క నిర్మలమైన కీర్తిని
* **జో దాయకు ఫల చారి:** ఏది అయితే నాలుగు విధాలైన ఫలములను (ధర్మ, అర్థ, కామ, మోక్షములు) ప్రసాదిస్తుందో.
**విస్తృత వివరణ:**
1. **మనస్సు - అద్దం (Man-Mukur):** తులసీదాసు గారు మనస్సును అద్దంతో పోల్చారు. అద్దం మీద దుమ్ము ఉంటే మన ముఖం మనకు ఎలా సరిగ్గా కనిపించదో, మనస్సులో అహంకారం, అజ్ఞానం అనే ధూళి ఉంటే దైవత్వం కనిపించదు.
2. **గురు పాద ధూళి (Guru Raja):** ఆ అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి కేవలం గురువు గారి పాద ధూళికే ఉంది. "రజ" అంటే ధూళి. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, గురు సేవ మనసును శుద్ధి చేస్తుంది. గురువు అనుగ్రహం లేనిదే భగవత్ అనుగ్రహం కలగదు. ఎవరు ఈ స్తోత్రం చదివిన ముందు గురువును స్మరించుకోవాలి.
హనుమంతుని గురువుగా భావిస్తే హనుమాన్ చాలీసా గురు స్తోత్రం, గురు కృప లేనిదే భగవత్ కృప లేదు, హనుమను కీర్తించడం అంటే రాముని కీర్తించడమే. హనుమ హృదయం లో ఉన్న రాముని కీర్తించడమే హనుమాన్ చాలీసా. హృదయాన్ని శుద్ధి చేసుకుని రామచంద్ర మూర్తి విమల యశస్సు వివరిస్తూ ఉన్నాను అన్నారు.
3. **చతుర్విధ పురుషార్థాలు:** రాముని కీర్తిని గానం చేయడం వల్ల కేవలం భక్తి మాత్రమే కాదు, జీవితానికి అవసరమైన ధర్మం, సంపద, కోరికల నెరవేర్పు మరియు చివరకు మోక్షం కూడా లభిస్తాయని ఇక్కడ హామీ ఇస్తున్నారు.!
నేను చేసే స్తోత్రం వినవయ్యా!" అని హనుమంతుని పిలిస్తే ఆయన తొందరగా పలుకడు. 'రఘువర బిమల యశు'- "రాముని యశస్సును వర్ణిస్తున్నా” ననగానే వచ్చి కూర్చుంటాడు. అప్పుడు రఘువరునీ వర్ణిస్తాడు. ఆంజనేయునీ స్తోత్రం చేస్తాడు ఇది తులసీదాసుగారి చమత్కారం హనుమంతుని రప్పించాలంటే రాముని స్తుతించాలి. లేకపోతే ఆయన రాడు.రామ కీర్తన చేస్తూ ఉంటే మనకు కావలసినవి అన్ని ఇచ్చేవాడు హనుమ. #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊


