ShareChat
click to see wallet page
search
#📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు *స్త్రీనిధి రుణాలు పై ప్రత్యేక కథనం...* స్త్రీనిధి రుణాలు మంజూరులో అధికారుల జాప్యం- ప్రభుత్వ *ఆశయానికి తూట్లు- రుణాల కొరకు మహిళలు ఎదురు తెన్నులు* స్వయం సహాయక సంఘ సభ్యులకు ( డ్వాక్రా) స్వయం ఉపాధి, అత్యవసర ఆర్థిక అవసరాలకు రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ప్రభుత్వం ఆశయం నీరు కారుతోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సెర్ప్ ), స్త్రీ నిధి సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం మహిళల పాలిట శాపంగా మారింది. స్త్రీ నిధి ద్వారా మహిళా సభ్యులకు 48 గంటల్లోగా స్త్రీ నిధి రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా నెలలు గడుస్తున్నా వారికి రుణాలు అందటం లేదు. అలాగే ఎస్సీ ఎస్టీలకు చెందిన పేద మహిళలకు చేయూతనిచ్చే ఉన్నతి పథకం వుట్టెక్కింది. ఆ వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని వాపోతున్నారు . ప్రధానంగా కాట్రేనికోన మండలంలోని గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి రుణాలు సకాలంలో అందక ఇక్కట్లు పడుతున్నారు. మండల స్థాయి డ్వాక్రా ఆఫీసు నుండి జిల్లాస్థాయి ఆఫీస్ వరకు అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. నెలలు గడుస్తున్నా కొత్తగా స్త్రీ నిధి రుణాలు, పాతవి సైతం మంజూరు కావటం లో తీవ్ర జాప్యం వల్ల మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. సిబ్బంది ఒత్తిడి మేరకు రోజువారి వడ్డీలకు తెచ్చి రుణాలు తీర్చామని, రుణాలు అడిగితే కుంటి సాకులు చెబుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళలకు ఆర్థిక చేయూత కరువై నష్టపోతున్నారు. స్త్రీ నిధి అధికారులు బాధ్యతారాహిత్యం తో కాట్రేనికోన మండలంలో 100 మందికి పైగా మహిళా సభ్యులకు కోటి 54 లక్షల రుణాలు మంజూరు నిలిచిపోయింది. ఏనాడు రుణాలు వసూళ్లలో కింద సిబ్బందికి సూచనలు, పర్యవేక్షణ లేని స్త్రీని ధి అధికారులు వల్ల ప్రయోజనం శూన్యంగా ఉంది. కనీసం మహిళా సభ్యులకు అవగాహన కల్పించకపోవడంతో సకాలంలో రుణాలు వసూళ్లు అవటం లేదని అని తెలిసింది. చాలాచోట్ల శ్రీనిధి రుణాలు సొమ్ము దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన మహిళా సభ్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మహిళలకు సకాలంలో రుణాలు మంజూరు చేయరుగాని అమలాపురం స్త్రీ నిధి ఏజీఎం మాత్రం పూర్ రికవరీ అంటూ రిమార్కు వ్రాసి ఏకపక్షం గా రిజెక్ట్ చేస్తున్నారని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. పూర్ రికవరీ బాధ్యత ఎవరిదని, అధికారులదే పూర్ వర్క్ అని మహిళలు ఆరోపిస్తున్నారు. మండల స్థాయి డ్వాక్రా సిబ్బంది స్త్రీ నిధి రుణాలుకు వేలిముద్రలు తీసుకుని దరఖాస్తులు అప్లోడ్ చేసి నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా రేపు మాపు అంటూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులు పాలు చేస్తున్నారని, కనీసం పై అధికారులు రుణాలను రిజెక్ట్ చేసిన సమాచారాన్ని కూడా చెప్పడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మహిళా సాధికారత అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల్లోనూ ఇదే అనిచ్చిత పరిస్థితి నెలకొన్నట్లు డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. మహిళలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కనీసం ప్రజాప్రతినిధులైనా పట్టించుకోవడంలేదని వారు నిరసన తెలుపుతున్నారు. ఇకనైనా డిఆర్డిఏ, సెర్ప్ అధికారులు రుణాలు మంజూరు జాప్యం పై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని, వెంటనే రుణాలు అందించి ఆదుకోవాలని గ్రామాల మహిళలు కోరుతున్నారు. ఈ సమస్యపై అమలాపురం స్త్రీ నిధి ఏజీఎం హేమలతను వివరణ కోరగా గ్రామ సంఘాల్లో బకాయి ఉండటం వల్ల కొత్త రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. మండల స్థాయి డ్వాక్రా సిబ్బంది, సీసీలు, వి ఓఏలు సకాలంలో రుణ బకాయిలు వసూలు చేయటం లేదని, కొన్నిచోట్ల అక్రమాలు జరిగాయని, రుణ దరఖాస్తులకు సక్రమంగా డాక్యుమెంట్లు పెట్టడం లేదని తన దృష్టికి వచ్చిందని ఆమె అన్నారు. వచ్చేనెల ,3, 4తేదీలలో కాట్రేనికోన, ఐ.పోలవరం,ముమ్మిడివరం మండలాల్లోని గ్రామ సంఘాలలోని రుణ బకాయిలపై విచారణ చేసి అర్హులైన మహిళలందరికీ స్త్రీనిధి రుణాలు వెంటనే మంజూరు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - ShareChat