స్కూటీని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి...
హైదరాబాద్లోని మాదాపూర్లో మైండ్ స్పేస్ సమీపంలో రాత్రి స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఆగకుండా స్కూటీని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ దుర్ఘటనలో ఆయేషా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళకు చెందిన ఈ దంపతులు మహేశ్వరం సమీపంలో నివసిస్తూ మలబార్ గోల్డ్లో పనిచేస్తున్నారు. ప్రమాదం తర్వాత డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు క్లీనర్ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు... #🆕Current అప్డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ
00:35

