*భాను వాసర (ఆది వారం) ఆనంద శుభోదయం.*
🪷🪷
*మాఘమాసం బహుళ సప్తమి.భాను సప్తమి, రవి వ్రతం, శబరి జయంతి*
🪷🪷
*రవి యోగం 5.58 a m.( 9.2.2026) వరకు*
🪷🪷
🙏🙏🙏
*8. 2. 1872*
భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్ *లార్డ్ మాయో* అండమాన్ దీవులలో పర్యటిస్తుండగా అక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న *షేర్ ఆలీ* చేతిలో చంపబడ్డాడు.🙏🙏
_______
*8. 2. 1936*
కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూని అధ్యక్షుడిగా ఎన్నుకుంది..
________
*8.2.1943*
*మనదేశంలో కాంగ్రెస్ పార్టీ, గాంధీతో సహా ఇతర పెద్దలు సహకరించక పోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం తన స్వంత ఏర్పాట్లను చేసుకోవడం ప్రారంభించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోగృహ నిర్బంధంలో ఉంచబడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరి కన్నుగప్పి దేశం విడిచి వెళ్లిపోయి వివిధ దేశాల పర్యటనలో భాగంగా 8.2.1943 తేదీన జపాన్ దేశానికి ప్రయాణం అయ్యారు.*
_______
*8.2.1967*
ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ముఖంపై *ఎవరో గుర్తు తెలియని వ్యక్తి* రాయితో దాడి చేశాడు. *ఆ రాయి చేసిన గాయం ఎన్నికలు పూర్తి అయ్యేవరకు కూడా తగ్గలేదు.(???)* "*ఆ గాయం కట్టుతోనే ఇందిరాగాంధీ పూర్తిగా ఎన్నికల ప్రచారం చేసుకున్నారు.(😇)* లోక్సభ ఎన్నికలలో చక్కటి మెజార్టీ సాధించి మరలా ప్రధానమంత్రి అయ్యారు.
👇👇👇
*అప్పటినుంచి రాజకీయ నాయకులు ప్రజాభిమానాన్ని పోగొట్టుకున్న సందర్భాలలో వాళ్లని ఆదుకోవడానికి ఈ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రాజకీయ నాయకుడి మీద దాడి చేసి మళ్లీ ఎన్నికల్లో ఆ రాజకీయ నాయకుడు గెలవడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి తెగ కష్టపడి పోతూ ఉన్నాడు. సామాన్య ప్రజలలో రాజకీయ చైతన్యం వచ్చే వరకు, ప్రజలకు మేలు చేసే నాయకుడు ఎవరని గుర్తించి ఓటు వేసే వరకు, ప్రజల అమాయకత్వాన్ని, జాలిగుండెని ఉపయోగించుకోవడానికి ఈ గుర్తు తెలియని వ్యక్తి ఎన్నికలలో కనబడుతూనే ఉంటాడు. ఇటీవల 2021 లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి, కాలు విరగకొట్టి పెద్ద పెద్ద కట్లు కట్టే వరకు సీన్ క్రియేట్ చేశాడు అంటే ఇతని విలువ ఏమిటో గమనించగలరు.*
😃😃🤪😃😃
______
*8.2.19 71*
*లోక్సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో తిరిగి విజయం సాధించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.*
________
🙏🙏🙏 #🇮🇳దేశం #😇My Status #చరిత్ర #చరిత్ర లో నేడు

