షిరిడీలో సాయబాబా సమాధి మందిరం ,
భగవంతుడు తన భక్తులను ఉద్ధరించటానికి
ఒక సమర్థ సద్గురు రూపంలో ,చిరిగిపోయిన కఫనీ ,మాసిపోయినగడ్డంతో ,నిరాడంబరంగా ,నిరహంకారంగా 60 ఏళ్లు ,షిర్డి నేలపై నడయాడిన ఒక మహాత్ముని సన్నిధి .అదే ఈనాడు లక్షలాది భక్తుల పెన్నిధి .అదే బాబా సమాధి .అదే ఒక మందిరమైనది .
అది మమూలుగా సాధారణ జీవితం గడపి చనిపోయేవాళ్లను పాతిపెట్టి పైన కట్టిన సమాధి కాదు .అది ప్రాణంతో సజీవంగా ఉన్న సమాధి .
ఎన్నో బాధలతో ,భరించలేని దుఃఖంతో ఉన్నవాళ్లు వెళ్లి ఆ సమాధిముందు ,నిలబడి ఆర్తితో ప్రార్ధిస్తే ,
మన మనసులో ఉన్నవన్నీ విన్నవించుకొంటే ,
ఆ మహిమాన్వితమైన సమాధి మన ప్రార్ధనలకు ,
విన్నపాలకు సమాధానమిస్తుంది.
ఇది సత్యం , సత్యం ,సత్యం .ఇది ఎంతోమంది భక్తుల ప్రత్యక్ష అనుభవం .ఈ సత్యాన్ని బాబాయే తన సమాధి చెందక పూర్వము చెప్పారు .
బాబా శరీర త్యాగం చేయడానికి కొద్ది రొజులముందు ,తనను దర్శించడానికి వచ్చిన భక్తులతో ఇలా చెప్పారు "నా సమాధినుంచే నేను సర్వ కార్యాలూ నిర్వహిస్తాను .నా మానుష శరీరం సమాధి నుంచే మాట్లాడతాను .
నా భక్తుల రక్షణ నా సమాధి నుంచే వస్తుంది ."దీనిని బట్టి మనకు తెలుస్తుంది కదా !శ్రీ సాయి సమాధి కేవలం రాతి సమాధి కాదనీ ,దాని లొపల ఉన్నది సాయి పార్ధీవ శరీరం కాదనీ ,అది స్వయంగా సాయినాధుల శక్తేనని గ్రహించాలి
నేటికి సాయి సమాధి చెంది వంద సంవత్సారాలు
దాటిపోయింది .షిరిడీలో సమాధి రూపంలో నున్న
విగ్రహ రూపములోనున్న, ఆయన మహత్తర శక్తి
ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది .
ఇతర దేశాలలో వేలాదిమంది సాయిభక్తులు ,వందలు. పైగా ప్రతీ దేశములో సాయి మందిరాలు వెలిసాయి ,వెలుస్తున్నాయి .
ఇది ఖచ్చితంగా సాయి యుగం .ఒక విశేషమేమిటంటే ఆ దివ్య శక్తి ఒక ప్రభంజనంగా మారి ,ఒక అభయ హస్తంగా మారిఆర్తులను ,ఆపన్నులను విశ్వవ్యాప్తంగా ఆదుకొంటున్నది .కారణం ఇప్పటికీ ఆయన సమాధి రూపంలో ఇంకా ఉన్నారు కనుక . #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా


