💥మన భారతదేశంలో 16వ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది.! మారుతున్న సామాజిక జీవనశైలిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఆధునిక సమాజంలో పెరుగుతున్న 'లివింగ్ రిలేషన్షిప్' (సహజీవనం) జంటలను కూడా ఇకపై ఒకే 'కుటుంబం'గా గుర్తించాలని నిర్ణయించింది. 2011 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న ఈ సర్వేలో, 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేశారు. రెండు దశల్లో సాగే ఈ ప్రక్రియలో, తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' సదుపాయాన్ని కూడా కల్పించారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి గృహ వివరాల సేకరణ చేపట్టనున్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. సంక్షేమ పథకాల రూపకల్పనకు, సామాజిక మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ గణన కీలక పాత్ర పోషించనుంది.!👌🏻🇮🇳
#India❤️🇮🇳
#AndhraPradesh❤️🙏🏻
#JanaGanana❤️🙏🏻
#LiveInRelationship❤️🙏🏻
#RajaBabuGarikina❤️🇮🇳 #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ #❤I love my India❤


