#✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #😇My Status #🌅శుభోదయం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేది ... 28 - 3 - 2026,
వారం ... స్థిర వాసరే (శని వారము),
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిధి : దశమి ఉ 10.35 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం : పుష్యమి సా 4.33 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: సుకర్మం రా 9.44 వరకు
తదుపరి ధృతి
కరణం : గరజి ఉ 10.35 వరకు
వణిజ రా 9.45 వరకు
వర్జ్యం : తె 4.55 నుండి
దుర్ముహూర్తం : ఉ 6.01 - 7.37 వరకు
అమృతకాలం : ఉ 10.27 - 11.59 వరకు
రాహుకాలం : ఉ 9.00 - 10.30 వరకు
యమగండం : మ 1.30 - 3.00 వరకు
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 6.01
సూర్యాస్తమయం:6.08
*నేటి విశేషం*
ధర్మరాజ దశమి,
పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణం
*నేటి మాట*
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః
గురుచరిత్ర - 56
అంబిక శ్రీపాదుల వారి వచనములు విని సంతుష్టియై,
ఆ ద్విజాంగణ శ్రీగురు చరణములకు నమస్కరించి,
స్వామీ! చిత్రమైన, నవీనమైన కథను చెప్పితిరి.
ప్రదోషమందు నందీశ్వరార్చన చూసినందుననే కృష్ణుని పుత్రునిగా పొందగలిగిన గోపిక జన్మ ధన్యము.
అట్టి శివపూజా విశేషము నాకు కూడా తెలియజేయమని వేడుకున్నది.
శ్రీపాదుల వారు, ఈ కథ స్కాందపురాణమున ఉన్న కథయే.
ఉజ్జయిని అను పేరుగల సుందర నగరి కలదు.
అందు చిత్రసేనుడు అను రాజు అతి ధార్మికుడై ఉండెను.
వానికి మణిభద్రుడు అను మిత్రుడు ఉండేవాడు.
ఆ మిత్రుడు ఈశ్వర భక్తి సంపన్నుడు.
ఈశ్వర పూజా పరాయణుడు.
శివుని ప్రసన్నుని చేసుకొనగా వానికి ఈశ్వరుడు చింతామణి ని ఇచ్చినాడు.
ఆ మణి ధరణీతలమున కోటి సూర్య ప్రభలతో వెలుగుచుండెను.
మణిభద్రుడు తన కంఠము నందు ఆ మణిని ఎల్లప్పుడూ ధరించి ఉండేవాడు.
ఆ మణి యొక్క తేజస్సు తాకిన లోహము సద్యోవిద్యోతితాత్మకమై కాంచనము అయ్యేది.
ఆ మణి స్మరణము వలన సంకల్పితమైన వస్తువు లభించును.
ఆ మణి ఖ్యాతి విని అనేక మంది రాజులు వచ్చి చూసినారు.
కొందరు స్నేహంతో, మరికొందరు కుతూహలంతో, ఇంకొందరు బలాత్కారంగా, మరికొందరు మూల్యం ఇచ్చి రాజు ధరించిన మణి చూసి వెళ్ళిరి.
ఏ విధముగా అయినా మాకు ఆ మణిని ఇమ్మని కొందరు రాజులు దూతలను పంపించినారు.
మరికొంతమంది యుద్ధమునకు వచ్చినారు.
ఈ విధముగా ఉజ్జయిని లో రాజులు అందరూ చేరి, మహాబలములతో ఆ రాష్ట్రమును చుట్టుముట్టి,
మణిగ్రహణలాలసులై ఉండిరి.
శనివారమున త్రయోదశి యందు రాజు,
మంత్రులతో కూడి,
ప్రదోషవేళ విధివిధానమున శంకరుని అర్చించుటకు నిశ్శకముగా కూర్చొని ఉన్నాడు.
ఆ రాజు హర్షముతో మహేశ్వరుని పూజించుచున్నాడు.
ఆ సమయమున శివ సందర్శనమునకై కొందరు గోపబాలురు వచ్చినారు.
ఆ పిల్లలు లింగపూజను చూసి, మరలా తమ పేటలో ఒక ప్రాంగణమున శివమందిరము నిర్మించి,
పాషాణ లింగమును సిద్ధపరచి,
దానిని భక్తితో వినోదంతో అర్చించారు.
ఆ పాషాణ లింగమునకు కల్పితోపచారాలు చేశారు.
లభించిన పత్రములతో పూజించినారు.
ఆ గోప బాలకులు కుతూహలంతో ఉదకమును నివేదించారు.
గోపస్త్రీలు, వారి కుమార్తెలు అచ్చటకు చేరి, ఆ గోపబాలకులను భోజనార్ధము ఇండ్లకు తీసుకొనిపోయినారు.
ఒక గోపబాలకుడు పూజ యందు ఆసక్తుడై,
ఇంటికి పోకపోవుటచేత,
వాని తల్లి వానిని కొట్టసాగింది.
ఆమె, కుమారా! ఇది భోజనవేళ.
రాత్రి చీకటిలో ఏమి చేయుచున్నావు అని కోపగించుకొని,
ఆ గోపిక ఆ ప్రాంగణము నందలి పూజను పాడుచేసి, పాషాణ లింగమును దూరంగా విసిరివైచి, తన ఇంటికి పోయినది.
ఆ విధముగా తల్లి చేయుట చూసి ఆ బాలుడు విలపించినాడు.
ఒక్క క్షణము అలానే ఉండి మూర్చితుడై భూమిపై పడినాడు.
చిత్తములో లింగమును భావించుచూ ప్రాణములు విడుచుటకు ఉద్యుక్తుడైన బాలునకు శూలపాణి ప్రసన్నుడై అనుగ్రహించాడు.
అప్పుడు ఆ ప్రాంగణము శివాలయము అయినది.
ఆ పాషాణ లింగము రత్నయుక్తమైనది.
లింగము సూర్యతేజస్సును చిమ్మగా ఆ బాలుడు మేల్కాంచినాడు.
గౌరీరమణుడు ఆ బాలుని నిజరూపముతో చేరి, లేవనెత్తి, అభీష్ట వరములను ప్రార్థింపుము అనినాడు.
శంభో! నీ పూజ నా తల్లి పాడుచేసినది.
క్షమించి నా తల్లిపై దయచూపుము.
అని బాలుడు కోరినాడు.
దయాళువైన ఈశ్వరుడు ప్రీతి చెంది,
ప్రదోషవేళలో నా పూజ చూసిన నీ తల్లి దేవమాత కాగలదు.
జన్మాంతరము నందు ఆమెకు విష్ణువు కుమారుడుగా, కృష్ణ రూపమున జన్మించును.
అని శంకరుడు చెప్పి,
బాలకా! నీవు కోరినది అంతయూ లభించును.
సకల సుఖములు అనుభవింపుము.
నీ వంశము నీవంటిదే అగును.
అని పలికిన గిరిజాపతి ప్రసన్నుడై వరములు అనుగ్రహించి,
తన పదారవిందములు చేపట్టిన బాలకుడు చూచుచుండగానే పరమేశ్వరుడు అంతర్ధానం చెందినాడు.
సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏


