*హర్మూజ్లో టోల్.. ఎంతో తెలుసా..?*
* చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్లో టోల్ వసూల్కు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోల్ను వసూలు చేయనుంది. ఈ మేరకు హర్మూజ్ మేనేజ్మెంట్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్పై గరిష్ఠంగా రూ.18.90 కోట్లు వసూలు చేయనున్నారు. ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఐబీ ఈ విషయాన్ని వెల్లడించింది. #news #sharechat


