#😃మంచి మాటలు శంకర విజయం
పంతజలి మహర్షి సూత్రము
మైత్రీ కరుణా ముదితో పేక్షాణాం
సుఖ దుఃఖ పుణ్యా పుణ్య విషయాణాం
భావనాతశ్చిత్త ప్రసాదనమ్ (అను కూల స్వభావము)
ఆకాశాన మేఘాలు తొలగిపోగానే చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశవంతమై జనులకు ఆనందాన్ని కలిగిస్తున్నవి. ఆప్రకారంగా హృదయమందు రాగద్వేషాది కాలుష్యాలు నాశనమయ్యే సమయం రాగానే ప్రేమ,కరుణ అనే పరిశుద్ధ మైన గుణాలతో ప్రకాశిస్తుంది. చిత్తమందు రాగద్వేషాలు వున్నప్పుడు హృదయ కమలం వికసించక బురదలోనే వుండి పోతుంది. అటువంటి మలినమైన మనస్సు కలవారు శాంతిని పొందలేరు.
ఇహ, పరాలలో కూడా సుఖ పడలేరు. రాగద్వేషాది మాలిన్యాలను ,మనసు నుండి తొలగిస్తే పుణ్యాత్ములతో మైత్రీ, దీనజనుల పట్ల కరుణ ,తనకన్నా గొప్పవారిని చూసి అసూయ పడకుండుట ,పాపాత్ముల పట్ల ఉదాసీనత అనే సద్గుణాలు వృద్ధి చెందుతాయి. అట్టి మహాత్ములను దర్శించినంత మాత్రానే పరమ పవిత్రులై పరమశాంతిని పొందుతారు.
మైత్రీ ,, స్నేహం
మనలో ప్రతీ ఒక్కరిలోనూ ప్రత్యేకత వుంటుంది. ప్రతీ ఒక్కరి పట్ల స్నేహ పూర్వక వైఖరి జీవితంలో మానవసంబంధిత అనుభవాలు అందమైన అసంపూర్ణతలను జరుపుకోవడానికి మనకు సహాయపడుతుంది.
మనకందరికీ ఒకరినొకరుఅవసరమనే మన అవగాహనను మరింత పెంచుకోవడానికిస్నేహం మనకు అవకాశం యిస్తుంది కాబట్టి పుణ్యం,మరియు సుఖం పట్ల మైత్రి మరియు జీవితాన్ని సానుకూలమైన సంతోషకరమైన వ్యక్తుల పట్ల స్నేహం
కరుణ
యితరుల పట్ల కరుణ చూపడము అధ్యాత్మికమరియు వ్యక్తిగతఅభి వృద్ధికి ఒక ముఖ్యమైన సాధనము. యితరుల పట్లకరుణ చూపడము భావోద్వేగ అవగాహన మరియు బంధాన్ని పెంపొందించ డానికి సహాయ పడుతుంది
ముదిత ..ఆనందం
యితరుల పట్ల నిజంగా సంతోషంగా వుండటం ఒకరి స్వంత మానసిక శాంతి మరియు శ్రే యస్సుకు చాలా ముఖ్యమైనదిముదిత అనేది ఏ స్వార్ధంతోనూ కల్తీ లేని అనుభూతిని కలిగించే స్వచ్ఛమైన ఆనందం
ఉపేక్ష ,,ఉదాసీనత
మన చిత్తాన్ని సమన్వయం చేసుకోవడంలో సహాయపడుతుంది
పతంజలి మహర్షి సూచించిన నాలుగు సాధారణ సద్గుణ అభ్యాసాలు ,దీర్ఘ కాలిక ఆనందం ,సంతృప్తి మరియు అంతర్గత శాంతికి రహస్యాలను కలిగి వున్నాయి
సర్వతోముఖీ


