ShareChat
click to see wallet page
search
*20 వేలు రూపాయలు ఖరీదు చేసే రెండు ఇనుప బీరువాలు బహుకరణ* *20 వేలు రూపాయలు ఖరీదు చేసే రెండు ఇనుప బీరువాలు వితరణ* *పమిడిముక్కల మండలం* *ఐనపూరు గ్రామం* *ఐనపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ దాతలు, గతంలో కూడేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, రిటైర్డ్ కాబడిన కీ.శే. నత్తా సువర్ణ డేవిడ్ రాజు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నత్తా రాజేంద్ర కుమార్ (రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగి) 20 వేలు రూపాయలు ఖరీదు చేసే రెండు ఇనుప బీరువాలు బహుకరించారు. వీరు ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నప్పటికీ గతంలో అనేక సంవత్సరాలు కూడేరు గ్రామంలో నివసించి, ఐనపూరు జడ్పీ హైస్కూల్లో చదువుకున్నారని, గ్రామం మీద అభిమానంతో, పాఠశాల మీద ప్రేమతో, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆలోచన చేసి, పాఠశాలకు అవసరమైన 20 వేలు రూపాయలు ఖరీదు చేసే రెండు ఇనుప బీరువాలను బహుకరించినట్లు దాత నత్తా రాజేంద్రకుమార్ తెలియజేశారు. ఈ రెండు ఇనుప బీరువాలను పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ దూడల శివ నాగ భవాని, కూడేరు, ఐనపూరు గ్రామాల సర్పంచులు కొండా జయలక్ష్మి బసివిరెడ్డి దంపతులు, వీర్ల నాగరాజు మరియు ఎంపీటీసీ సభ్యులు వీర్ల ఆదిశేషు, పాఠశాల దాతల కమిటీ సభ్యులు తమ్మా రాజగోపాల్ రెడ్డి తదితరుల సమక్షంలో పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ దూడల శివనాగభవాని చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 9 నెలల కాలంలోనే పాఠశాలకు షుమారుగా 2 లక్షల 50 వేలు రూపాయలు ఖరీదు చేసే వస్తు సామాగ్రిని, దాతల సహకారంతో పాఠశాలకు సమకూర్చుకోగలిగామని తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు వేణు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు అందరికీ పాఠశాల విద్యా కుటుంబం అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందన నమస్సుమాంజలి తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ దాతల యొక్క దాతృత్వాన్ని కొనియాడారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని, గొప్ప స్థాయికి ఎదిగి, చదువుకున్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకురావడంతో పాటు, సమాజ అభివృద్ధికి కూడా తమ శక్తి మేర కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🙆 Feel Good Status #🙏Thank you😊
😃మంచి మాటలు - ShareChat