సమాజం లో అవసరం అని వినిపిస్తే మేమేమి చేయగలం అని ఆలోచించే వారు ఎందరో. అటువంటి మంచి వారి గురించి తెలుసుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. మా TALRadio సోషల్ మీడియా పేజెస్ లో ప్రతి రోజు ఎంతో మందిని పరిచయం చేస్తుంటాం.
ఇదిగో, సమాజం కోసం ఆలోచించే మరో మంచి వ్యక్తి గురించి మీ కోసం…
పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో, తోటివారి ఆకలి తీర్చడమే తన జీవితాశయంగా మార్చుకున్నారు ఒక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వేదికగా గత తొమ్మిదేళ్లుగా కోట దయానంద్ గారు సాగిస్తున్న ఈ అన్నదాన సేవ ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది. ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు ఆకలి బాధ తెలియకూడదనే సంకల్పంతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు ఒక మంచి సేవా కేంద్రంగా మారింది.
వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో దయానంద్ గారు, మరికొందరు విశ్రాంత ఉద్యోగులతో కలిసి ప్రతిరోజూ 300 నుండి 500 మందికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కేవలం మధ్యాహ్న భోజనానికే పరిమితం కాకుండా.. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి డిన్నర్ను కూడా ఉచితంగా అందిస్తూ పేదల పాలిట అన్నదాతగా మారారు.
#TALRadioTelugu #KotaDayanand #Annadanam #FoodForAll #HumanityInAction #ServiceToSociety #FeedingTheHungry #GoodNews #Inspiration #GoodNews #TALRadio #TouchALifeFoundation#🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్


