కప్ లు గెలిచినప్పుడు పొగరుగా కప్ లు మీద కాళ్లు పెట్టారు కదా, పాపం ఆస్ట్రేలియా 🤔🤔🤔🤔
జింబాబ్వే చేతిలో మా పరువు...ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలనం !
ఒకప్పుడు ప్రపంచ దేశాలను గడ గడ లాడించిన ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిపోతున్న ఆస్ట్రేలియా, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఈ మేరకు తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ( MITCHELL MARSH ) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తమ భవిష్యత్తు జింబాబ్వే ( Zimbabwe ) చేతిలో ఉందని.. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ నుంచి తమ జట్టు ఓడిపోతే ఘోర అవమానాన్ని ఎదుర్కొంటుందని ఎమోషనల్ అయ్యారు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్.
శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య కీలక మ్యాచ్ జరిగింది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇక ఇది హోమ్ గ్రౌండ్ కావడంతో శ్రీలంక రెచ్చిపోయి ఆడింది. దానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది శ్రీలంక. ఈ విజయంతో సూపర్ 8 నాకౌట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియా మాత్రం గడ్డు పరిస్థితిలోకి వెళ్ళింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లు ఆడి, 181 పరుగుల వద్ద కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ 56 పరుగులు సాధించగా కెప్టెన్ మిచెల్ మార్ష్ 54 పరుగులతో ఇరగదీశారు. ఈ ఇద్దరు మినహా ఎవరు కూడా ఆస్ట్రేలియాలో రాణించలేదు. దీంతో 181 పరుగుల వద్ద ఆగిపోయింది ఆస్ట్రేలియా. అయితే ఈ లక్ష్యాన్ని శ్రీలంక టీం అత్యంత వేగంగా ఛేదించింది. 18 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి కొట్టేసింది. ఇందులో నిస్సాంక సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 52 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా ఓడిపోయి శ్రీలంక విజయం సాధించింది.
శ్రీలంక చేతిలో ఓటమిపై మిచెల్ మార్ష్ కామెంట్స్
సోమవారం జరిగిన శ్రీలంక మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమిపై స్పందించారు కెప్టెన్ మిచెల్ మార్ష్. అన్ని విభాగాల్లో శ్రీలంక అద్భుతంగా రాణించి.. ఇరగదీసిందన్నారు. కానీ తమ జట్టు మాత్రం దారుణంగా విఫలమైందని తప్పు ఒప్పుకున్నారు మిచెల్ మార్ష్. ఈ ఓటమి తమ జట్టుకు అవమానకరం అంటూ వ్యాఖ్యానించారు. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోవడం దారుణం అన్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు... మా పరువు మొత్తం జింబాబ్వే చేతిలో ఉందని వెల్లడించారు. వాళ్లు ప్రతి మ్యాచ్ లో ఓడిపోతేనే తమకు లాభం జరుగుతుందన్నారు. ఒకవేళ జింబాబ్వే, ఐర్లాండ్ పై విజయం సాధిస్తే.. తమ జట్టు ఎలిమినేట్ కావాల్సి వస్తుందని పేర్కొన్నారు మిచెల్ మార్ష్. దీనికి కూడా అభిమానుల సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. #🏏క్రికెట్ 🏏


