
DK Times Telugu on Instagram: "Hyderabad నగరంలోని నిజాంపేట్ సర్కిల్ పరిధి Pragathi Nagar లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. KGR కన్వెన్షన్ సమీపంలో నిన్న రాత్రి సుమారు 10 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు మంటలు ఎగసిపడ్డాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, సుమారు 40 ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. చెక్క సామాగ్రి, ఫోమ్, ప్లైవుడ్ వంటి అధికంగా దహన పదార్థాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పలు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అనుమానం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని అడిషనల్ డీజీపీ సుదర్శన్ గారు వెల్లడించారు. 👉 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.#bachupally #pragathinagar #pragathinagarhyderabad #nizampet #fireaccident #holi"

