బాబా చాలా అద్భుతంగా చెప్పారు. సద్గురువును తెలుసుకో, లేకపోతే ఎందుకొచ్చినట్లు ? పిడకలు ఏరుకోవడానికా?అన్నారు బాబా. భారతదేశంలో పేడతో పిడకలు చేసి వంటచెఱకుగా వాడతారు.
ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలలో పిడకలను కుప్పగా పేర్చి వారి దేహాన్ని దానిపై ఉంచి దహనం చేస్తారు. మనం మనకు ప్రియమైన లక్ష్యాన్ని తెలుసుకొని ఆ అనుభవంలోని ప్రేమాస్వాదనకు మన జీవితాన్ని వినియోగించుకోకపోతే మన ఉచ్ఛ్వాసనిశ్వాసాలు, మన ప్రయత్నాలు,
మన జీవితం ఇలా సమస్తమూ పిడకలు ఏరుకోవడంలా తయారవుతుంది. అప్పుడు మన జీవితమంతా మరణానికి తయారవ్వడమే అవుతుంది. ఎందుకంటే అంతకన్నా మనం మన జీవితానికి ఏ రకమైన అర్ధాన్నీ ఆపాదించుకోలేము. నీవు విసుగుతో, వెలితితో జీవితాన్ని ఆస్వాదించలేకపోతావు. దానికి ఏమైనా అర్థమంటూ ఉంటుందా?
ఎప్పుడైతే నీవు, నీకు ప్రియమైన లక్ష్యాన్ని సద్గురువును కనుగొంటావో, ఇక జీవితం ఎంతమాత్రం మరణానికి తయారవడంలా ఉండదు. ఇంకా దానిని ప్రేమను అనుభవించడానికి ఒక జీవితం సరిపోదు.
అయినా ఇక్కడ నువ్వెందుకు జీవిస్తున్నట్లు? సద్గురువు యొక్క ప్రేమననుభవించడానికి. అప్పుడు నీ జీవితానికి ఓ అర్ధం ఉంది, ఓ కారణం ఉంది. అప్పుడు ప్రతి ఉచ్చ్వాసనిశ్వాసం ఓ ప్రేమానుభవం లేక ఆ ప్రేమకు వ్యక్తీకరణగా మారుతుంది.
ప్రతి ఉచ్చ్వాసంలో ప్రేమను అనుభవిస్తాము. మన ప్రతి నిశ్వాసంలో ప్రేమను వ్యక్తీకరిస్తాము. నువ్వు ఏది అనుభూతి చెందుతావో దానినే వ్యక్తీకరిస్తావు.... నువ్వు ఎంత ఎక్కువగా వ్యక్తీకరిస్తావో అంత ఎక్కువ ప్రేమ అనుభవం పొందుతావు.
ఓం సాయిరాం #🙆 Feel Good Status #♥ప్రేమతో శుభోదయం🌄 #🕉 ఓం సాయిరామ్😇 #🎶భక్తి పాటలు🔱 #🙏🏼షిరిడి సాయి బాబా


