#🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
*బ్రహ్మసమేధ్యం లో మరుగుదొడ్లు సొమ్ము దుర్వినియోగం పట్టదా..???*
శాఖాపరమైన చర్యలు ఏవీ..???
*ముందుకు సాగని పోలీసు దర్యాప్తు...*
ప్రజల పారిశుధ్య అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన ప్రభుత్వ సొమ్ము లక్షల్లో దుర్వినియోగమైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకుండా ఉదాసీనం గా వ్యవహరిస్తున్నారు. కాట్రేనికోన మండలం, బ్రహ్మసమేధ్యం పంచాయతీలో స్వచ్ఛ భారత్ పథకంలో మరుగుదొడ్లు సొమ్ము55 లక్షల55 వేలు దుర్వినియోగమై ఏడాది దాటినా పంచాయతీ అధికారులు గుర్తించలేదు. ఈ నెల 10న అప్పటి పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్ సొమ్ము దుర్వినియోగంపై కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్ ఇసుక పట్ల నాగేంద్ర చెక్కుల అపహరించి ఫోర్జరీ సంతకాలతో బంధువులు, ఇతరుల పేరన బ్యాంకులో సొమ్మును కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎస్సై అవినాష్ విచారణ చేపట్టారు. ఈ కేసులో సంబంధం ఉన్న వారిని పోలీసులు పిలిచి ఆరా తీస్తున్నారు. అయితే ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అసలు నిందితుడు నాగేంద్ర పరారీలో ఉన్నాడు. నాగేంద్ర పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.ఇంత భారీ కుంభకోణం జరిగినా పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం శాఖ పరమైన విచారణకు ఆదేశించలేదు. ఇందుకు బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు నిధులు దుర్వినియోగంపై రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయగా అమలాపురం డిఎల్పిఓ ఆ ఫిర్యాదును తనకు పంపారని కాట్రేనికోన ఈ ఓ పి ఆర్ డి శంకరనారాయణ శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. పంచాయతీకి వెళ్లి పరిశీలించాల్సి ఉందన్నారు. ఇంతవరకు అధికారుల నుండి శాఖా పరమైన విచారణకు ఆదేశాలు రాలేదని ఈవోపీఆర్డీ చెప్పారు.నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చి 18 రోజులైనా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, కనీసం శాఖాపరమైన విచారణ చేపట్టలేదని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. లక్షల కుంభకోణం జరిగినా ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సూత్రధారి అయిన కంప్యూటర్ ఆపరేటర్ నాగేంద్ర ను పట్టుకోవడంలో కాలయాపన జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిధులు దుర్వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యదర్శి శ్రీనివాస్ ఇక్కడ నుండి బదిలీ అయి 15 నెలల దాటినా రికార్డులు కొత్త కార్యదర్శి కి అప్పగించడం లో జాప్యం , చెక్కు బుక్కులు కార్యదర్శి స్వాధీనంలో ఉండాల్సి ఉండగా కంప్యూటర్ ఆపరేటర్ అపహరించి,సంతకాలు పార్జరీ చేయడం వంటి సంఘటనలు పలు అనుమానాలుకు తావిస్తున్నాయి. పంచాయితీ, మండల పరిషత్ అధికారులు అజామాయిషి, తనిఖీ లోపం వళ్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు లేకపోలేదు. సామాన్యుడు బ్యాంకుకు చెక్కు పట్టుకెళ్తే నానా ప్రశ్నలు వేసి పలు ఆధారాలు ఇస్తేనే గాని సొమ్ము ఇవ్వని బ్యాంకు అధికారులు ఫోర్జరీ సంతకాలు కనిపెట్టకుండా లక్షలు సొమ్ము ఎలా ఇచ్చారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కాట్రేనికోన ఎస్బిఐ బ్రాంచ్ అధికారులు పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో ప్రజల మరుగుదొడ్లు నిర్మాణానికి వెచ్చించాల్సిన సొమ్ము 55 లక్షలు 55,000 దుర్వినియోగమైనా ఏడాదికి పైగా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం పైనా అనుమానాలు వెల్లువెత్తు తున్నాయి. ఇంత జరిగినా పంచాయతీ, మండల పరిషత్ అధికారులకు పట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా లక్షల సొమ్ము దుర్వినియోగంపై అధికారులు పూర్తిస్థాయిలో వెంటనే విచారణ జరిపించి అసలు దోషులను శిక్షించాలని, నిధులను రాబట్టి స్థానికంగా మరుగుదొడ్లు నిర్మించాలని బ్రహ్మసమేధ్యం పంచాయితీ ప్రజలు కోరుతున్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


