ShareChat
click to see wallet page
search
విశాఖపట్నం సాగర తీరంలో గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా ఈరోజు ఉదయం ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (IFR) కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారితో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. INS సుమేధ లో ప్రయాణిస్తూ, భారత నేవీ బృందం ప్రదర్శిస్తున్న విన్యాసాలను తిలకించారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ Ram Mohan Naidu Kinjarapu గారు, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు, తూర్పు నావికా దళ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ సంజయ్ భల్లా గారు, పశ్చిమ నావికా దళ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు హాజరయ్యారు. President of India PMO India Governor of Andhra Pradesh Andhra Pradesh CM Indian Navy Press Information Bureau - PIB, Government of India I & PR Andhra Pradesh #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - ShareChat