ShareChat
click to see wallet page
search
GOOD MORNING 1.అభివృద్ధి ముగుసులో రియల్ ఎస్టేట్ వ్యాపారం 2.యాద‌గిరికి పోటెత్తిన భ‌క్తులు.. 3.కొండ‌గ‌ట్టుకు బండి పాద‌యాత్ర‌ తాజా వార్తల కోసం చదవండి మీ బెస్ట్​ వాయిస్​ దినపత్రికలో... https://epaper.bestvoicenews.com/view/67/tc-news-daily-epaper #మన మీడియా.. 🤠 #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #తెలంగాణా పాలిటిక్స్
మన మీడియా.. 🤠 - 15.03.2026 ఆదివారం www.bestvoicenews.com bestvoice బెస్ట్ వాయిస్ సంపుటి : 10 సంచిక : 272 వెల : రూ 1 / - అభివృద్ది వరంగల్ ముగుసులో రియల్ ఎస్టేట్ వ్యాపారం • బీఆర్ఎస్ హయాంలోనే సుందరీకరణకు ప్లాన్ రూ .16 వేల కోట్లతోనే ప్రణాళికలు వేసినం • మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు పేదల ఇండ్లు కూలగొడతామంటూ ఊరుకోం • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ • మూసీ బాధితులతో పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్ బెస్ట్ వాయిస్ , స్టేట్ బ్యూరో : మూసీ సుందరీకరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ను వీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తూర్పారబట్టారు . మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో సీఎం తీరు మింగ మెతుకు లేదు కానీ .. మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్లు ఉందని కేటీఆర్ విమర్శిం చారు . నిన్న సీఎం ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా మూసీ బాధితులకు ఉపశమనం కలిగించే వార్త ఏదైనా చెబుతారేమో అని ఆశించాం . కానీ ఆ ప్రస్తావనే లేదు . నా వద్ద బుడ్డ పైస లేదు . నన్ను కోస్తే కూడా రూపాయి రాదు .. నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమో అని భయపడుతున్నారు . రిటైర్డ్ ఉద్యోగులకు , రైతులకు రైతుబంధు ఇచ్చేందుకు డబ్బుల్లేవు . ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు .. కానీ ఇప్పుడు మూసీ చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి విచిత్రంగా మాట్లాడుతున్నాడు . వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలకు డబ్బుల్లేవు . కానీ మూసీని లక్షన్నర కోట్లతో సుందరీకరించడానికి డబ్బులు వస్తాయట . అందాల పోటీలకు రూ . 200 కోట్లు ఉంటాయి కానీ హామీల అమలుకు డబ్బుల్లేవు అని సీఎం అంటున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు . కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు . కేసీఆర్ నిర్మాణాత్మకమైన ప్రజెంటేషన్ ఇస్తే .. రేవంత్ రెడ్డి విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చారు . ఈ రెండున్నరేండ్లలో హైదరాబాద్లో తెలుగు దినపత్రిక ఎడిటర్ : కె.మోహన్రావు BRS కానీ ఓఆర్ఆర్ లోపల కానీ ప్రభుత్వం తరపున ఒక కొత్త ఇల్లు , ఫ్లై ఓవర్ , బిల్డింగ్ నిర్మించారా .. ? ఒక్క మంచి పని చేశావా .. ? కానీ హైదరాబాద్లో పాటు జిల్లాల్లో వందల , వేల ఇండ్లు కూలగొట్టాడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ నిప్పులు చెరిగారు . సీఎం రేవంత్ రెడ్డి ఫైవ్ స్టార్ హోటల్లో బాధితులు లేకుండా సూట్లు బూట్లు వేసు కున్న వారి మధ్యలో లక్షన్నర కోట్లు ఎలా ఖర్చు పెట్టాలో పీపీటీ ఇచ్చారు . ఆస్తులు కోల్పోతున్నాం , భూములు , ఇండ్లు పోతాయి . మా కొంప కొల్లేరు చేసి మూసీ సుందరీకరణ చేస్తాడంటా అని ఆర్తనాదాలు చేస్తున్న వారి మధ్యలో పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని కార్యక్రమం ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు . యాదగిరికి పోటెత్తిన భక్తులు .. ఉచిత దర్శనానికి 2 గంటలు ' • ప్రత్యేక దర్శనానికీ గంట సమయం • వరుస సెలవుల పథ్యంలో భక్తుల సందడి • ఆర్జిత , నిత్య పూజలతో మొక్కలు బెస్ట్ వాయిస్ , స్టేట్ బ్యూరో : వరుసగా రెండు , మూడు రోజులు సెలవులు వచ్చిందంటే చాలు .. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తుతు న్నది . రెండో శనివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తర లివచ్చారు . స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి రెండు గంటలు , ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పట్టింది . ఆర్జిత సేవలు , నిత్య పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు . నేడు ఆదివారం కూడా కావడం భక్తుల రద్దీ కొనసాగనున్నది . ఎక్కడా ఇబ్బందులు తలె త్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు . ఎండాకాలం కావడంతో భక్తులకు తాగునీటి వసతిని మెరుగుపరిచా రు . పిల్లలు , వృద్ధులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు . పేజీ 05 | కొండగట్టుకు | బండి పాదయాత్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర చేశారు . కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు మహా పాదయాత్ర చేపట్టారు . స్థానిక ప్రజాప్రతినిధులు , 10 వేల మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుని అంజన్నకు మొక్కు చెల్లించారు . కరీంనగర్ మేయర్ పీఠం భాజపా గెలుచుకుంటే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కాలినడకన కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటానని బండి ప్రకటించారు . ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు , 10 వేల మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు . ఈ పాదయాత్రకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు . కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోన్ రావు పేటలో పాదయాత్రను చిత్రీకరించేందుకు కార్యకర్తలు డ్రోన్ ఎగరేశారు . ఈ క్రమంలో అది పక్కనే చెట్టుకున్న తేనెతుట్టెను తాకింది . దీంతో ఒక్కసారిగా కొందరు కార్యకర్తలపై అవి దాడి చేశాయి . ఈ ప్రమాదంలో గాయపడిన కార్యకర్తలకు బండి సంజయ్ వైద్యం చేయించారు . కౌడగాని మోహన్రావు -ఎడిటర్ 99633 34550 - ShareChat