BRS.Yugendar
*దేవాదుల రిజర్వాయర్ నుండి నీటి విడుదల మూడు రోజుల ముచ్చటే.*
*చుద్దామన్న కాలువలకు చుక్క నీరు రాకపాయే. ఇంకా సాగు పంటలకు నీళ్లు ఎలా?.*
*రైతు కున్సోతు వెంకన్న 16 బోర్లు వేసిన చుక్క నీరు రాలేదు*
*వెంకన్నను అనే రైతును ప్రభుత్వం ఆదుకోవాలి.*
*ఎండిపోయిన పంటకు ఎకరాకు 30వెలు నష్ట పరిహారం అందించాలి.*
*కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.*
*రేవంత్ రెడ్డి రైతులకు సాగునీరు ఇస్తే రైతు బంధు, కరెంట్, ఎరువులు, వారి కోనాల్సి వస్తుంది అని సాగునీరు ఇవ్వడం లేదు.*
*సింగరాజుపల్లి గ్రామంలో ధర్నా చేపట్టిన ఎర్రబెల్లి అరెస్ట్, పోలీస్ స్టేషన్ తరలింపు.*
*పోలీసులకు, కార్యకర్తలు మధ్య తోపులాటలో ఎర్రబెల్లి తలకి గాయం.*
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా నుండి బంజార గ్రామం వరకు నవాబుపేట రిజర్వాయర్ నుండి దేవరుప్పుల మండలానికి వచ్చే కాలువను సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాదయాత్ర చేస్తున్న క్రమంలో పక్కన ఉన్న వరి పొలాలను పరిశీలించారు రైతులను బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరాజుపల్లి గ్రామంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న ఎర్రబెల్లి ని పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులకు బిఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాటలో ఎర్రబెల్లి తలకు గాయం అవ్వడం జరిగింది అయినా కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి నవాబుపేట రిజర్వాయర్ వరకు సాగు నీరు విడుదల చేశామని కొందరు నాయకులు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నేను ఈ సందర్భంగా వారికి చెప్తున్నాను మీరు నీరు విడుదల చేస్తే మీరు చెప్పిన 57 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందా అని ప్రశ్నించారు. అంగు ఆర్భాటాలు తప్ప రైతులకు చేసిన మేలు ఎంటో చెప్పాలని డిమాండ్. మీరు నిజంగా నవాబుపేట రిజర్వాయర్ కు నీటిని విడుదల చేస్తే ఆ కాలువ ద్వారా వచ్చే నీరు ఎక్కడికి పోయాయి. దేవరుప్పుల మండలంలో ఏ చెరువు నిండాయే చెప్పాలన్నారు. నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే కాలువ నీరు పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కోడకండ్ల మండలాలకు నీరు వచ్చే వరకు కోట్లాడాలి అన్నారు. దేవాదుల రిజర్వాయర్ లో పుష్కలంగా నీళ్లు వాడుకొవడం లేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి అవినీతి చేయడం ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదన్నారు, కాళేశ్వరం కూలిది, రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని అబద్ధాలు చెప్పి గద్దె ను ఎక్కి ఇప్పుడు రైతులను రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు ఏండ్లలోనే రాష్ట్రాన్ని కూని చేసిందని రైతులకు రావాల్సిన రైతు బంధు, 24 గంటల కరెంట్, ఎరువుల సరఫరా, రైతు భీమా ప్రిమియం చెల్లించకుండా రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలు తిట్టడమే కాకుండా వల్ల పార్టీకి చెందిన నాయకులే చెన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఒక మంత్రి కూతుర్లే తీరుతున్నారని అన్నారు. అలాగే కల్యాణ లక్ష్మి - షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలను ప్రజలకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాలువ వెంబడి పాదయాత్ర చేస్తున్న క్రమంలో ధరావత్ తండాకు చెందిన కున్సోతు వెంకన్న బోరు వేస్తున్న క్రమంలో అతని దగ్గరకు వెళ్లి అడిగి తెలుసుకున్న క్రమంలో వెంకన్న అనే రైతు ఇప్పటి వరకు తాను 16 బోర్లు వేయగా ఒక్కటి కూడా పడలేదు. ఈ రోజు కూడా బోరు వేస్తే అది కూడా ఫెయిల్ అయ్యింది, 4 ఎకరాల పంట వేస్తే మొత్తం ఎండిపోయింది నాకు చావు తప్ప వేరే మార్గం లేదని ఎర్రబెల్లికి చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడిచాడు, రైతు వెంకన్న కు దైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఎకరాకు 30 వేల రూపాయలు నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించేవరుకు మా నిరసనలు అపేది లేదని తెలిపారు.
ఈ కార్యక్రమం దేవరుప్పుల, కోడకండ్ల, గుండాల మండలాల రైతులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱