త్రిలింగ దేశం:
• త్రిలింగ దేశం అనేది తెలుగు వారు నివసించే ప్రాంతానికి (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) గల ప్రాచీనమైన మరియు పౌరాణికమైన పేరు. మూడు పవిత్రమైన శివలింగాల మధ్య ఉన్న భూభాగం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది.
👉 ఆ మూడు లింగాలు (త్రిలింగాలు):
01. శ్రీశైలం (మల్లికార్జున స్వామి): ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల(రాయలసీమ) జిల్లాలో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
02. కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వర స్వామి): తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది తీరాన ఉంది. ఇక్కడ ఒకే పానవట్టంపై రెండు లింగాలు (శివుడు మరియు యముడు) ఉండటం విశేషం.
03. ద్రాక్షారామం (భీమేశ్వర స్వామి): ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ(ఉభయ గోదావరి లేదా కోస్తాంధ్ర) జిల్లాలో ఉంది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి.
👉🏿 ముఖ్య విశేషాలు: తెలుగు భాషా మూలం: "త్రిలింగ" అనే పదమే కాలక్రమేణా "తెలుగు" లేదా "తెనుగు" గా రూపాంతరం చెందిందని భాషావేత్తల అభిప్రాయం. తెలంగాణ పదం కూడా ఈ త్రిలింగ పదం నుంచే ఆవిర్భవించింది.
👉🏻 పురాణ ప్రశస్తి: బ్రహ్మాండ పురాణం ప్రకారం, శివుడు ఈ మూడు కొండలపై లింగ రూపంలో వెలిసి, ఈ మధ్యలో ఉన్న భూభాగాన్ని తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి.
“అనేక మంది రాజులు, రాజ్యాలు.. ఈ త్రిలింగ దేశ ప్రాంతాన్ని పాలించారు. నేటికీ అనేక శాసనాల్లో త్రిలింగ దేశం అనే పదం కనిపిస్తుంది.”
....
#TrilingaDesam #LordShiva #Devotion #manavoice #devotion # --- #భక్తి #భక్తి #భక్తి


