మహబూబ్నగర్ జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్కు కొత్త శునకం “సింధు” చేరిక – మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసిన సందర్భం
మహబూబ్నగర్ జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్కు ప్రత్యేక శిక్షణ పొందిన ఎక్స్ప్లోసివ్ గుర్తింపు శునకం *“సింధు”*ను కేటాయించిన సందర్భంగా, డాగ్ హ్యాండ్లర్ పీసీ 2752 కిషోర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో 8 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసిన “సింధు” పేలుడు పదార్థాల గుర్తింపులో ప్రత్యేక నైపుణ్యం సాధించి జిల్లా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ కృష్ణయ్య పాల్గొన్నారు. జిల్లా పోలీస్ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా డాగ్ స్క్వాడ్ బలోపేతం కీలకమని అధికారులు పేర్కొన్నారు.
“సింధు” చేరికతో భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా అమలవుతూ ప్రజల రక్షణలో పోలీస్ శాఖకు అదనపు బలం చేకూరనుంది.
#MahabubnagarPolice #DogSquad #PublicSafety #📰 వార్తలు

