ShareChat
click to see wallet page
search
#గుడికోట #జగిత్యాల జిల్లా తెలంగాణలోని ఏకైక పంచముఖ శివలింగ ఆలయం గుడికోట, రాయికల్ గ్రామం, జగిత్యాల జిల్లా. ..... • తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో రాయికల్ గ్రామంలో గుడికోట అని ఓ ఆలయం ఉంది. • దీనిని కాకతీయుల కాలంలో(సా.శ 1305) నిర్మించారు. ఒక్కప్పుడు ఇక్కడ కోట ఉండడంతో ఈ ఆలయానికి గుడికోట అని పేరు వచ్చింది. • 24 అడుగుల చతురస్ర ఆకారంలో రంగ మంటపం, 8 అడుగుల చతురస్ర ఆకారంలో గర్భగుడులు, అర్ధమంటపాలు లాంటివి ఈ ఆలయం లో ఉన్నాయి. • మూడు గోపురాలు ఉండగా.. ఈ ఆలయానికి శ్రీ చెన్నకేశవనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ దేవాలయం అని పేరుంది. • ఈ ఆలయం రాయికల్ పెద్ద చెరువుకు తూర్పున చాళుక్యుల శిల్పకళా రీతిలో నిర్మించారు. ఇక ఇక్కడి పంచముఖ లింగం తెలంగాణలోని ఏకైక పంచముఖ లింగంగా పేరుగాంచింది. • పడమటి గర్భగుడిలో పంచముఖ లింగం, ఉత్తర గర్భగుడిలో కేశవనాథుడు, తూర్పు గుడిలో సూర్యనారాయణ స్వామి విగ్రహాలు ఉంటాయి. • ఈ ఆలయం పరిసరాల్లో నంది విగ్రహం, నవ గ్రహ విగ్రహం, వినాయక, హనుమాన్, తదితర విగ్రహాలు ఉన్నాయి. పరమేశ్వరుడు విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. • ఈ ఆలయం మొత్తం అలంపూర్, మహానంది, సత్యవోలు ఆలయాల పోలి ఉంటుంది. తెలంగాణ రక్షిత కట్టడాల్లో ఈ ఆలయం ఒకటి. • ఆలయం బయట కొన్ని శాసనాలు, వాటి వివరాలు ఉన్నాయి. ధ్వంసమైన కొన్ని విగ్రహ మూర్తులు ఉన్నారు. • ఈ ఆలయాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్ర 1304లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇది త్రికూట ఆలయంగాను చెప్పవచ్చు. .....
గుడికోట - ShareChat
01:44