*అశ్వారావుపేటలో ఎకో పార్క్ నిర్మాణానికి నిధులు కోరిన ఎమ్మెల్యే జారె*
20.03.2026 – శుక్రవారం
హైదరాబాద్లో రాష్ట్ర *పర్యావరణ పరిరక్షణ, అటవీ అభివృద్ధి మరియు సాంకేతిక శాఖల మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు* మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల నూతన మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతున్న అశ్వారావుపేటలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన ఎకో పార్క్ నిర్మాణం అత్యవసరమని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎకో పార్క్ నిర్మాణం కోసం తగిన నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రాంత అభివృద్ధి, పర్యావరణ సమతౌల్యం కోసం ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. #కాంగ్రెస్ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు


