ShareChat
click to see wallet page
search
పటేల్‌ నుంచి గాంధీ విగ్రహం దాకా విమర్శలు -ప్రజాధనం వృథా, అవినీతి ఆరోపణలు.. నిర్వాసితులవుతున్న ప్రజలు -విగ్రహాలు.. వివాదాలు.. కలం 360 డిగ్రీస్ kalamdaily.com/statue-politic… #StatuePolitics #GandhiSarovar #StatueofUnity #KalamPaper #Kalam360Degrees #news
news - 103 కలల 360 ) ప్రజల గళం .... స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రాష్ట్రం గుజరాత్ , విగ్రహం : సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎత్తు : 597 అడుగులు ఖర్చు : రూ .2,989 కోట్లు SINGLE TOPIC శనివారం 14-03-2026 kalamdaily.com Follow on : Kalamtelugu fX ©© గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో 597 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు . ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం . 2014 అక్టోబర్ పనులు ప్రారంభించగా , 2018 అక్టోబర్ 31 న ప్రధాని మోదీ ఓపెన్ చేశారు . దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు ఓఎన్ జీసీ , ఐఎన్ ఎల్ , బీపీసీఎల్ , హెచ్ పీసీఎల్ లాంటి పీఎస్ యూల నుంచి విరాళాలు వచ్చాయి . వివాదం : • పటేల్ విగ్రహానికి చేసిన ఖర్చుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది . ఈ ఖర్చుతో 2 బటీలు గానీ , 5 జఐఎం క్యాంపస్లు గానీ నిర్మించొచ్చని మేధావులు విమర్శించారు . • ఈ ప్రాజెక్టు కింద సర్మదా జిల్లాలోని 72 గ్రామాల గిరిజనులు భూములు కోల్పోయారు . సుమారు 12 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది . దీంతో 20 కి పైగా గ్రామాల ఆదివాసీలు నిర్వాసితులయ్యారు . దాదాపు 185 కుటుంబాలను వేరే చోటుకు తరలించాల్సి వచ్చింది . • 32 గ్రామాల గిరిజనులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు . మిగిలిన వారికి సరైన పునరావాసం కల్పించలేదు . • ఇక్కడ పర్యాటక అభివృద్ధి పేరుతో రోడ్ల విస్తరలు , హోటళ్ల నిర్మాణం వంటి వాటితో స్థానిక గిరిజనులు పొలాలు , షాపులు కోల్పోయారు . తద్వారా వాళ్ల జీవనోపాధి పోయింది . మెమోరియల్ స్కామ్ ఉత్తరప్రదేశ్ లో బీఎస్సీ చీఫ్ మాయావతి హయాంలో ( 2007-12 ) లక్నో నోయిడా ప్రాంతాల్లో మెమోరియల్ పార్క్ లు నిర్మించారు . వీటిల్లో అంబేద్కర్ , కాన్షీరామ్ లాంటి దళిత నేతల విగ్రహాలు ఏర్పాటు చేశారు . అలాగే కొన్ని ప్రాంతాల్లో బీఎస్సీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగు విగ్రహాలతో పాటు మాయావతి విగ్రహాలను కూడా నిర్మించారు . వివాదం : మెమోరియల్ పార్కులు , విగ్రహాల ఏర్పాటుకు మొత్తం దాదాపు రూ .4 వేల కోట్లు కేటాయించినట్టు రికార్డులు ఉండగా , అందులో రూ .1,400 కోట్ల దాకా అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి . ఇది ' మెమోరియల్ స్కామ్'గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది . విచారణ : 2012 లో అధికారంలోకి వచ్చిన ఎస్పీ సర్కార్ .. ఈ స్కామ్ పై విచారణకు ఆదేశించింది . లోకాయుక్త జస్టిస్ ఎనో మెహ్రాత్రా విచారణ చేపట్టి .. రూ .1,400 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తేల్చారు , మంత్రులు , అధికారులు , కాంట్రాక్టర్లు సహా 199 మందిని నిందితులుగా గుర్తించారు . ఈ నివేదిక ఆధారంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టింది . ఈ క్రమంలో కొంతమందిని అరెస్టు చేసింది . మాయావతికి క్లీన్ చిట్ : విగ్రహాల ఏర్పాటుకు ప్రదర్వినియోగం చేశారని మాయాపతిపై 2009 లోనే సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ అయింది . దీనిపై విచారణ చేపట్టిన కోర్టు .. 2019 లో కీలక కామెంట్లు చేసింది . ఆ డబ్బులను మాయాపతి తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది . అయితే 2025 జనవరి 15 న పిల్ను కొట్టేస్తూ మాయావతికి క్లీన్ చిట్ ఇచ్చింది . ఇది చాలా పాతది అని , విగ్రహాలను తొలగిస్తే మళ్లీ అదనంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని , ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయని పేర్కొంటూ కేసును కొట్టివేసింది . - ShareChat