#✌️నేటి నా స్టేటస్ #🌍నా తెలంగాణ #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం :*
*తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి. అన్ని నృసింహ క్షేత్రాలలాగానే ఫాల్గుణమాసంలో ఆ స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవ, రథోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేలాది భక్తులు ఆ సందర్భంలో స్వామిని దర్శించుకుంటారు.*
*యాదగిరిగుట్ట ఆలయం త్రేతాయుగ కాలం నాటిది. శ్రీరాముని బావగారైన ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదర్షి. ఆయన తపస్సు వల్లనే లక్ష్మీనరసింహ స్వామి యాదగిరిపై పంచనారసింహ రూపాలలో వెలిశాడు. ఆనాడు యాదమహర్షి చూసిన ఉగ్రనారసింహ రూపమే యాదగిరి గుట్ట అయిందని చెబుతారు. యాదాద్రికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. ఆయన ఆజ్ఞ మేరకే యాదర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చాడు. యాదర్షి తపస్సుకు కూడా ఆంజనేయుడు ఎంతో సహాయం చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. యాదాద్రిలో ప్రసన్నాంజనేయుని మనం దర్శించుకోవచ్చు. అక్కడే గండభేరుండ స్వామి దర్శనం కూడా అవుతుంది. ఆయనకు ప్రదక్షిణలు చేస్తే సర్వరోగాలు, భూతప్రేత పిశాచాదుల బాధలు పోతాయి. యోగానంద నారసింహుడు దక్షిణాభిముఖుడై యోగముద్రలో జ్ఞానదాయకునిగా ప్రసిద్ధి పొందాడు. దేవప్రాచీదిశలో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి దర్శన మాత్రంతో కోరికలను నెరవేరుస్తాడు. రెండు శిలాఫలకాల మధ్య సర్పాకారంలో శ్రీచూర్ణరేఖను ధరించివున్న రూపం జ్వాలానృసింహమూర్తి. ఇక యాదాద్రి కొండంతా ఆవరించివున్న మహారూపం ఉగ్రనృసింహమూర్తి. మూలమూర్తిగా విరాజిల్లుతున్న స్వయం భూనృసింహమూర్తి ఈ పంచనృసింహుల సమ్మేళన రూపం. ఆనాటి ఆనవాళ్లు ఎన్నెన్నో... సర్వాంతర్యామి అయిన శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుని కోరికమేరకు నారసింహరూపం ధరించాడు. యాదగిరిగుట్టలోని గుహలో కృతయుగం నుంచి స్వామి ఉండేవాడని ప్రతీతి. ఆ స్వామి వారిని ఆనాడు బ్రహ్మాది దేవతలు ఆకాశగంగతో అభిషేకం చేశారు. ఆ పవిత్ర పాదతీర్థం విష్ణుకుండమై పవిత్ర దివ్యధారగా యాదాద్రిలో నేటికీ భక్తులను పునీతులను చేస్తోంది. నేడు అంగరంగ వైభవంగా జరుగనున్న యాదాద్రి*
*లక్ష్మీనృసింహస్వామి కల్యాణం*
*┈┉━❀꧁లక్ష్మి నృసింహ꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🪔🍁 🙏🕉️🙏 🍁🪔🍁


